యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలిలో సీనియర్ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు కల్పించడంపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆలయ పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తికి ఎలా అవకాశం కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల నిధులతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన యాదాద్రి ఆలయ పాలకమండలిలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి సభ్యత్వం ఇవ్వడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు భాగస్వామ్యం ఉండే పరిస్థితి ఉందని కవిత పేర్కొన్నారు. అయితే యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల నిధులతో అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. అలాంటి ఆలయ పాలకమండలిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఎలా సభ్యత్వం కల్పిస్తారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చడంపై అప్పట్లో రేవంత్రెడ్డి చేసిన విమర్శలను కవిత ప్రస్తావించారు. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా ఎలా మారుస్తారని ప్రశ్నించిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు అదే యాదాద్రి ఆలయ పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ సినీ నటుడి భార్యకు సభ్యత్వం ఎలా కల్పించారని ఆమె నిలదీశారు.
This post was last modified on August 27, 2026 4:05 pm
అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…
దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే 25 ఏళ్ల…
రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్లో గతానికి భిన్నమైన `వ్యక్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందిరమ్మ హయాంలో…
కీలకమైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులనే…
దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా…
నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…