Political News

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. వివేకా హత్యకు 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినట్లు విచారణలో అనుమానాలు రేకెత్తడంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తుంది. దీంతో ఈ నిధుల వెనక ఎవరున్నారు అనే కోణంలో విచారణ కొనసాగుతుండటంతో వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. చివరికి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఈ కథ ఎక్కడికి వెళుతుందోనని చర్చించుకుంటున్నారు.

వివేకానంద రెడ్డి వైసీపీలో క్రియాశీలం కావడంతో ఆయన ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. శివశంకర్ రెడ్డి ఈ కుట్ర చేశారని, హత్య చేస్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పాడని అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఇచ్చే సందర్బంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దస్తగిరికి 5 కోట్లు ఇస్తామని ఆశ చూపించి కొంత నగదు అడ్వాన్స్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఇప్పటికే దస్తగిరి నుంచి 46.70 లక్షల రూపాయలను సిబిఐ స్వాధీనం చేసుకుంది. ఈ నగదును ఆధారం చేసుకొని ఈడీ విచారణ నిర్వహిస్తుంది. నగదు లావాదేవీల తీగ లాగేందుకు ఎంపీ అవినాష్ ఇంటిలో తనిఖీలు చేపట్టింది.

హైదరాబాద్ జోనల్ పరిధిలోని ఈడీ అధికారులు నిర్వహించిన ఈ దాడుల్లో కీలక డాక్యూమెంట్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, డి. శివశంకర్ రెడ్డి, వై. సునీల్ యాదవ్ లపై సిబిఐ చార్జ్ షీట్ నిందితులుగా చేర్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ మనీ లాండరింగ్ కోణంలో తనదైన శైలిలో విచారణ చేస్తుంది. వివేకానంద రెడ్డి హత్యకు ఉపయోగించిన డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి, ఆ నిధులు సమాకూర్చిన అసలు వ్యక్తులు ఎవరు, పెద్ద తలకాయలు ఎవరైనా వున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ తో పాటు వైఎస్సార్ జిల్లాలోని మొత్తం 7 చోట్ల శుక్రవారం తనిఖీలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తుంది . అవినాష్ రెడ్డికి సంబందించిన హైదరాబాద్ కోకాపేట గోల్డెన్ మైన్ రోడ్డులోని ఓపెన్ స్కై స్పేస్ అపార్ట్మెంట్లోగల నివాసంలోనూ, పులివెందులలోని నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అవినాష్ నివాసం నుంచి లెక్క చూపని 24 లక్షల నగదు, రెండు బ్యాంక్ లాకర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. డిజిటల్ పరికరాలు సైతం స్వాధీనం చేసుకున్నట్లు వినికిడి. ఈ మొత్తం పరిణామాలతో వైసీపీ ఉలిక్కి పడింది. వివేకానంద కేసును తిరగతోడుతున్నారన్న సంకేతాలతో ఆ పార్టీలో ఆందోళన కనిపిస్తుంది.

This post was last modified on August 22, 2026 11:20 pm

Share

Recent Posts

అన్ని స‌ర్వేల‌దీ అదే దారి.. వైసీపీ మౌనం అందుకేనా?

రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి రెండున్న‌రేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవ‌రికి ద‌క్కుతుంది? అనే…

2 hours ago

నాడు చెల్లి.. నేడు మిత్రుడు.. జ‌గ‌న్‌కు సెగ పెంచేస్తున్నారు!

ఏపీ విప‌క్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీలో అంత‌ర్గ‌త పోరు ఎక్కువ‌గా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా…

3 hours ago

ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌.. ల‌క్ష‌ల మంది వీధిపాలు.. కార‌ణాలేంటి?

ఒక‌టి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. ల‌క్ష‌ల్లోనే ఉద్యోగాలకు ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లు మంగ‌ళం పాడుతున్నాయి. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫోక్స్…

6 hours ago

బుల్లితెరపైనే కాదు… వెండితెరపైనా సంచలనమే

ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…

8 hours ago

జీవితంలో ఈటీవీ చూడ‌ననుకున్న విజ‌య్…

తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన టీవీ ఛానెళ్ల‌లో ఈటీవీ ఒక‌టి. 90వ ద‌శ‌కంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…

8 hours ago

హై హై నాయకా… అది ఏం నాలుక?

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…

8 hours ago