Political News

28వ వ‌ర‌కు లాక్ డౌన్… కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం?

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది. అధికారిక స‌మాచారం వెలువ‌డాల్సి ఉన్న‌ప్ప‌టికీ…లాక్ డౌన్ కొన‌సాగింపు విష‌యంలో ఆయ‌నో క్లారిటీకి వ‌చ్చార‌ని అంటున్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు, ఆర్థికపరంగా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించడానికి రాష్ట్ర మంత్రివర్గం స‌మావేశం అయింది. అయితే, ఇప్ప‌టికే తెలంగాణ సీఎం ఓ నిర్ణ‌‌యానికి వ‌చ్చార‌ట‌. ఈనెల 28వ వ‌ర‌కూ లాక్ డౌణ్ కొన‌సాగించాల‌నేది తెలంగాణ‌ ముఖ్యమంత్రి నిర్ణ‌యం సారాంశం.

కేంద్రం మూడు దఫాలుగా విధించిన లాక్‌డౌన్‌ను చివరిసారిగా ఈ నెల 17వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులను ప్రకటించింది. కరోనా కేసులు లేని ప్రాంతాలలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ‌వ్వడంతోపాటు, పలు ఇతర రంగాలలో యథావిధిగా పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు అనుమతిస్తూ కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది.

తెలంగాణ‌ రాష్ట్రంలో నెలన్నర రోజులకుపైగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ కరోనా విస్తరణకు కళ్లెం పడకపోగా ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు కరోనా రోగులకు పూర్తిస్థాయి చికిత్స అందిస్తూనే మరోవైపు వైరస్‌ విస్తరణను అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలపై చర్చించి లాక్‌డౌన్‌ కొనసాగింపుపై నిర్ణయించేందుకు తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం అయింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఒకరోజు తగ్గడం, మరొకరోజు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగించడమే మంచిదని ఆరోగ్యశాఖ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మరికొన్ని రోజులు కొనసాగటం అనివార్యంగా కనిపిస్తోంద‌ని తెలంగాణ సీఎం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌కారం ఈనెల 28 వ‌ర‌కూ లాక్ డౌన్ కొన‌సాగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

This post was last modified on May 5, 2020 4:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

16 minutes ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

1 hour ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

2 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

3 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

3 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

3 hours ago