Political News

విజయసాయి కొత్త పార్టీ… వైసీపీలో గుబులు?

ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్థాప్ పెట్టారు. వైసీపీలో జగన్ తర్వాత నెంబర్ టూ స్థాయికి చేరుకొన్న ఆయన అత్యంత కీలకంగా వ్యవహారించారు. 2019 లో వైసీపీ అధికారంలోకి రావడంలో ఎంతో క్రియాశీల పాత్ర పోషించారు. వచ్చిన తర్వాత అదే స్థాయిలో ఢిల్లీలో చక్రం తిప్పారు. వైసీపీ పార్టీలోనే కాకుండా జగన్ కేసుల్లో కూడా విజయసాయి వున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయనకు జగన్ కు మధ్య ఎక్కడో చెడింది. దాంతో ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు.

రాజకీయాలకు కొంతకాలం దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోనున్నట్లు తెలిపారు. అయినప్పటికీ అడపా దడపా సోషల్ మీడియాలో పొలిటికల్ కామెంట్స్ తో దుమారం రేపుతూ వస్తున్నారు. కొంతకాలం వైసీపీ మీద పరోక్ష విమర్శలు గుప్పించారు. దాంతో ఆయన టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. టీడీపీలో చేరడానికి చర్చలు జరుతున్నట్లు గుసగుసలు వినిపించాయి. సీఎం చంద్రబాబు ఆయనను పార్టీలోకి తీసుకుందుకు ఇష్టపడలేదని సమాచారం. అంతలోనే కథ యూ టర్న్ తిరిగింది. అంతలోనే మళ్ళీ కొత్త ప్రచారం ఊపండుకుంది. విజయసాయి బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు కొత్త ప్రచారం మొదలైంది.

విజయసాయి కూడా బీజేపీకి ఇష్టమైన రీతిలో హిందుత్వ ఎజెండా బేస్ గా ప్రకటనలు ఇవ్వడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. రేపో మాపో బీజేపీ కండువా కప్పుకుంటారని అనుకుంటున్న తరుణంలో విజయసాయి మళ్ళీ వైసీపీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మీడియాలో వైరల్ అయ్యింది.

ఇన్ని రకాల ఊగిసలాటల తర్వాత విజయసాయి సొంత పార్టీ పెట్టడానికే నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రజా వాణిని వినిపించేందుకు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. కొత్త పార్టీ ఏర్పాటు, లక్ష్యాల గురించి త్వరలో విజయవాడ వేదికగా ప్రకటించనున్నట్లు తెలిపారు.

విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన వైసీపీ నాయకుల్లో గుబులు రేపుతోంది. టీడీపీ సానుభూతి పరులు విజయసాయి పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం లేదు. అయితే గియితే వైసీపీ, కాంగ్రెస్ శ్రేణులే అటువైపు అడుగులు వేయొచ్చు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓట్లకు భారీ గండి పడే అవకాశాలు కూడా వున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

This post was last modified on August 19, 2026 3:03 pm

Share

Recent Posts

తెలంగాణ సింగిల్ స్క్రీన్ల రేట్లు పెరుగుతాయా?

మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైన‌పుడు అద‌న‌పు…

45 minutes ago

మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…

3 hours ago

ఇరుకైన మనసుంటే థియేటర్లు ఎలా వస్తాయి

మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…

3 hours ago

బొత్స వారసురాలి రాజకీయ రంగ ప్రవేశం

మన దేశంలో రాజకీయ వారసత్వం సర్వ సాధారణం. సినిమాల్లో నెపోటిజం మాదిరిగానే పొలిటికల్ నెపోటిజం వల్ల వచ్చిన పొలిటిషియన్లు చాలామంది…

4 hours ago

నాయకుడు లేకుండా యుద్ధం ఎలా జగన్?

స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్‌ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్‌ ఇస్తున్న…

4 hours ago

సిద్దార్థ్ సిరీస్ బాగా ట్రెండ్ అవుతోంది

సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…

5 hours ago