Political News

విజయసాయి కొత్త పార్టీ… వైసీపీలో గుబులు?

ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్థాప్ పెట్టారు. వైసీపీలో జగన్ తర్వాత నెంబర్ టూ స్థాయికి చేరుకొన్న ఆయన అత్యంత కీలకంగా వ్యవహారించారు. 2019 లో వైసీపీ అధికారంలోకి రావడంలో ఎంతో క్రియాశీల పాత్ర పోషించారు. వచ్చిన తర్వాత అదే స్థాయిలో ఢిల్లీలో చక్రం తిప్పారు. వైసీపీ పార్టీలోనే కాకుండా జగన్ కేసుల్లో కూడా విజయసాయి వున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయనకు జగన్ కు మధ్య ఎక్కడో చెడింది. దాంతో ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు.

రాజకీయాలకు కొంతకాలం దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోనున్నట్లు తెలిపారు. అయినప్పటికీ అడపా దడపా సోషల్ మీడియాలో పొలిటికల్ కామెంట్స్ తో దుమారం రేపుతూ వస్తున్నారు. కొంతకాలం వైసీపీ మీద పరోక్ష విమర్శలు గుప్పించారు. దాంతో ఆయన టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. టీడీపీలో చేరడానికి చర్చలు జరుతున్నట్లు గుసగుసలు వినిపించాయి. సీఎం చంద్రబాబు ఆయనను పార్టీలోకి తీసుకుందుకు ఇష్టపడలేదని సమాచారం. అంతలోనే కథ యూ టర్న్ తిరిగింది. అంతలోనే మళ్ళీ కొత్త ప్రచారం ఊపండుకుంది. విజయసాయి బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు కొత్త ప్రచారం మొదలైంది.

విజయసాయి కూడా బీజేపీకి ఇష్టమైన రీతిలో హిందుత్వ ఎజెండా బేస్ గా ప్రకటనలు ఇవ్వడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. రేపో మాపో బీజేపీ కండువా కప్పుకుంటారని అనుకుంటున్న తరుణంలో విజయసాయి మళ్ళీ వైసీపీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మీడియాలో వైరల్ అయ్యింది.

ఇన్ని రకాల ఊగిసలాటల తర్వాత విజయసాయి సొంత పార్టీ పెట్టడానికే నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రజా వాణిని వినిపించేందుకు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. కొత్త పార్టీ ఏర్పాటు, లక్ష్యాల గురించి త్వరలో విజయవాడ వేదికగా ప్రకటించనున్నట్లు తెలిపారు.

విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన వైసీపీ నాయకుల్లో గుబులు రేపుతోంది. టీడీపీ సానుభూతి పరులు విజయసాయి పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం లేదు. అయితే గియితే వైసీపీ, కాంగ్రెస్ శ్రేణులే అటువైపు అడుగులు వేయొచ్చు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓట్లకు భారీ గండి పడే అవకాశాలు కూడా వున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

This post was last modified on August 19, 2026 3:03 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 minute ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

16 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

17 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

1 hour ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago