మల్లారెడ్డి విద్యాసంస్థలను ఏపీకి కూడా విస్తరించారు మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి. తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కుటుంబ సపరివారసమేతంగా తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు మల్లారెడ్డి. ఈ సందర్భంగా మన ఆంధ్రాలో కూడా మన తెలుగు బిడ్డలు మంచి ఇంజనీర్లు, డాక్టర్లు కావాలన్న తపనతో ఇక్కడ యూనివర్సిటీ పెట్టామని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
గతంలో మన తెలంగాణ బిడ్డలు అని సంబోధించే మల్లారెడ్డి ఈ రోజుల మన ఆంధ్రా..మన తెలుగు బిడ్డలు అని సంబోధించడం మంచి పరిణామం. ఇక, బీఆర్ఎస్ సీనియర్ నేత అయిన మల్లారెడ్డి ఆంధ్రాలో తన విద్యాసంస్థలను విస్తరించాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక, తన యూనివర్సిటీకి మంచి స్థలం దొరికిందని, మంచి అడ్మిషన్లు అయ్యాయని మల్లారెడ్డి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
గత ఏడాది తన పుట్టిన రోజు నాడు తిరుపతి వచ్చి మొక్కానని, ఈ ఏడాదికి యూనివర్సిటీ పూర్తయిందని చెప్పారు. వర్సిటీ కోసం స్థలంతో పాటు అనుమతులు కూడా త్వరగా దొరికాయని చెప్పారు. అడ్మిషన్లు కూడా బాగా జరిగాయని, అందుకే కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుందామని వచ్చానని అన్నారు. తెలంగాణలో 50 వేల మంది స్టూడెండ్స్, 10 వేల మంది టీచర్లు ఉన్నారని తెలిపారు. ఏపీలో మొదటి యూనివర్సిటీ పెట్టానని, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లు, డాక్టర్లు తయారు చేయాలన్న సంకల్పంతోనే ఈ వర్సిటీ ఏర్పాటు చేశానని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates