తెలుగు సినిమా నటులు రాజకీయాలు చేయడం ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ ఈ మధ్య పరిస్థితులు మారిపోయాయి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చూడట్లేదు జనం. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే.. ఆ ప్రభావం వారి సినిమాల మీదా పడుతోంది. ఇలా కెరీర్ను దెబ్బ తీసుకున్న వాళ్లలో ఆలీ కూడా ఒకరు. ఆయన చాలా ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తర్వాత తన మిత్రుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనలోకి వస్తారని అనుకుంటే.. అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.
వైసీపీ గెలిచాక ఒక పదవిలో ఉన్న ఆయన.. ఆ పార్టీ ఓడిపోయాక రాజకీయాల నుంచి వైదొలిగారు. ఇకపై మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేదే లేదంటున్నారు. మరి రాజకీయా పట్ల ఎందుకు విముఖత పెంచుకున్నారు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే.. ఆలీ సమాధానం చెప్పారు. తాను మొదట పనిచేసిన పార్టీ పట్ల తన అసంతృప్తిని బయటపెట్టుకున్నారు. రాజకీయాల వల్ల సినిమా కెరీర్ దెబ్బ తిన్న విషయాన్ని అంగీకరించారు.
‘‘నేనెప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. 1999లో ఒక పార్టీ వాళ్లు నన్ను తీసుకెళ్లి ఆ పార్టీ కండువా కప్పారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నాను. ఐతే నాకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. కేవలం ఐదేళ్లకోసారి ఎన్నికలు వచ్చినపుడు నన్ను ఉపయోగించుకోవడం, తర్వాత వదిలేయడం.. ఇదే జరిగింది. మనల్ని వాళ్లు గుర్తించనపుడు, మనల్ని అవసరానికి వాడుకుని వదిలేస్తున్నపుడు మన సమయాన్ని వాళ్ల కోసం ఎందుకు వేస్ట్ చేయడం అనిపించింది. సినిమాలను పక్కన పెట్టి, టైం పెట్టి ఇలా కష్టపడడం ఎందుకు అనిపించింది. అందుకే ఆ పార్టీ నుంచి పక్కకు వచ్చేశాను.
తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్లాను. అక్కడా పని చేశాను. మళ్లీ అది కూడా వద్దనిపించింది. మనకు తిండి పెట్టింది, ఇంతవాడిని చేసింది సినిమా. రాజకీయాల కోసం సినిమాలను ఎందుకు వదులుకోవాలి. ఈ కెరీర్ను ఎందుకు దెబ్బ తీసుకోవాలి అనిపించింది. అందుకే రాజకీయాల నుంచి పూర్తిగా బయటికి వచ్చేశాను. ఇకపై మళ్లీ ఆ రంగంలోకి వెళ్లను’’ అని ఆలీ తేల్చి చెప్పాడు.
This post was last modified on August 8, 2026 3:55 pm
హైదరాబాద్ లో రోజురోజుకూ పాశ్చత్య సంస్కృతీ పెరిగిపోతుంది. కో లివింగ్ పీజీలు ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఉద్యోగం, చదువు…
ఈ వారం భారీ సినిమాల ట్రైలర్లు వరసగా రోజుకొకటి సందడి చేశాయి. అన్నీ పెద్ద అంచనాలు పెట్టుకున్న చిత్రాలు కావడంతో…
కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినా అవి థియేట్రికల్ గా భారీ రెవెన్యూలు చూపించకపోవచ్చు. అంత మాత్రాన వాటిని ఫ్లాప్…
ఒకప్పుడు లక్షలాది రూపాయల కట్నకానుకలు ముట్టచెబితేనే కానీ అమ్మాయిల పెళ్లిళ్లు కావడం కష్టమయ్యేది. లేకపోతే అత్తారింటి వేధింపులు భరించాల్సి వచ్చేది.…
500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత భారత దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు వీధిలో కూరగాయల…
2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు పార్టీల…