తుని నియోజకవర్గం కొత్తపాకలలో దివీస్ పరిశ్రమ ఏర్పాటుపై ఆందోళన జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దివీస్ బాధితుల నిరసనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు తెలుపుతూ ఈరోజు తూర్పుగోదావరిలో పర్యటించారు. ఈ క్రమంలో సీఎం జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాదయాత్రలు చేసే జగన్ ప్రజలపై ప్రేమను ముద్దులతో చూపుతారని, కానీ ఆయన ప్రేమ పాలసీల రూపంలో చూపించాలని ఎద్దేవా చేశారు. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందిపడుతుంటే జగన్ మోహన్ రెడ్డి వారికి ఎందుకు న్యాయం చేయడం లేదని పవన్ ప్రశ్నించారు. దివీస్ భూములు జగన్, వైసీపీ నేతల సొత్తా అని ప్రశ్నించారు. దివీస్ సంస్థకు వ్యతిరేకంగా పోరాడి భూములివ్వని 36 మంది రైతులను విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. తాము కార్పొరేట్ వ్యవస్థలకు వ్యతిరేకం కాదన్న పవన్ ప్రజల కన్నీళ్లపై వ్యాపారవేత్తల ఎదుగుదల మంచిది కాదన్నారు.
తాను కూడా వైసీపీ నాయకుల్లా మాట్లాడగలనని, అది తన సంస్కారం కాదని పవన్ అన్నారు. పోలీసుల తీరును తప్పుపట్టబోమని, నిన్న సభకు అనుమతిస్తామని, ఈరోజు నిరాకరించడం సరికాదని అన్నారు. పోలీసులపై ప్రభుత్వ ఒత్తిడిని ఈ ఘటన తెలియజేస్తుందని తెలిపారు. పర్యావరణానికి హాని చేసే పరిశ్రమలకు తాము వ్యతిరేకం అని చెప్పారు. సముద్రంలో వ్యర్థాలను కలుపుతామంటే ఒప్పుకోబోమన్నారు. మరోవైపు, పవన్ పర్యటన నేపథ్యంలోనే దివిస్ ల్యాబరేటరిస్కు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ రాసింది. స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూపే ఎటువంటి వ్యర్ధాలను విడుదల చేయోద్దని లేఖలో సూచించింది. హ్యాచరీస్ కారణంగా గ్రామీణ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని.. వ్యర్థాల కారణంగా వారు ఆ అవకాశాలు కోల్పోయే ఛాన్స్ ఉందని భావిస్తున్నట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ తెలిపారు.
This post was last modified on January 10, 2021 12:27 am
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…
క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…