Political News

బోండా గండం గట్టేక్కినట్లే

గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం వర్ధంతి సభలో విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఇపుడు తెలుగునాట చర్చనీయంశంగా మారింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం టీడీపీలో నిప్పు రాజేసింది. కేవలం వేదిక పంచుకోవడం మాత్రమే కాకుండా అత్యంత సన్నిహితంగా మెలగడాన్ని అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు.

ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బోండా ఉమా పార్టీ మారే అవకాశం ఉందని, త్వరలోనే వైసీపీ గూటికి చేరానున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న సమయంలో బోండా కనుక పార్టీ మారితే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన సీఎం చంద్రబాబు వెంటనే అప్రమత్తం అయ్యారు.

ఇది పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు అందిస్తుందని భావించిన చంద్రబాబు వెంటనే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును, మంత్రి రామా నాయుడును రంగంలోకి దించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన టీడీపీ బృందం బోండా ఉమాతో చర్చింది. అధిష్టానం అభిప్రాయాన్ని తెలియజేసింది. దీంతో యవ్వారం ముదరక ముందే సమసి పోయింది.

పార్టీ లైన్ దాటేది లేదు…

పార్టీ బృందంతో చర్చించిన ఎమ్మెల్యే బోండా ఉమా ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పార్టీ గీత దాటేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని, ఇకముందు వైసీపీ నేతలతో వేదిక పంచుకోకుండా జాగ్రత పడతానని తేల్చి చెప్పారు. దాంతో ఏదో జరిగిపోతుందని ఆందోళన చెందిన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది.

ముందే హెచ్చరించిన చంద్రబాబు…

వైసీపీ నాయకులతో సన్నిహితంగా మెలగ వద్దని సీఎం చంద్రబాబు ముందే హెచ్చరించి వున్నారు. క్షేత్ర స్థాయిలో కూడా వైసీపీ నాయకులను దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు. వారికి పనులు చేసి పెడితే పాముకు పాలు పోసినట్లేనని హెచ్చరించివున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులతో దూరంగా వుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన అంబటి రాంబాబుతో రాసుకొని పూసుకొని తిరగడం టీడీపీలో కలకలం సృష్టించింది. ఇది తుపానుగా మారకుండా చంద్రబాబు చాణిక్యం ప్రదర్శించడంతో బోండా గండం గట్టెక్కి నట్లయ్యిందని చెప్పొచ్చు.

This post was last modified on July 28, 2026 11:38 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

15 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

30 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

30 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago