Political News

వివేకా హ‌త్య‌… సునీత గోడు అర‌ణ్య రోద‌న‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్ బాబాయి, మాజీ మంత్రి వివేకా నంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి ఆయ‌న కుమార్తె, డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత‌ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు కొట్టివేసింది. “ఇంకా సాగ‌దీయ‌డం స‌రికాదు. ఇక చాలు.“ అని కోర్టు వ్యాఖ్యానించిన‌ట్టు సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాదులు పేర్కొన్నారు. అయితే.. త‌న తండ్రి హ‌త్య‌కు సంబంధించి న్యాయం జ‌రిగే వ‌ర‌కు త‌న పోరు ఆగ‌ద‌ని సునీత స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో మ‌రోసారి సుప్రీంకోర్టుకు వెళ్ల‌నున్న‌ట్టు ఆమె తెలిపారు. దీంతో వివేకా హ‌త్య కేసు వ్య‌వ‌హారంలో ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.

తాజా కేసు ఏంటి?

తాజా ఘ‌ట‌న విష‌యానికి వ‌స్తే.. 2019, మార్చిలో వివేకా.. పులివెందుల‌లోని త‌న సొంత ఇంట్లో దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. దీనిని సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ద‌ర్యాప్తు చేసింది. అనేక మ‌లుపులు తిరిగిన ఈ కేసులో వంద‌లాది మంది సాక్షుల‌ను సీబీఐ అధికారులు విచారించారు. అనంత‌రం.. గ‌త ఏడాదే చార్జి షీట్ కూడా దాఖ‌లు చేశారు. అయితే.. ఈ కేసులో నిందితులు అనేక మంది ఉన్నార‌ని.. వారిని కూడా విచారించాల‌ని సునీత కోరారు. కానీ, సీబీఐ త‌న గోడు వినిపించుకోలేద‌ని పేర్కొంటూ ఆమె.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరారు.

ఈ క్ర‌మంలో ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించాల‌ని సుప్రీంకోర్టు సూచించింది. ఇక‌, తెలంగాణ హైకోర్టు ఈ కేసును సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానానికి బ‌దిలీ చేసింది. ఈ క్ర‌మంలో గ‌త ఏడాదే సీబీఐ అధికారులు సునీత అనుమానం వ్య‌క్తం చేసిన వారిని కూడా విచారించారు. అనంత‌రం.. మ‌రోచార్జిషీట్‌ను కూడా దాఖ‌లు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. మ‌రింత లోతుగా విచారించ‌లేద‌ని.. తాను చెప్పిన నిందితుల ఫోన్ల‌ను కూడా సీబీఐ అధికారులు ప‌రిశీలించ‌లేద‌ని సునీత మ‌రోసారి కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపైనే తాజాగా విచార‌ణ జ‌రిగింది.

సీబీఐ వాద‌న ఇదీ..

సునీత పేర్కొన్న అంద‌రు నిందితుల‌ను తాము స‌మ‌గ్రంగానే విచారించామ‌ని సీబీఐ పేర్కొంది. వారికి.. వివేకా హ‌త్య‌కు ఎలాంటి లింకు లేద‌ని సీబీఐ అధికారులు చెప్పారు. ఈ మేర‌కు తాజాగా మ‌రో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. అనంత‌రం.. దీనిపై విచార‌ణ చేసిన నాంప‌ల్లి కోర్టు.. సునీత పిటిష‌న్‌ను కొట్టి వేస్తున్న‌ట్టు పేర్కొంది. ఈ స‌మ‌యంంలో కోర్టులోనే ఉన్న సునీత‌.. తీవ్ర భావోద్వే గానికి గుర‌య్యారు. త‌న తండ్రికి అన్యాయం జ‌రుగుతోంద‌ని, న్యాయ మూర్తి మ‌రోసారి ప‌రిశీలించాల‌ని కోరారు. అయితే.. ఈ కేసులో ఇప్ప‌టికే చాలా మందిని విచారించార‌ని.. ఇంకా విచార‌ణ‌ను పొడిగించ‌డం స‌రికాద‌ని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక‌, సీబీఐ మాత్రం కోర్టు ఆదేశిస్తే.. మ‌రోసారి విచార‌ణ చేస్తామ‌ని చెప్పింది. దీనికి కోర్టు అంగీక‌రించ‌లేదు. దీంతో సునీత పిటిష‌న్ ర‌ద్ద‌యింది. 

This post was last modified on July 24, 2026 9:17 pm

Share

Recent Posts

కోమటి బ్రదర్స్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

తెలంగాణలో అధికార పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో తరచూ అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయి. ఎనుముల రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ ప్రమాణం…

5 minutes ago

‘జయం’లో బన్నీని పెట్టి తీసేశారా?

ఒక హీరోతో చేయాల్సిన కథ ఇంకో హీరో చేతికి వెళ్లిపోవడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఐతే పెద్ద ఫ్యామిలీకి చెందిన…

16 minutes ago

సంబరాలు ఎప్పుడు… స్వయంభు ఎక్కడ

మనం ఎంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ జనం నిత్యం మాట్లాడుకునేలా,…

39 minutes ago

కొత్త మెట్లు ఎక్కేసిన కిరణ్ అబ్బవరం

కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు…

5 hours ago

తూచ్.. మల్లారెడ్డి పార్టీ మారట్లేదు!

పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…

5 hours ago

100 కోట్లు రాలేదంటే ఏమనుకోవాలి

నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…

5 hours ago