రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ ఉదంతంలో ప్లానింగ్ మొత్తం భూమా అఖిలప్రియ దంపతులు.. వారి అనుచరులే చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లే పోలీసులు సైతం ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఏ2 కాస్తా ఏ1గా మారుస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇక.. ఈ కిడ్నాప్ ఎపిసోడ్ కు స్ఫూర్తి.. ఆ మధ్య విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ గ్యాంగ్ సినిమాగా చెబుతున్నారు.
కిడ్నాపర్లు తన కిడ్నాప్ కార్యక్రమానికి ముందు గ్యాంగ్ సినిమాను నాలుగైదు సార్లు చూసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా స్ఫూర్తితోనే.. కిడ్నాప్ ప్లాన్ ను సిద్దం చేశారని చెబుతున్నారు. పదిసార్లు రెక్కి నిర్వహించిన వారు.. అనంతరం తాము అనుకున్నట్లే కిడ్నాప్ ఎపిసోడ్ ను విజయవంతంగా నడిపించారని చెబుతున్నారు. కాకుంటే.. కిడ్నాప్ జరిగిన కాసేపటికే విషయం పోలీసులకు వెళ్లటం.. వారు రంగంలోకి దిగటంతో ప్లాన్ బెడిసికొట్టినట్లుగా చెబుతున్నారు. కిడ్నాప్ చేసి.. కొన్ని కాగితాల మీద ప్రవీణ్ రావు అండ్ కో చేత సంతకాలు చేయించుకోవాలన్నదే వారి ఆలోచనగా చెబుతున్నారు.
కిడ్నాప్ కు ముందు భూమా బ్యాచ్ లోని వారికి ఈ సినిమాను చూపించారని చెబుతున్నారు. తొలుత వారు వేసుకున్న ప్లాన్ లో ఒక మహిళా అధికారి కూడా ఉండాలని భావించారని.. కానీ తర్వాత ప్లాన్ మార్చుకున్నారన్నారు. అంతేకాదు.. అందరూ ఒకేలాంటి డ్రెస్ లను నగర శివారులో కుట్టించారని చెబుతుంటే.. కాదు ఆళ్లగడ్డలోనే వాటిని సిద్ధం చేయించారన్న మాట వినిపిస్తోంది. తమ కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా సన్నిహితంగా ఉన్న శ్రీనివాస్ చౌదరితో కిడ్నాప్ ప్లాన్ గురించి భూమా అఖిలప్రియ దంపతులు చర్చించినట్లుగా తెలుస్తోంది. సినిమాటిక్ కిడ్నాప్ ప్లాన్.. పోలీసుల ఎంట్రీ.. వేగంగా విచారణకు దిగటంతో.. ప్లాన్ కాస్తా బెడిసి కొట్టింది.
This post was last modified on January 8, 2021 10:14 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…