Political News

చంద్ర‌బాబుగారూ… ఈ స‌మ‌స్య‌పై స్పందించ‌రా?: జ‌గ‌న్ ట్వీట్‌

సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి వైసీపీ అధినేత జ‌గ‌న్ సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో ఆస‌క్తిక‌ర పోస్టు చేశా రు. చంద్ర‌బాబుగారూ.. అని ఉద్దేశిస్తూ.. ఈ స‌మ‌స్య మీకు ప‌ట్టదా? అని ప్ర‌శ్నించారు. ల‌క్ష‌ల మంది ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేస్తున్నారా? అని నిల‌దీశారు. వారి స‌మ‌స్య‌ను ప‌ట్టించుకుని, అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఈ మేర‌కు సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చారు.

విష‌యం ఏంటి?

ప్ర‌స్తుతం క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్‌ను జిల్లాకు చెందిన ప‌లువురు ఉపాధ్యాయ సంఘాల నేత‌లు క‌లి శారు. ఈ సంద‌ర్భంగా గ‌త ఏడాది సుప్రీంకోర్టు.. ఉపాధ్యాయుల విష‌యంలో ఇచ్చిన సంచ‌ల‌న తీర్పును ప్ర‌స్తావించారు. గ‌తంలో ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష(టెట్‌) రాయ‌కుండానే.. ఉపాధ్యాయ పోస్టులు ద‌క్కించు కున్న‌వారికి.. ఇప్పుడుటెట్ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని.. దీనికి రాష్ట్రాల‌తో సంబంధం లేద‌ని సుప్రీంకోర్టు గ‌తంలోనే తీర్పు ఇచ్చింది. ఇది 1995ల నుంచి అమ‌లు చేయాల‌ని కూడా పేర్కొంది.

ఈ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ నేప‌థ్యంలో అనేక ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి.. రివ్యూ పిటిష‌న్ వేసినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. అయితే.. ఇప్ప‌టికే టెట్ రాసిన వారిని దీని నుంచి మిన‌హాయించారు. ఈ వ్య‌వ‌హారంపై రాష్ట్రంలోని ఉపాధ్యాయులు బెంగ పెట్టుకున్నారు. వ‌చ్చే ఏడాది రిటైర్ కానున్న వేలాది మంది ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు టెట్ రాయాల్సి వ‌చ్చింది. ఇది రాయ‌క‌పోతే.. బెనిఫిట్స్ నిలుపుద‌ల చేస్తారు.

ఈ నేప‌థ్యంలోనే టెట్‌నుంచి త‌మ‌ను మిన‌హాయించాల‌ని కోరుతూ.. ప‌లువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. కానీ.. ఈ విష‌యంలో తాము ఏమీ చేయ‌లేమ‌ని కేంద్రం కూడా ఇటీవ‌ల స్ప‌ష్టం చేసింది. దీనిపైనే తాజాగా ఉపాధ్యాయులు జ‌గ‌న్‌ను క‌లిసి విన్న‌వించ‌డంతో ఆయ‌న తాజాగా సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి లేఖ రాశారు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగా అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించాల‌ని జ‌గ‌న్ సూచించారు. అయితే.. వాస్త‌వానికి.. కేంద్రం కూడా ఈ విష‌యంలో త‌ప్పుకొన్నాక‌.. ఇప్పుడు రాష్ట్రం ఏం చేస్తుంద‌న్న ప్ర‌శ్న ఉండ‌గా.. దీనిని విస్మ‌రించిన జ‌గ‌న్‌.. త‌న లేఖ ద్వారా స‌ర్కారును ఇరుకున పెట్టి.. ఉపాధ్యాయుల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

This post was last modified on July 9, 2026 9:24 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago