సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆసక్తికర పోస్టు చేశా రు. చంద్రబాబుగారూ.. అని ఉద్దేశిస్తూ.. ఈ సమస్య మీకు పట్టదా? అని ప్రశ్నించారు. లక్షల మంది ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేస్తున్నారా? అని నిలదీశారు. వారి సమస్యను పట్టించుకుని, అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించాలని జగన్ సూచించారు. ఈ మేరకు సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చారు.
విషయం ఏంటి?
ప్రస్తుతం కడప పర్యటనలో ఉన్న జగన్ను జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు కలి శారు. ఈ సందర్భంగా గత ఏడాది సుప్రీంకోర్టు.. ఉపాధ్యాయుల విషయంలో ఇచ్చిన సంచలన తీర్పును ప్రస్తావించారు. గతంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాయకుండానే.. ఉపాధ్యాయ పోస్టులు దక్కించు కున్నవారికి.. ఇప్పుడుటెట్ పరీక్ష నిర్వహించాలని.. దీనికి రాష్ట్రాలతో సంబంధం లేదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. ఇది 1995ల నుంచి అమలు చేయాలని కూడా పేర్కొంది.
ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలో అనేక ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించి.. రివ్యూ పిటిషన్ వేసినా.. ఫలితం దక్కలేదు. అయితే.. ఇప్పటికే టెట్ రాసిన వారిని దీని నుంచి మినహాయించారు. ఈ వ్యవహారంపై రాష్ట్రంలోని ఉపాధ్యాయులు బెంగ పెట్టుకున్నారు. వచ్చే ఏడాది రిటైర్ కానున్న వేలాది మంది ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు టెట్ రాయాల్సి వచ్చింది. ఇది రాయకపోతే.. బెనిఫిట్స్ నిలుపుదల చేస్తారు.
ఈ నేపథ్యంలోనే టెట్నుంచి తమను మినహాయించాలని కోరుతూ.. పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. కానీ.. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని కేంద్రం కూడా ఇటీవల స్పష్టం చేసింది. దీనిపైనే తాజాగా ఉపాధ్యాయులు జగన్ను కలిసి విన్నవించడంతో ఆయన తాజాగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి లేఖ రాశారు. ఈ సమస్యకు పరిష్కారంగా అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించాలని జగన్ సూచించారు. అయితే.. వాస్తవానికి.. కేంద్రం కూడా ఈ విషయంలో తప్పుకొన్నాక.. ఇప్పుడు రాష్ట్రం ఏం చేస్తుందన్న ప్రశ్న ఉండగా.. దీనిని విస్మరించిన జగన్.. తన లేఖ ద్వారా సర్కారును ఇరుకున పెట్టి.. ఉపాధ్యాయులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
This post was last modified on July 9, 2026 9:24 am
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…