ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై ప్రశ్న రావణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతడిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అంతేకాదు, హిందూ మతాన్ని కించపరిచేలా రావణ్ పలు కాంట్రవర్షియల్ కామెంట్లు చేశారని సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు రావణ్ అరెస్టును సమర్థిస్తున్నారు.
అయితే, రాజకీయ కక్షతోనే రావణ్ పై 30 కేసుల వరకు పెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో రావణ్ ను అరెస్ట్ చేస్తున్నారని ప్రకాష్ రాజ్ వంటి వారు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే రావణ్ కు నాలుగో కేసులోనూ బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత అతడిని పోలీసులు మరో కేసులో అరెస్టు చేయలేదు. దీంతో, రావణ్ తన లాయర్ జడ శ్రవణ్ కుమార్ తో మీడియాతో మాట్లాడారు. తనకు అండగా నిలిచిన మీడియా ప్రతినిధులకు, జడ్జిలకు, లాయర్ జడ శ్రవణ్ కు ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఇంతకు మించి ఇప్పుడు తాను మాట్లాడలేనని, తర్వాత కూలంకషంగా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడతానని మీడియా ప్రతినిధులకు రావణ్ తెలిపారు.
వాస్తవానికి, మూడు కేసుల్లో రావణ్ కు బెయిల్ ఇచ్చినా నాలుగో కేసు పెట్టడంతో కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా, రావణ్ పై పోలీస్ స్టేషన్ ముందే జనసైనికులు దాడి చేసేందుకు ప్రయత్నించడం, పోలీసు వాహనాలపై కోడి గుడ్లు విసరడం, ఈ క్రమంలో పోలీసు అధికారులు కిందపడిపోవడం వంటి ఘటనలతో ప్రభుత్వంపై, హోం మినిస్టర్ అనితపై విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే రావణ్ ను మరో కేసులో అరెస్ట్ చేయలేదని టాక్. మరి, ఇకనైనా రావణ్ తన భాష మార్చుకొని విశ్లేషణాత్మక విమర్శలు చేస్తారా…లేక గతంలో మాదిరిగానే వివాదాస్పద వ్యాఖ్యలు కంటిన్యూ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on July 4, 2026 8:20 pm
మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…
ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…
‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో వారంలో ఏపీకి రానున్నారు. ఆగస్టు 1వ తేదీన ఆయన విజయనగరం జిల్లా భోగాపురానికి…