కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీకి భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం “టీఆర్ఎస్” పేరును కొనసాగించేందుకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ పార్టీ పేరును మార్చాలని ఆదేశించింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
తెలంగాణ అస్తిత్వం, భావోద్వేగాలకు ముడిపడిన “టీఆర్ఎస్” పేరును మరో రాజకీయ పార్టీ వినియోగించడంపై తెలంగాణ నలుమూలల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను సమర్పించాలని కవితకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. గడువులోగా ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించకపోతే పార్టీ నమోదు దరఖాస్తును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది.
ఇప్పటికే ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’గా మార్చుకున్న కవిత పార్టీ.. ఇప్పుడు మరోసారి కొత్త పేరు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ ఏర్పాటైన కొద్ది కాలంలోనే మరోసారి పేరు మార్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, కవిత పార్టీకి “టీఆర్ఎస్” పేరు పెట్టడంపై మొదటి నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరుతో పోలిక ఉండటంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందని, తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన పేరును కొత్త పార్టీ ఉపయోగించరాదంటూ పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఆ అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించిన తర్వాత వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
This post was last modified on July 4, 2026 11:17 am
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న…
భారత్లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు…