ఏ విషయంపైనైనా ముందు తాను మాట్లాడిన తర్వాతే.. సీఎం చంద్రబాబు స్పందిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవల కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ దారుణ ఘటనకు సంబంధించి తాను వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే.. ఈ ప్రభుత్వంలో కొంచెమైనా చలనం కలిగిందన్నారు. అప్పటి వరకు కనీసం సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదులను కూడా డీజీపీ సైతం తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటనపై చంద్రబాబుకు అంత ఇంట్రస్ట్ ఏంటని ప్రశ్నించారు.
సాయికృష్ణ ఉదంతంలో సీఐని సీపీ కాపాడుతున్నారని, సీపీని డీజీపీ కాపాడుతున్నారని, డీజీపీని ఎవరు కాపాడుతున్నారో అందరికీ తెలుసునని జగన్ వ్యాఖ్యానించారు. సాయికృష్ణ తల్లి కనీసం పిడికెడు బూడిద ఇమ్మన్నా ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఇక, గత ఏడాది మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభం విషయంలోనూ.. తాను స్పందిస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదన్నారు. పంట అంతా అయిపోయాక రైతులకు కిలోకు 12 రూపాయలు ఇస్తామన్నారని విమర్శించారు.
రైతులకు మద్దతుగా తాను బంగారుపాళ్యం వెళ్లి పరామర్శించిన తర్వాత.. కేంద్రానికి లేఖ రాశారని వ్యాఖ్యానించారు. ధరలు పతనం కావడంతో గత ఏడాదిలానే ఈ ఏడాది కూడా రైతులకు మేలు చేసేలా కేంద్రం ప్రయత్నం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, కేంద్ర మంత్రి కుమార స్వామి జూన్ 24న లేఖరాస్తే, జూన్ 25న కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ నుంచి మామిడి కొనుగోలుకు సానుకూల స్పందన వచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతానని చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఏం మేలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూడా మామిడి రైతులకు ధర రావడంలేదని, అయినా.. ఆయన పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబుగారు తీరిగ్గా జూన్ 28న లేఖ రాశారని అన్నారు. చంద్రబాబు తన వారైన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ కే న్యాయం జరగాలి అన్నట్టుగా వ్యవహరిస్తారని విమర్శించారు.
This post was last modified on July 1, 2026 4:06 pm
తెలుగులో బజ్ కోసం పోరాడుతున్న జన నాయకుడుకి అనిల్ రావిపూడిని రంగంలోకి దించడం ద్వారా టీమ్ తెలివైన ఎత్తుగడ వేసింది.…
కేంద్ర ప్రభుత్వానికి ఇంటా బయటా కూడా.. నీట్ పరీక్షకు సంబంధించిన సెగ భారీగా తగులుతోంది. నిన్న మొన్నటి వరకు ఈ…
బస్సులో మనం ఒక సీట్ ని రిజర్వ్ చేసుకుని, తీరా ప్రయాణానికి వెళ్లలేకపోతే వేరొకరికి ఇవ్వడమో లేదా అమ్మడమో జరుగుతుంది.…
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకు ఆరవ్ ను హిట్…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద బజ్ బాగానే ఉంది. కిరణ్ అబ్బవరం కెరీర్…
దేశ రాజధానిలో రగులుకున్న విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న పరిస్తితి. ఈ పరిస్థితికి కారణం బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, కేంద్ర…