Political News

కేసీఆరా మజాకానా.. వలసలపై భారీ నిర్ణయం

కాస్త లేటైనా.. తీసుకునే నిర్ణయం ఏదైనా లేటెస్టుగా ఉంటుందన్న మాటకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. లాక్ డౌన్ వేళ.. సొంతూరుకు వెళ్లేందుకు వలస కూలీలు.. కార్మికులు.. ఉపాధి కోసం వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నడిచి వెళుతున్న వైనంపై తెలిసిందే. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వందలాది కిలోమీటర్లు నడిచైనా సొంతూరుకు వెళ్లాలని తపిస్తున్న బడుగుజీవులకు భారీ ఊరట కలిగించేలా నిర్ణయాన్ని తీసుకున్నారు.

వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వీలుగా వారం రోజుల పాటు ప్రతి రోజూ 40 రైళ్లు నడపాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బిహార్.. ఒడిసా.. ఝూర్ఖండ్.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపాలని డిసైడ్ చేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

సోమవారం రాత్రి కాస్త ఆలస్యంగా ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వలస కార్మికులు ఎవరూ ఆందోళన చెందొద్దన్న భరోసాను ఇచ్చిన ఆయన.. లాక్ డౌన్ వల్ల కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ప్రగతిభవన్ లో సుదీర్ఘంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో మాట్లాడి.. ప్రత్యేక వలస రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిక సందీప్ సుల్తానియా.. సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ లను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.

తమ సొంతూళ్లకు వెళ్లేందుకు వీలుగా ఇప్పటికే వలసకూలీలు.. కార్మికులు తాముండే పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేయించుకోవటం తెలిసిందే. రానున్న రోజుల్లో కూడా పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకోవటం ద్వారా.. వారి గమ్యస్థానాలకు చేరేలా రైళ్లను నడుపుతారు. తెలంగాణలో హైదరాబాద్ తో పాటు వరంగల్.. ఖమ్మం.. రామగుండం.. దామచర్ల తదితర ప్రాంతాల నుంచి ఈ రైళ్లను నడపాలని నిర్ణయించారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వలస కూలీలకు అందేలా సమాచారం ఇవ్వాలని అధికారుల్ని ముఖ్యమంత్రి కోరారు. వలసల్ని తరలించే విషయంలో ఇప్పటికే కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవటం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న వేళ.. అలాంటివాటికి టోకుగా చెక్ చెబుతూ కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనమే అవుతుందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on May 5, 2020 2:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యార్ల‌గ‌డ్డ స‌త్తా చాటుకున్నారే

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. స‌త్తా చాటుకున్నారు. సాధార‌ణ అభివృద్ధి ప‌నుల‌తో పాటు.. ఎవ‌రూ ఊహించ‌ని…

2 hours ago

శర్వానంద్ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారా

నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…

2 hours ago

ఓపెనింగ్ టాక్…. డామినేషన్ ఎవరిది?

నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…

2 hours ago

మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…

4 hours ago

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు…

7 hours ago

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

10 hours ago