ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి(బీహార్ కేడర్) సునీల్ నాయక్పై తీవ్రంగా మండిపడింది. సరెండర్ అవుతారా? లేక కేసులో వాదనలు కొనసాగిస్తారా? అని ప్రశ్నించింది. అంతేకాదు.. ఈ కేసులో అన్నీ తెలుసునని వ్యాఖ్యానించింది.
తాజాగా సునీల్ నాయక్.. తనకు ముందస్తు బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించారు.. ఈ పిటిషన్పై విచారణ చేసిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ఎంపీ(అప్పటి)ని నిర్బంధించి.. టార్చర్ చేయడం అంటే.. తీవ్ర విషయం. ఈ విషయం మీకు తెలుసు. రఘురామ అరెస్టు నుంచి ఆయనను స్టేషన్లో నిర్బంధించి టార్చర్ చేస్తున్నారని కూడా మీకు సమాచారం ఉంది. ఆ సమయంలో మీరు అక్కడే ఎందుకు ఉన్నారు? ఐపీఎస్ అధికారిగా రాజ్యాంగం గురించి తెలిసి కూడా.. మీరు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారు అని ప్రశ్నించింది.
అంతేకాదు.. పార్లమెంటుపై దాడి చేసిన(ఉగ్రవాదులు) వారికి.. ఓ ప్రజాప్రతినిధిని (రఘురామను) టార్చర్ చేసిన వారికి పెద్దగా తేడా ఏమీ లేదు. మీరు కూడా ఆ పనిలో భాగస్వామ్యం అయ్యారు. తెలిసి కూడా ఆపలేకపోయారు. పైగా టార్చర్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్నారు. వినోదం చూశారా? అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్పై వాదనలు వినిపిస్తారో.. లేక సరెండర్(పోలీసులకు లొంగిపోవడం) అవుతారో తేల్చుకోండి. అని వ్యాఖ్యానించింది. దీంతో సమయం కోరిన సునీల్ నాయక్ తరఫున న్యాయవాది.. కోర్టుకు విన్నవిస్తామన్నారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని విమర్శించిన రఘురామను ఆయన పుట్టిన రోజు నాడే హైదరాబాద్ నుంచి సీఐడీ అధికారులు బలవంతంగా తీసుకువచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో గుంటూరులోని సీఐడీ పోలీసు స్టేషన్లో ఆయనను నిర్బంధించి టార్చర్ చేశారని కేసు నమోదైంది. ఈ కేసు విచారణ ఇటీవల కూడా వచ్చింది. ఆ సమయంలోనూ హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. తాజాగా.. పార్లమెంటుపై దాడి చేసిన వారికి.. మీకు(ఐపీఎస్)కు తేడా లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on June 18, 2026 8:28 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…