ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి(బీహార్ కేడర్) సునీల్ నాయక్పై తీవ్రంగా మండిపడింది. సరెండర్ అవుతారా? లేక కేసులో వాదనలు కొనసాగిస్తారా? అని ప్రశ్నించింది. అంతేకాదు.. ఈ కేసులో అన్నీ తెలుసునని వ్యాఖ్యానించింది.
తాజాగా సునీల్ నాయక్.. తనకు ముందస్తు బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించారు.. ఈ పిటిషన్పై విచారణ చేసిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ఎంపీ(అప్పటి)ని నిర్బంధించి.. టార్చర్ చేయడం అంటే.. తీవ్ర విషయం. ఈ విషయం మీకు తెలుసు. రఘురామ అరెస్టు నుంచి ఆయనను స్టేషన్లో నిర్బంధించి టార్చర్ చేస్తున్నారని కూడా మీకు సమాచారం ఉంది. ఆ సమయంలో మీరు అక్కడే ఎందుకు ఉన్నారు? ఐపీఎస్ అధికారిగా రాజ్యాంగం గురించి తెలిసి కూడా.. మీరు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారు అని ప్రశ్నించింది.
అంతేకాదు.. పార్లమెంటుపై దాడి చేసిన(ఉగ్రవాదులు) వారికి.. ఓ ప్రజాప్రతినిధిని (రఘురామను) టార్చర్ చేసిన వారికి పెద్దగా తేడా ఏమీ లేదు. మీరు కూడా ఆ పనిలో భాగస్వామ్యం అయ్యారు. తెలిసి కూడా ఆపలేకపోయారు. పైగా టార్చర్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్నారు. వినోదం చూశారా? అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్పై వాదనలు వినిపిస్తారో.. లేక సరెండర్(పోలీసులకు లొంగిపోవడం) అవుతారో తేల్చుకోండి. అని వ్యాఖ్యానించింది. దీంతో సమయం కోరిన సునీల్ నాయక్ తరఫున న్యాయవాది.. కోర్టుకు విన్నవిస్తామన్నారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని విమర్శించిన రఘురామను ఆయన పుట్టిన రోజు నాడే హైదరాబాద్ నుంచి సీఐడీ అధికారులు బలవంతంగా తీసుకువచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో గుంటూరులోని సీఐడీ పోలీసు స్టేషన్లో ఆయనను నిర్బంధించి టార్చర్ చేశారని కేసు నమోదైంది. ఈ కేసు విచారణ ఇటీవల కూడా వచ్చింది. ఆ సమయంలోనూ హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. తాజాగా.. పార్లమెంటుపై దాడి చేసిన వారికి.. మీకు(ఐపీఎస్)కు తేడా లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…