2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది. తాము అధికారంలోకి వస్తే…ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను క్రమానుగతంగా భర్తీ చేస్తామని చెప్పిన వైసీపీ… అందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పింది. అనుకున్నట్లుగానే ఆ ఎన్నికల్లో వైసీపీకి అధికారం దక్కగా… ఆ తర్వాత జాబ్ కేలండర్ అన్న మాట వైసీపీ నుంచి వినిపించ లేదు. నాడు విపక్షంగా ఉన్న టీడీపీ నుంచి జాబ్ కేలండర్ ఎక్కడ? అన్న ప్రశ్నలు వినిపించాయి.
ఇదంతా గతం అనుకుంటే… తమ పాలనలో ఓ కేలండర్ ను పక్కాగా అమలు చేశామని వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ నోట.. జాబ్ కేలండర్ కు బదులుగా సంక్షేమ కేలండర్ అన్న మాట వినిపించింది. సంక్షేమ కేలండర్ అన్న మాట నాడు వైసీపీ ఎన్నికల ప్రచారంలో వినిపించలేదు కదా అన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
సంక్షేమ పథకాలకు నవ రత్నాలు అని పేరు పెట్టిన వైసీపీ… నిరుద్యోగులను ఆకర్షించే నిమిత్తం జాబ్ కేలండర్ ను పదే పదే పలికింది. అయితే జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్న మాటే వినిపించలేదు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు అందులో వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగాల భర్తీ తప్పించి మిగిలిన ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ అన్నమాటే వినిపించలేదు. ఇదే విషయాన్ని టీడీపీ గట్టిగానే ప్రస్తావించింది. దానిపై వైసీపీ నుంచి పిన్ డ్రాప్ సైలెన్సే సమాధానం అయ్యింది.
మరి ఇప్పుడు కేలండర్ అన్న మాట జగన్ నోట వినిపించినంతనే అంతా ఆ దిశగా దృష్టి సారించారు. అయితే జగన్ నోట నుంచి వినిపించిన కేలండర్ జాబ్ లకు సంబంధించినది కాదని, ఆయన నోట వినిపించినది సంక్షేమ కేలండర్ అని తేలిపోయింది. సంక్షేమ కేలండర్ అన్న మాటే వైసీపీ పాలనలో వినిపించలేదు.
సంక్షేమ పథకాలను అయితే వైసీపీ అమలు చేసింది గానీ.. దానికి ఓ కేలండర్ అంటూ పేరేమీ పెట్టకుండానే అమలు చేసింది. అయితే దానిని ఇప్పుడు ప్రస్తావించిన జగన్… దానికి కొత్తగా సంక్షేమ కేలండర్ అని ఆయన పేరు పెట్టేశారు. దీనిపై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. జాబ్ కేలండర్ అని చెప్పిన జగన్.. దానిని అమలు చేయలేక ఇప్పుడు సంక్షేమ కేలండర్ అని చెబుతున్నారంటూ పలువుచు విశ్లేషిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన ధురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ దగ్గర…
2000కు అటు, ఇటు వైభవం చూసిన ఎంతోమంది సీనియర్ హీరోలు.. తర్వాతి కాలంలో యువ కథానాయకుల పోటీని తట్టుకోలేక, మారుతున్న…
గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 దారుణ ఫలితాలు పక్కనపెడితే దర్శకుడు శంకర్ ఒకప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కుంభకోణంలో అదనంగా లిక్కర్ రవాణాలోనూ…