Political News

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీలతో్ కూడిన కూటమి నాటి అధికార పార్టీ వైసీపీని చిత్తుగా ఓడించింది. ఈ ఓటమితో షాక్ తిన్న వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కాలం పాటు బయటకే రాలేదు. ఏదో స్పందించాలి కాబట్టి స్పందిస్తున్నాం అన్న రీతిలో సాగిన జగన్… ఇప్పుడిప్పుడే అధికార పక్షంపైకి ఎదురు దాడి మొదలుపెట్టినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై వరుసగా కార్యక్రమాలకు దిగుతున్న వైసీపీ తీరే ఇందుకు నిదర్శనంగా ఆ విశ్లేషణలు చెబుతున్నాయి.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మత్ప్యకారుల సమస్యలపై జగన్ ఓ కీలక సమీక్షను నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో సమావేశం అయిన జగన్… వైసీపీ హయాంలో మత్స్యకారులకు ఏమేం చేశామన్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా 2024 ఎన్నికల ముందు కూటమి పార్టీల నుంచి మత్స్యకారులకు మోసపూరిత హామీలు వచ్చాయని కూడా ఆయన ఆరోపించారు. ఆక్వా రంగానికి కూటమి సర్కారు చేస్తున్న అన్యాయంపై ఆక్వా రైతుల పక్షాన పోరాటం చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.

జూలై 1న భీమవరంలో ఆక్వా రైతుల పక్షాన నిరసన చేపట్టనున్నామని, ఆ నిరసనలో తాను స్వయంగా పాలుపంచుకుంటానని జగన్ ప్రకటించారు. ఈ నిరసన ద్వారా ఏపీలోని ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని యావత్తు దేశం చూసేలా చేస్తామన్నారు. ఈ నిరసనలో ఆక్వా రంగానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకోవాలని, తమ సమస్యలపై కూటమి సర్కారును నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ప్రకటన విన్నంతనే జగన్ ఇక అటాక్ మోడ్ లోకి వచ్చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డీఎస్సీ అక్రమాలపై ఇటీవలే వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ చేపట్టిన నిరసనలు ఓ మోస్తరుగా విజయవంతం అయ్యాయని, ఈ క్రమంలోనే ఈ సారి జగనే నేరుగా రంగంలోకి దిగుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు.

జగన్ నేరుగా రంగంలోకి దిగితే… వైసీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే… మెగా డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ జగన్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నిరసనలు సక్సెస్ అయ్యాయని, ఈ ఫలితాలను చూశాకే ఇక రంగంలోకి ప్రత్యక్షంగా దిగాలని జగన్ నిర్ణయించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on June 16, 2026 6:09 pm

Share

Recent Posts

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

17 minutes ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

1 hour ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

2 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

2 hours ago

సూర్య పాత్రలో షాకింగ్ ట్విస్టుందా?

తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…

2 hours ago

విజయవాడ మేయర్ రేసుకు పోటాపోటీ

విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…

3 hours ago