Political News

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీలతో్ కూడిన కూటమి నాటి అధికార పార్టీ వైసీపీని చిత్తుగా ఓడించింది. ఈ ఓటమితో షాక్ తిన్న వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కాలం పాటు బయటకే రాలేదు. ఏదో స్పందించాలి కాబట్టి స్పందిస్తున్నాం అన్న రీతిలో సాగిన జగన్… ఇప్పుడిప్పుడే అధికార పక్షంపైకి ఎదురు దాడి మొదలుపెట్టినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై వరుసగా కార్యక్రమాలకు దిగుతున్న వైసీపీ తీరే ఇందుకు నిదర్శనంగా ఆ విశ్లేషణలు చెబుతున్నాయి.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మత్ప్యకారుల సమస్యలపై జగన్ ఓ కీలక సమీక్షను నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో సమావేశం అయిన జగన్… వైసీపీ హయాంలో మత్స్యకారులకు ఏమేం చేశామన్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా 2024 ఎన్నికల ముందు కూటమి పార్టీల నుంచి మత్స్యకారులకు మోసపూరిత హామీలు వచ్చాయని కూడా ఆయన ఆరోపించారు. ఆక్వా రంగానికి కూటమి సర్కారు చేస్తున్న అన్యాయంపై ఆక్వా రైతుల పక్షాన పోరాటం చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.

జూలై 1న భీమవరంలో ఆక్వా రైతుల పక్షాన నిరసన చేపట్టనున్నామని, ఆ నిరసనలో తాను స్వయంగా పాలుపంచుకుంటానని జగన్ ప్రకటించారు. ఈ నిరసన ద్వారా ఏపీలోని ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని యావత్తు దేశం చూసేలా చేస్తామన్నారు. ఈ నిరసనలో ఆక్వా రంగానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకోవాలని, తమ సమస్యలపై కూటమి సర్కారును నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ప్రకటన విన్నంతనే జగన్ ఇక అటాక్ మోడ్ లోకి వచ్చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డీఎస్సీ అక్రమాలపై ఇటీవలే వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ చేపట్టిన నిరసనలు ఓ మోస్తరుగా విజయవంతం అయ్యాయని, ఈ క్రమంలోనే ఈ సారి జగనే నేరుగా రంగంలోకి దిగుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు.

జగన్ నేరుగా రంగంలోకి దిగితే… వైసీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే… మెగా డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ జగన్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నిరసనలు సక్సెస్ అయ్యాయని, ఈ ఫలితాలను చూశాకే ఇక రంగంలోకి ప్రత్యక్షంగా దిగాలని జగన్ నిర్ణయించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Kumar

Recent Posts

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

37 minutes ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

2 hours ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

4 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

4 hours ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

5 hours ago