ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీలతో్ కూడిన కూటమి నాటి అధికార పార్టీ వైసీపీని చిత్తుగా ఓడించింది. ఈ ఓటమితో షాక్ తిన్న వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా కాలం పాటు బయటకే రాలేదు. ఏదో స్పందించాలి కాబట్టి స్పందిస్తున్నాం అన్న రీతిలో సాగిన జగన్… ఇప్పుడిప్పుడే అధికార పక్షంపైకి ఎదురు దాడి మొదలుపెట్టినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై వరుసగా కార్యక్రమాలకు దిగుతున్న వైసీపీ తీరే ఇందుకు నిదర్శనంగా ఆ విశ్లేషణలు చెబుతున్నాయి.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మత్ప్యకారుల సమస్యలపై జగన్ ఓ కీలక సమీక్షను నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో సమావేశం అయిన జగన్… వైసీపీ హయాంలో మత్స్యకారులకు ఏమేం చేశామన్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా 2024 ఎన్నికల ముందు కూటమి పార్టీల నుంచి మత్స్యకారులకు మోసపూరిత హామీలు వచ్చాయని కూడా ఆయన ఆరోపించారు. ఆక్వా రంగానికి కూటమి సర్కారు చేస్తున్న అన్యాయంపై ఆక్వా రైతుల పక్షాన పోరాటం చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
జూలై 1న భీమవరంలో ఆక్వా రైతుల పక్షాన నిరసన చేపట్టనున్నామని, ఆ నిరసనలో తాను స్వయంగా పాలుపంచుకుంటానని జగన్ ప్రకటించారు. ఈ నిరసన ద్వారా ఏపీలోని ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని యావత్తు దేశం చూసేలా చేస్తామన్నారు. ఈ నిరసనలో ఆక్వా రంగానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకోవాలని, తమ సమస్యలపై కూటమి సర్కారును నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ప్రకటన విన్నంతనే జగన్ ఇక అటాక్ మోడ్ లోకి వచ్చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డీఎస్సీ అక్రమాలపై ఇటీవలే వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ చేపట్టిన నిరసనలు ఓ మోస్తరుగా విజయవంతం అయ్యాయని, ఈ క్రమంలోనే ఈ సారి జగనే నేరుగా రంగంలోకి దిగుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు.
జగన్ నేరుగా రంగంలోకి దిగితే… వైసీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే… మెగా డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ జగన్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నిరసనలు సక్సెస్ అయ్యాయని, ఈ ఫలితాలను చూశాకే ఇక రంగంలోకి ప్రత్యక్షంగా దిగాలని జగన్ నిర్ణయించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on June 16, 2026 6:09 pm
మన దేశంలో రాజకీయ వారసత్వం సర్వ సాధారణం. సినిమాల్లో నెపోటిజం మాదిరిగానే పొలిటికల్ నెపోటిజం వల్ల వచ్చిన పొలిటిషియన్లు చాలామంది…
స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్ ఇస్తున్న…
సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…
నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…
అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…