గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే కాకుండా.. దిగుమతులు కూడా తగ్గాయి. ఇక, గ్యాస్ కష్టాలు కూడా.. అనేక దేశాలను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కష్టాలు మన దేశంలో కూడా కనిపించాయి. ఇప్పటికే చమురు ధరలను దేశవ్యాప్తంగా పెంచారు. గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా భారీగానే పెరిగాయి.
దీనంతటికీ కారణం.. అమెరికా-ఇరాన్ల మధ్య జరిగిన యుద్ధం. అదేసమయంలో కీలకమైన గల్ఫ్లో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసి వేయడం. ఫలితంగా పర్షియన్ గల్ఫ్ నుంచి రవాణా అయ్యే ఇంధనం, గ్యాస్ వంటివి ఒడిదుడుకులకు గురయ్యాయి.
కాగా.. అతి కష్టం మీద.. తాజాగా ఇరాన్-అమెరికాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. కీలకమైన అణు విషయంపై ఎటూ ముడి పడకపోయినా.. ఇతర అంశాలపై ఇరు దేశాలు.. అంగీకారానికి వచ్చాయి. ఫలితంగా ఒప్పందం ఓకే అయింది. దీంతో హోర్ముజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది.
ఇంకేముంది.. ఫలితంగా ఇంధన రవాణా మెరుగవుతుందని.. కావాల్సినంత ఇంధనం… లభిస్తుందని అందరూ అనుకున్నారు. నిజానికి ఇంధన సమస్యతో భారత దేశంలో డీజిల్, పెట్రోల్పై కోటా విధించారు. ఇది రవాణా రంగంపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి.
తాజాగా ఒప్పందంతో హార్ముజ్ను తిరిగి తెరుస్తామని ఇరాన్ ప్రకటించడంతో ఈ కష్టాలు పోతాయని అందరూ భావిస్తున్నారు. కానీ, ఇక్కడే భారీ ట్విస్ట్ ఏర్పడింది. ఇప్పటికిప్పుడు.. హార్ముజ్ జలసంధిని తెరిచినా.. చమురు, గ్యాస్ కష్టాలు ఇప్పట్లో తొలిగిపోవని.. అమెరికాకు చెందిన ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక నౌకలు అసలు జలసంధిలోకే రాలేదని.. కొన్నింటికి బీమా సౌకర్యం కూడా రద్దయిందని చెబుతున్నారు. ఇప్పుడు వాటిని సరిచేసుకుని.. రవాణా ప్రారంభించేందుకు కనీసంలో కనీసం నెల రోజుల సమయం పడుతుందని అంటున్నారు.
మరోవైపు.. దాడుల కారణంగా 120 మంది సిబ్బంది(వివిధ దేశాలకు చెందిన) మరణించారని.. వారి స్థానంలో వేరే వారిని పంపించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇవన్నీ అయ్యేందుకు మరో నాలుగు నుంచి 5 నెలలు పడతాయని అంటున్నారు. సో.. ఒప్పందం కుదిరినంత తేలికగా.. హోర్ముజ్ జలసంధిలో నౌకల రవాణా.. ఇంధన రవాణా వంటివి అంత తేలికగా కుదట పడవని పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. ఒప్పందం కుదిరిన వెంటనే.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు బ్యారెల్కు 4 డాలర్లు తగ్గాయి. అయినా.. ఇది కూడా అమలు అయ్యేందుకు నెల రోజుల సమయం పడుతుందని అప్పటి వరకు వెయిట్ చేయకతప్పదని ప్రజలకు చెబుతున్నారు. ఇక, భారత్ విషయానికి వస్తే.. బ్యారెల్ చమురు ధరలు తగ్గినా.. దేశంలో తగ్గించే అవకాశం ఉండకపోవచ్చని చమురు కంపెనీలు చెబుతున్నాయి.
This post was last modified on June 15, 2026 11:18 pm
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…
అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర…