Political News

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే కాకుండా.. దిగుమ‌తులు కూడా త‌గ్గాయి. ఇక‌, గ్యాస్ క‌ష్టాలు కూడా.. అనేక దేశాల‌ను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క‌ష్టాలు మ‌న దేశంలో కూడా క‌నిపించాయి. ఇప్ప‌టికే చ‌మురు ధ‌ర‌ల‌ను దేశ‌వ్యాప్తంగా పెంచారు. గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లు కూడా భారీగానే పెరిగాయి.

దీనంత‌టికీ కార‌ణం.. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య జ‌రిగిన యుద్ధం. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన గ‌ల్ఫ్‌లో హోర్ముజ్ జ‌ల‌సంధిని ఇరాన్ మూసి వేయ‌డం. ఫ‌లితంగా ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్ నుంచి ర‌వాణా అయ్యే ఇంధ‌నం, గ్యాస్ వంటివి ఒడిదుడుకుల‌కు గుర‌య్యాయి.

కాగా.. అతి క‌ష్టం మీద‌.. తాజాగా ఇరాన్‌-అమెరికాలు ఒక ఒప్పందానికి వ‌చ్చాయి. కీల‌క‌మైన అణు విష‌యంపై ఎటూ ముడి ప‌డ‌క‌పోయినా.. ఇత‌ర అంశాల‌పై ఇరు దేశాలు.. అంగీకారానికి వ‌చ్చాయి. ఫ‌లితంగా ఒప్పందం ఓకే అయింది. దీంతో హోర్ముజ్ జ‌ల‌సంధిని తెరుస్తామ‌ని ఇరాన్ ప్ర‌క‌టించింది.

ఇంకేముంది.. ఫ‌లితంగా ఇంధ‌న ర‌వాణా మెరుగ‌వుతుంద‌ని.. కావాల్సినంత ఇంధ‌నం… ల‌భిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. నిజానికి ఇంధ‌న స‌మ‌స్య‌తో భార‌త దేశంలో డీజిల్‌, పెట్రోల్‌పై కోటా విధించారు. ఇది ర‌వాణా రంగంపై ప్ర‌భావం చూపుతోంది. ఫ‌లితంగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగిపోయాయి.

తాజాగా ఒప్పందంతో హార్ముజ్‌ను తిరిగి తెరుస్తామ‌ని ఇరాన్ ప్ర‌క‌టించ‌డంతో ఈ క‌ష్టాలు పోతాయ‌ని అంద‌రూ భావిస్తున్నారు. కానీ, ఇక్క‌డే భారీ ట్విస్ట్ ఏర్ప‌డింది. ఇప్ప‌టికిప్పుడు.. హార్ముజ్ జ‌ల‌సంధిని తెరిచినా.. చ‌మురు, గ్యాస్ క‌ష్టాలు ఇప్ప‌ట్లో తొలిగిపోవ‌ని.. అమెరికాకు చెందిన ఇంధ‌న రంగ నిపుణులు చెబుతున్నారు.

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో అనేక నౌక‌లు అస‌లు జ‌ల‌సంధిలోకే రాలేద‌ని.. కొన్నింటికి బీమా సౌక‌ర్యం కూడా ర‌ద్ద‌యింద‌ని చెబుతున్నారు. ఇప్పుడు వాటిని స‌రిచేసుకుని.. ర‌వాణా ప్రారంభించేందుకు క‌నీసంలో క‌నీసం నెల రోజుల స‌మ‌యం పడుతుంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. దాడుల కార‌ణంగా 120 మంది సిబ్బంది(వివిధ దేశాల‌కు చెందిన‌) మ‌ర‌ణించార‌ని.. వారి స్థానంలో వేరే వారిని పంపించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇవ‌న్నీ అయ్యేందుకు మ‌రో నాలుగు నుంచి 5 నెల‌లు ప‌డ‌తాయ‌ని అంటున్నారు. సో.. ఒప్పందం కుదిరినంత తేలిక‌గా.. హోర్ముజ్ జ‌ల‌సంధిలో నౌక‌ల ర‌వాణా.. ఇంధ‌న ర‌వాణా వంటివి అంత తేలిక‌గా కుద‌ట ప‌డ‌వ‌ని పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. ఒప్పందం కుదిరిన వెంట‌నే.. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు దాదాపు బ్యారెల్‌కు 4 డాలర్లు త‌గ్గాయి. అయినా.. ఇది కూడా అమ‌లు అయ్యేందుకు నెల రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌ద‌ని ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు. ఇక‌, భార‌త్ విష‌యానికి వ‌స్తే.. బ్యారెల్ చ‌మురు ధ‌ర‌లు త‌గ్గినా.. దేశంలో త‌గ్గించే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని చ‌మురు కంపెనీలు చెబుతున్నాయి.

This post was last modified on June 15, 2026 11:18 pm

Share

Recent Posts

మండలిలో దద్దమ్మ.. ఆంబోతు… వ్యాఖ్యలు

ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యారు. ఈ నెల 17 నుంచి 20 వరకు ఈ…

9 minutes ago

బుచ్చిబాబు కథలు.. ఎంత మంది హీరోలో…

‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు సానా నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఆయన దగ్గర ఉన్న…

34 minutes ago

మంత్రి కాకపోయినా నాగబాబుకు కేబినెట్ హోదా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి…

37 minutes ago

విశ్వనాథ్ నేర్పించిన విలువైన పాఠం

అదేదో తుఫాను తరిమినట్టు ఫ్యామిలీ ప్రేక్షకులను విశ్వనాథ్ అండ్ సన్స్ బలంగా థియేటర్ల వైపుకు లాగింది. ఆశ్చర్యకరంగా తమిళనాడు కంటే…

1 hour ago

2025 లెక్కలు సరి చేస్తున్న నిర్మాత

టాలీవుడ్లో మంచి అభిరుచి, సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ కి మంచి పేరుండేది. కానీ ఆ పేరు గత…

2 hours ago

ఫ్యామిలీస్ రాకపోయినా రికార్డులు గ్యారెంటీనా?

యశ్ సోలో హీరోగా నాలుగేళ్ల తర్వాత చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ టాక్సిక్ రిలీజ్ కు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి…

3 hours ago