Political News

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే కాకుండా.. దిగుమ‌తులు కూడా త‌గ్గాయి. ఇక‌, గ్యాస్ క‌ష్టాలు కూడా.. అనేక దేశాల‌ను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క‌ష్టాలు మ‌న దేశంలో కూడా క‌నిపించాయి. ఇప్ప‌టికే చ‌మురు ధ‌ర‌ల‌ను దేశ‌వ్యాప్తంగా పెంచారు. గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లు కూడా భారీగానే పెరిగాయి.

దీనంత‌టికీ కార‌ణం.. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య జ‌రిగిన యుద్ధం. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన గ‌ల్ఫ్‌లో హోర్ముజ్ జ‌ల‌సంధిని ఇరాన్ మూసి వేయ‌డం. ఫ‌లితంగా ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్ నుంచి ర‌వాణా అయ్యే ఇంధ‌నం, గ్యాస్ వంటివి ఒడిదుడుకుల‌కు గుర‌య్యాయి.

కాగా.. అతి క‌ష్టం మీద‌.. తాజాగా ఇరాన్‌-అమెరికాలు ఒక ఒప్పందానికి వ‌చ్చాయి. కీల‌క‌మైన అణు విష‌యంపై ఎటూ ముడి ప‌డ‌క‌పోయినా.. ఇత‌ర అంశాల‌పై ఇరు దేశాలు.. అంగీకారానికి వ‌చ్చాయి. ఫ‌లితంగా ఒప్పందం ఓకే అయింది. దీంతో హోర్ముజ్ జ‌ల‌సంధిని తెరుస్తామ‌ని ఇరాన్ ప్ర‌క‌టించింది.

ఇంకేముంది.. ఫ‌లితంగా ఇంధ‌న ర‌వాణా మెరుగ‌వుతుంద‌ని.. కావాల్సినంత ఇంధ‌నం… ల‌భిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. నిజానికి ఇంధ‌న స‌మ‌స్య‌తో భార‌త దేశంలో డీజిల్‌, పెట్రోల్‌పై కోటా విధించారు. ఇది ర‌వాణా రంగంపై ప్ర‌భావం చూపుతోంది. ఫ‌లితంగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగిపోయాయి.

తాజాగా ఒప్పందంతో హార్ముజ్‌ను తిరిగి తెరుస్తామ‌ని ఇరాన్ ప్ర‌క‌టించ‌డంతో ఈ క‌ష్టాలు పోతాయ‌ని అంద‌రూ భావిస్తున్నారు. కానీ, ఇక్క‌డే భారీ ట్విస్ట్ ఏర్ప‌డింది. ఇప్ప‌టికిప్పుడు.. హార్ముజ్ జ‌ల‌సంధిని తెరిచినా.. చ‌మురు, గ్యాస్ క‌ష్టాలు ఇప్ప‌ట్లో తొలిగిపోవ‌ని.. అమెరికాకు చెందిన ఇంధ‌న రంగ నిపుణులు చెబుతున్నారు.

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో అనేక నౌక‌లు అస‌లు జ‌ల‌సంధిలోకే రాలేద‌ని.. కొన్నింటికి బీమా సౌక‌ర్యం కూడా ర‌ద్ద‌యింద‌ని చెబుతున్నారు. ఇప్పుడు వాటిని స‌రిచేసుకుని.. ర‌వాణా ప్రారంభించేందుకు క‌నీసంలో క‌నీసం నెల రోజుల స‌మ‌యం పడుతుంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. దాడుల కార‌ణంగా 120 మంది సిబ్బంది(వివిధ దేశాల‌కు చెందిన‌) మ‌ర‌ణించార‌ని.. వారి స్థానంలో వేరే వారిని పంపించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇవ‌న్నీ అయ్యేందుకు మ‌రో నాలుగు నుంచి 5 నెల‌లు ప‌డ‌తాయ‌ని అంటున్నారు. సో.. ఒప్పందం కుదిరినంత తేలిక‌గా.. హోర్ముజ్ జ‌ల‌సంధిలో నౌక‌ల ర‌వాణా.. ఇంధ‌న ర‌వాణా వంటివి అంత తేలిక‌గా కుద‌ట ప‌డ‌వ‌ని పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. ఒప్పందం కుదిరిన వెంట‌నే.. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు దాదాపు బ్యారెల్‌కు 4 డాలర్లు త‌గ్గాయి. అయినా.. ఇది కూడా అమ‌లు అయ్యేందుకు నెల రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌ద‌ని ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు. ఇక‌, భార‌త్ విష‌యానికి వ‌స్తే.. బ్యారెల్ చ‌మురు ధ‌ర‌లు త‌గ్గినా.. దేశంలో త‌గ్గించే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని చ‌మురు కంపెనీలు చెబుతున్నాయి.

Kumar

Recent Posts

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

2 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

2 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

4 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

5 hours ago

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

7 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

10 hours ago