Political News

కేసీయార్ మీద బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసిందా ?

‘టిఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎంఎల్ఏలు మాతో టచ్ లో ఉన్నారు’ ..ఇది తాజాగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఇందులో నిజమెంతన్నది పక్కన పెట్టేద్దాం. మరంత మంది ఎంఎల్ఏలు నిజంగానే తమతో టచ్ లో ఉంటే మరెందుకని వాళ్ళందరినీ టోకుగా చేర్చేసుకోవటం లేదు ? ఎందుకనంటే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకూడదనే ఆగుతున్నామని కతలు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అధికారపార్టీకి చెందిన ఎంఎల్ఏలను, ఎంపిలను లాగేసుకుంటున్న విషయం పాపం బండికి ఇంకా తెలీలేదేమో.

మొన్నటికి మొన్న మిత్రపక్షమని కూడా చూడకుండా అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయుకి చెందిన ఏడుగురు ఎంఎల్ఏల్లో ఆరుగురిని బీజేపీలోకి లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు పశ్చిమబెంగాల్లో ఓ ఎంపి+నలుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్ఏలను బీజేపీలోకి లాగేసుకున్న విషయం దేశమంతా చూసింది. ఇక మధ్యప్రదేశ్, కర్నాటక, అంతకుముందు గోవా, సిక్కిం, మణిపూర్ లో కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఎలా లొంగదీసుకున్నారో అందరికీ తెలిసిందే. రాజస్ధాన్ లో కూడా కాంగ్రెస్ ఎంఎల్ఏలను లొంగదీసుకున్నారని స్వయంగా ముఖ్యమంత్రి అశోగ్ గెహ్లాత్ మొత్తకుంటున్నన విషయం తెలిసిందే.

ఇన్ని రాష్ట్రాల్లో అడ్డురాని రాజ్యాంగం కేవలం ఒక్క తెలంగాణాలో మాత్రమే అడ్డుపడుతోందా ? రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని చూస్తున్నట్లు బండి చెబుతున్నది చూస్తుంటే పై ప్రాంతాల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా తమపార్టీ నేతలు నడుకుకుంటున్నారని అంగీకరిస్తున్నట్లే కదా. సరే ఇక తెలంగాణా సంగతే తీసుకుంటే 30 మంది ఎంఎల్ఏలు అసలు బీజేపీతో ఎందుకు టచ్ లోకి వెళతారు ? టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వెళితే వచ్చే ఉపయోగం ఏమిటి ? 30 మంది ఎంఎల్ఏలు బీజేపీలోకి వెళ్ళినంత మాత్రాన కమలంపార్టీ ఏమీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదే.

ఇంతచిన్న విషయం టీఆర్ఎస్ ఎంఎల్ఏలకు తెలీకుండానే ఉంటుందా ? కేసీయార్ మీద మైండ్ గేమ్ ఆడేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే. ఇటువంటి మైండ్ గేమ్ లు కేసీయార్ కు కొత్తా కాదు తెలీంది కాదు. బండి లాంటి నేతలను కేసీయార్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలామందినే చూసుంటారు. బండి చేసిన ప్రకటనతో కేసీయార్ టెన్షన్ పడిపోయి కిందా మీద పడేది కూడా ఏమీ ఉండదు. ఏదో బండి చెప్పారు..మీడియా ప్రచురించిందంతే. మహా అయితే ఏమవుతుందంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసే అవకాశం రానివాళ్ళు బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసే అవకాశం దక్కించుకోవచ్చంతే.

This post was last modified on January 3, 2021 4:36 pm

Share

Recent Posts

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

15 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

15 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

1 hour ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

3 hours ago