Political News

కేసీయార్ మీద బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసిందా ?

‘టిఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎంఎల్ఏలు మాతో టచ్ లో ఉన్నారు’ ..ఇది తాజాగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఇందులో నిజమెంతన్నది పక్కన పెట్టేద్దాం. మరంత మంది ఎంఎల్ఏలు నిజంగానే తమతో టచ్ లో ఉంటే మరెందుకని వాళ్ళందరినీ టోకుగా చేర్చేసుకోవటం లేదు ? ఎందుకనంటే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకూడదనే ఆగుతున్నామని కతలు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అధికారపార్టీకి చెందిన ఎంఎల్ఏలను, ఎంపిలను లాగేసుకుంటున్న విషయం పాపం బండికి ఇంకా తెలీలేదేమో.

మొన్నటికి మొన్న మిత్రపక్షమని కూడా చూడకుండా అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయుకి చెందిన ఏడుగురు ఎంఎల్ఏల్లో ఆరుగురిని బీజేపీలోకి లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు పశ్చిమబెంగాల్లో ఓ ఎంపి+నలుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్ఏలను బీజేపీలోకి లాగేసుకున్న విషయం దేశమంతా చూసింది. ఇక మధ్యప్రదేశ్, కర్నాటక, అంతకుముందు గోవా, సిక్కిం, మణిపూర్ లో కాంగ్రెస్ ఎంఎల్ఏలను ఎలా లొంగదీసుకున్నారో అందరికీ తెలిసిందే. రాజస్ధాన్ లో కూడా కాంగ్రెస్ ఎంఎల్ఏలను లొంగదీసుకున్నారని స్వయంగా ముఖ్యమంత్రి అశోగ్ గెహ్లాత్ మొత్తకుంటున్నన విషయం తెలిసిందే.

ఇన్ని రాష్ట్రాల్లో అడ్డురాని రాజ్యాంగం కేవలం ఒక్క తెలంగాణాలో మాత్రమే అడ్డుపడుతోందా ? రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని చూస్తున్నట్లు బండి చెబుతున్నది చూస్తుంటే పై ప్రాంతాల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా తమపార్టీ నేతలు నడుకుకుంటున్నారని అంగీకరిస్తున్నట్లే కదా. సరే ఇక తెలంగాణా సంగతే తీసుకుంటే 30 మంది ఎంఎల్ఏలు అసలు బీజేపీతో ఎందుకు టచ్ లోకి వెళతారు ? టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వెళితే వచ్చే ఉపయోగం ఏమిటి ? 30 మంది ఎంఎల్ఏలు బీజేపీలోకి వెళ్ళినంత మాత్రాన కమలంపార్టీ ఏమీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదే.

ఇంతచిన్న విషయం టీఆర్ఎస్ ఎంఎల్ఏలకు తెలీకుండానే ఉంటుందా ? కేసీయార్ మీద మైండ్ గేమ్ ఆడేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే. ఇటువంటి మైండ్ గేమ్ లు కేసీయార్ కు కొత్తా కాదు తెలీంది కాదు. బండి లాంటి నేతలను కేసీయార్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలామందినే చూసుంటారు. బండి చేసిన ప్రకటనతో కేసీయార్ టెన్షన్ పడిపోయి కిందా మీద పడేది కూడా ఏమీ ఉండదు. ఏదో బండి చెప్పారు..మీడియా ప్రచురించిందంతే. మహా అయితే ఏమవుతుందంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసే అవకాశం రానివాళ్ళు బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసే అవకాశం దక్కించుకోవచ్చంతే.

Satya

Recent Posts

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్…

20 minutes ago

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

55 minutes ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

4 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

4 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

4 hours ago