‘‘నా పేరు ముఖేష్’.. ‘‘తన రెండు గాజులూ అమ్ముకోవాల్సి వచ్చింది’’.. ‘‘కానీ ఎంత మూల్యానికి..’’.. ‘‘చక్కగా ఉండండి.. రనౌట్ కాకండి’’.. రెగ్యులర్గా సినిమాలు చూసే వాళ్లు ఈ డైలాగుల్ని అంత సులువుగా మరిచిపోలేరు. థియేటర్కు వెళ్లి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడినీ ముందు ‘ధూమపానం హానికరం’ అని హెచ్చరిస్తూ ఒక యాడ్ వేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఒరవడి ఏడెనిమిదేళ్లుగా నడుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ప్రకటనల్ని రూపొందిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రకటనలు మారుతూ ఉంటాయి. మళ్లీ థియేటర్లలో సినిమాల ప్రదర్శన మొదలయ్యే సమయానికి సిగరెట్ స్మోకింగ్ మీద కొత్తగా ఏ ప్రకటన వస్తుందో ఏమో కానీ.. దాంతో పాటుగా ఇప్పటిదాకా చూడని ఓ ప్రకటన దర్శనమిచ్చే అవకాశముంది. ఆ యాడ్ ‘కరోనా’ మీద రూపొందించింది అయితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ప్రస్తుతం దేశాన్ని కరోనా ఎలా కుదిపేస్తోందో తెలిసిందే. దీని ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు. ఈ వైరస్ వ్యాప్తి ఎంతగా తగ్గుముఖం పట్టిన ఇంకో ఏడాది పాటు కచ్చితంగా దాని తాలూకు భయం కొనసాగవచ్చు. దీని గురించి మరిచిపోవడానికి కొన్నేళ్లు పట్టొచ్చు. వ్యాక్సిన్ వచ్చే వరకు ఆందోళన తప్పదు. ప్రస్తుతం ప్రభుత్వాలన్నీ కరోనా మీద అవగాహన కల్పించే, హెచ్చరించే పనిలోనే ఉన్నాయి. ఇది మున్ముందు కూడా కొనసాగుతుంది. జనాలు మళ్లీ థియేటర్లకు రావడం మొదలయ్యాక సినిమాల మధ్యలో కచ్చితంగా కరోనా ప్రకటనలు వేయడం ఖాయం. అందులోనూ థియేటర్లలోనే కరోనా వ్యాప్తికి కాస్త ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి థియేటర్లలో ఎలా వ్యవహరించాలి.. ఇళ్లలో ఎలా ఉండాలి.. బహిరంగ ప్రదేశాల్లో ఎలా మసులుకోవాలనే విషయంలో జాగృతం చేస్తూ యాడ్స్ రావడం ఖాయం. కాబట్టి మళ్లీ సినిమాలకు వెళ్లే సమయానికి సిగరెట్ యాడ్స్తో పాటు కరోనా ప్రకటనలు కూడా చూడటానికి మానసికంగా సిద్ధంగా ఉండాల్సిందే.
This post was last modified on May 4, 2020 8:02 pm
సోషల్ మీడియాలోకి మంగళవారం ఎంట్రీ ఇచ్చిన ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో చూడటానికి పెద్దగా ఏమీ…
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు అన్న విషయం తెలిసిందే. కానీ, తమకు ప్రతిపక్ష…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు అభినందించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన…
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇటీవల ఊహించని పరిణామం సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది…
అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిన్న చీకటి…
ఏపీకి మంగళవారం ఓ విశిష్ట అతిథి విచ్చేశారు. నేరుగా ఏపీ రాజదాని అమరావతి వచ్చిన సదరు అతిథి… ఏపీ సీఎం…