‘‘నా పేరు ముఖేష్’.. ‘‘తన రెండు గాజులూ అమ్ముకోవాల్సి వచ్చింది’’.. ‘‘కానీ ఎంత మూల్యానికి..’’.. ‘‘చక్కగా ఉండండి.. రనౌట్ కాకండి’’.. రెగ్యులర్గా సినిమాలు చూసే వాళ్లు ఈ డైలాగుల్ని అంత సులువుగా మరిచిపోలేరు. థియేటర్కు వెళ్లి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడినీ ముందు ‘ధూమపానం హానికరం’ అని హెచ్చరిస్తూ ఒక యాడ్ వేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఒరవడి ఏడెనిమిదేళ్లుగా నడుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ప్రకటనల్ని రూపొందిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రకటనలు మారుతూ ఉంటాయి. మళ్లీ థియేటర్లలో సినిమాల ప్రదర్శన మొదలయ్యే సమయానికి సిగరెట్ స్మోకింగ్ మీద కొత్తగా ఏ ప్రకటన వస్తుందో ఏమో కానీ.. దాంతో పాటుగా ఇప్పటిదాకా చూడని ఓ ప్రకటన దర్శనమిచ్చే అవకాశముంది. ఆ యాడ్ ‘కరోనా’ మీద రూపొందించింది అయితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ప్రస్తుతం దేశాన్ని కరోనా ఎలా కుదిపేస్తోందో తెలిసిందే. దీని ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు. ఈ వైరస్ వ్యాప్తి ఎంతగా తగ్గుముఖం పట్టిన ఇంకో ఏడాది పాటు కచ్చితంగా దాని తాలూకు భయం కొనసాగవచ్చు. దీని గురించి మరిచిపోవడానికి కొన్నేళ్లు పట్టొచ్చు. వ్యాక్సిన్ వచ్చే వరకు ఆందోళన తప్పదు. ప్రస్తుతం ప్రభుత్వాలన్నీ కరోనా మీద అవగాహన కల్పించే, హెచ్చరించే పనిలోనే ఉన్నాయి. ఇది మున్ముందు కూడా కొనసాగుతుంది. జనాలు మళ్లీ థియేటర్లకు రావడం మొదలయ్యాక సినిమాల మధ్యలో కచ్చితంగా కరోనా ప్రకటనలు వేయడం ఖాయం. అందులోనూ థియేటర్లలోనే కరోనా వ్యాప్తికి కాస్త ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి థియేటర్లలో ఎలా వ్యవహరించాలి.. ఇళ్లలో ఎలా ఉండాలి.. బహిరంగ ప్రదేశాల్లో ఎలా మసులుకోవాలనే విషయంలో జాగృతం చేస్తూ యాడ్స్ రావడం ఖాయం. కాబట్టి మళ్లీ సినిమాలకు వెళ్లే సమయానికి సిగరెట్ యాడ్స్తో పాటు కరోనా ప్రకటనలు కూడా చూడటానికి మానసికంగా సిద్ధంగా ఉండాల్సిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…
రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…