Political News

‘కాషాయం క‌ప్పుకొన్న‌వారంతా టీడీపీ కార్య‌క‌ర్త‌లే’

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ప‌నితీరు ఎలా ఉన్నా.. ఇటీవ‌ల కాలంలో పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తున్నారు. అయితే.. ఈవాయిస్సే ఒక్కొక్క సంద‌ర్భంలో వివాదానికి దారితీస్తోంది. తాజాగా భూమ‌న వ్యాఖ్య‌లు, ఆయ‌న వ్య‌వ‌హారానికి స్వామీజీల నుంచి సెగ త‌గిలింది. క‌రుణాక‌ర్ రెడ్డి హిందువుల‌ను, హిందూత్వ‌ను అవ‌మా నిస్తున్నారంటూ.. ప‌లువురు స్వాములు.. నిర‌స‌న తెలిపారు.

ఎందుకు?

తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం విష‌యంలో హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా.. క‌రుణాకర్ రెడ్డి వ్య‌వ‌హ రిస్తున్నార‌ని.. గ‌త కొంత‌కాలంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఆల‌య సంప్ర‌దాయాలు, మ‌ర్యాదల‌పైనా ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తున్నారని ప‌లువురు స్వాములు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న హిందూ స‌మాజానికి, తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్న డిమాండ్లు వ‌స్తున్నాయి. అయితే.. క‌రుణాక‌ర్ రెడ్డి మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తికి వ‌చ్చిన వివిధ మ‌ఠాల‌కు చెందిన‌ ప‌లువురు స్వామీజీలు.. క‌రుణాక‌ర్ రెడ్డి తీరును నిర‌సిస్తూ.. శాంతియుత ధ‌ర్నా, నిర‌స‌న‌కు దిగారు. న‌గ‌ర సంకీర్త‌న చేసుకుంటూ.. శిల్పారామం నుంచి భూమ‌న ఇంటికి చేరుకుని.. ఆయ‌న ఇంటి ముందు నిర‌స‌న చేప‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. పోలీసులు వీరిని గుర్తించి అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ త‌ర్వాత‌.. వారు శాంతించి వెనుదిగారు.

వాళ్లంతా టీడీపీ వారే!

కాగా.. స్వాములు చేసిన నిర‌స‌న‌పై భూమ‌న మ‌రోసారి ఫైర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కూడా.. ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కాషాయం ధ‌రించిన వారంతా .. టీడీపీ కార్య‌క‌ర్త‌లేన‌ని వ్యాఖ్యానించ‌డం మ‌రింత దుమారం రేపింది. ఉద్దేశ పూర్వ‌కంగానే త‌న‌పై దాడి చేస్తున్నార‌ని చెప్పారు. తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న అప‌చారాల‌నే తాను ప్ర‌శ్నిస్తున్నాన‌ని తెలిపారు. కానీ, త‌న‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు.. కాషాయం క‌ప్పుకొన్న వారిని పంపించార‌ని భూమ‌న అన్నారు. ఈ వ్య‌వ‌హారం మ‌రోసారి ర‌చ్చ‌కు దారి తీసింది.

This post was last modified on May 27, 2026 4:31 am

Share

Recent Posts

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

9 minutes ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

18 minutes ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

45 minutes ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

1 hour ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

2 hours ago

వైసీపీ ‘జెన్ జీ’ కాదు… ‘గంజాయ్ జీ’

వైసీపీ అధినేత జ‌గ‌న్ వెనుక ఉండే కార్య‌క‌ర్త‌లు, యువ‌త అంతా `జెన్‌జీ` అంటూ వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా…

2 hours ago