‘‘ఓన్లీ రజినీకాంత్ ఎగ్జిట్ పాలిటిక్స్ వితౌట్ ఎంటరింగ్ ఇట్’’.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్న జోక్ ఇది. తాను రాజకీయాల్లోకి రావడం గురించి ఎప్పట్నుంచో ఊరిస్తున్న రజినీ.. ఇదిగో ఇదిగో అంటూనే చివరికి తన అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజకీయాల్లోకి రావొద్దని ఆయన నిర్ణయించుకున్నారు.
ఇందుకుగాను అభిమానులను క్షమాపణ కూడా కోరారు. కొంతమంది అభిమానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు కానీ.. రజినీ రాజకీయాల్లోకి వస్తాడన్న ఆశలతో ఇప్పటికే కొంత పని చేసి, భవిష్యత్ ప్రణాళికలతో ఉన్న అభిమానులు మాత్రం ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది అభిమానులు రజినీ ఇంటిముందు ఆందోళన చేసినా ఫలితం లేకపోయింది. తన ఆరోగ్యం గురించి పూర్తి స్పష్టతతో ఉన్న రజినీ.. కరోనా టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పెట్టే సాహసం చేయాలనుకోవట్లేదు.
ఐతే రజినీ రాజకీయారంగేట్రం కథ ముగిసిన కథ కాబట్టి.. ఇంతకీ వచ్చే ఏఢాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆయన ఎవరికైనా మద్దుతగా అయినా నిలుస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. తనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకున్న రజినీ.. ఆ అవకాశం లేనపుడు ఎవరో ఒకరికి మద్దతుగా నిలిచి వారి విజయానికి తోడ్పటానికి చూడొచ్చు. తనకున్న జనాదరణను ఆయనెందుకు వృథా చేసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ రజినీ రాజకీయాల్లోకి వస్తాడన్న అంచనాల తర్వాత ఆ వర్గమంతా ఏకతాటిపైకి వచ్చింది.
తనకు ఆప్త మిత్రుడైన కమల్కు ఆయన మద్దతుగా నిలిస్తే ఆయన మంచి ఫలితాలు సాధించడానికి అవకాశముంది. ఎలాగూ రజినీ పార్టీ పెట్టి ఉంటే.. కమల్తో కలిసేవారన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు తాను రాలేకపోతున్నాడు కాబట్టి.. తన మిత్రుడికి మద్దతు ప్రకటించి.. తన అభిమానులంతా కమల్ పార్టీకి మద్దతుగా నిలవాలని రజినీ కోరవచ్చు. కాకపోతే రజినీ ఎప్పుడూ హిందుత్వ భావజాలంతో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఆలోచనలు దానికి భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కమల్కు మద్దతుగా నిలుస్తాడా అన్న సందేహాలున్నాయి. మరి అన్నాడీఎంకే-బీజేపీ కూటమి లేదా.. డీఎంకేకు ఆయనేమైనా మద్దతిస్తారేమో చూడాలి.
This post was last modified on January 1, 2021 11:04 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…