Political News

ఫుల్లుగా క్లాసు పీకితే కానీ కదలరా ?

అనంతపురం జిల్లాలో తెలుగుదేశంపార్టీ నేతల గురించి ఇపుడిదే అనుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ కు వైసీపీ ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య పెరిగిపోతున్న గొడవలు అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఈనాటివి కావు సర్దుబాటు అవ్వటానికి. అలాంటిది నాలుగు రోజుల క్రితం జేసీ ఇంటి మీదకు ఎంఎల్ఏ హఠాత్తుగా దాడి చేశారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ కొడుకు అస్మిత్ రెడ్డి కానీ ఇంట్లో లేరుకాబట్టి సరిపోయింది. ఉండుంటే ఏమయ్యేదో ?

సరే తనింటిపై మద్దతుదారులతో కలిసి ఎంఎల్ఏ దాడి చేసిన విషయం జేసీ తెలుసుకున్నారు. వెంటనే ఇంటికి చేరుకునే సమయానికే పోలీసులు జోక్యం చేసుకుని ఎంఎల్ఏ+మద్దతుదారులను అక్కడి నుండి పంపేశారు. ఇంటికి వచ్చిన జేసీ జరిగింది తెలుసుకుని తన మద్దతుదారులతో రెచ్చిపోవటంతో రెండువర్గాల మధ్య రాళ్ళయుద్ధమే జరిగింది. ఈ విషయమై ఇఫ్పటికీ నిప్పు రాజుకుంటుంనే ఉంది.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే జేసీ ఇంటిమీదకు వైసీపీ ఎంఎల్ఏ దాడి విషయాన్ని టీడీపీలోనే చాలా మంది సీనియర్ నేతలు అస్సలు పట్టించుకోలేదు. మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు తప్ప ఇంకో నేతెవరు పరామర్శ కూడా చేయలేదు. పరామర్శకాదు కదా కనీసం దాడిని ఖండిస్తు ఓ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. పార్టీలో జేసీ ఈ పరిస్దితికి వాళ్ళ స్వయంకృతమనే చెప్పాలి. జిల్లాలోని అందరి నేతలతోను గతంలో పెట్టుకున్న గొడవల వల్లే చాలామంది నేతలు జరిగిన దాడితో తమకు సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయారు.

దాంతో జేసీలు ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి భోరుమన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమింటి మీదకు వైసీపీ ఎంఎల్ఏ దాడిచేస్తే కనీసం నేతలు ఖండనలు కూడా ఇవ్వలేదన్న విషయాన్ని జేసీ బ్రదర్స్ చంద్రబాబుతో ఫోన్లో ఫిర్యాదు చేశారట. దాంతో చంద్రబాబు జోక్యం చేసుకుని జిల్లాలోని సీనియర్లకు ఫోన్లు చేసి బాగా క్లాసు పీకినట్లు సమాచారం. అందుకనే రెండు రోజుల క్రితం వివిధ జిల్లాల నేతలతో జూమ్ యాప్ లో మాట్లాడిన చంద్రబాబు ప్రత్యేకంగా జేసీల గురించి ప్రస్తావించారు.

నేరుగా చంద్రబాబు నుండే క్లాసు పడటంతో కొందరు సీనియర్ నేతలు వైసీపీ ఎంఎల్ఏ పెద్దారెడ్డి దాడిని ఖండిస్తు ప్రకటనలు చేశారు. పరిటాల సునీత, శ్రీరామ్ తో పాటు పయ్యావుల తదితరులు పెద్దారెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటు డిమాండ్ చేశారు. అంటే చంద్రబాబు చెబితే కానీ జేసీలకు మద్దతుగా సీనియర్ నేతలెవరు మాట్లాడలేదంటేనే బ్రదర్స్ పరిస్దితి పార్టీలో ఎలాగుందో అర్ధమైపోతోంది.

This post was last modified on December 31, 2020 9:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

2 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

3 hours ago

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

5 hours ago

స‌రిహ‌ద్దు కంచె: ఇది క‌దా `ఎన్నిక‌ల‌ రాజ‌కీయం` అంటే!

+ దేశ స‌రిహ‌ద్దులను కాపాడాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? నిస్సందేహంగా కేంద్ర ప్ర‌భుత్వానిదే. + దేశ స‌రిహ‌ద్దుల నుంచి పెరుగుతున్న చొర‌బాట్ల‌ను…

7 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

15 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

15 hours ago