ఏపీలో అధికార కూటమి రథసారధిగా ఉన్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో గత కొంతకాలంగా ఓ వినూత్న గోల తరచూ వినబడుతోంది. తాము అణగారిన వర్గాలమని చెబుతున్న రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు… తాము చేసిన తప్పు ఇతరులూ చేస్తున్నారని… వారిని వదిలేసి తమను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ సాగుతున్న ఈ గోల ఇటీవల మరింతగా ఎక్కువైందనే చెప్పాలి. తాము తప్పు చేయడం లేదన్న మాటను అంతగా ప్రస్తావించని సదరు నేతలు… ఇతర నియోజకవర్గాల్లో ఇదే తరహా తప్పు జరుగుతోందని.. దానిపై ఎందుకు చర్యలు తీసుకోరని మాత్రం అడుగుతున్నారు. నిజంగానే ఈ తరహా గోల వింతైనదే. మరి ఈ తరహా గోలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు అన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు) నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన థామస్ 2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని రోజులకే థామస్… తాను ఎస్సీ వర్గానికి చెందిన వాడినని, అందుకే తనను అందరూ టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మరోమారు మీడియా ముందుకు వచ్చిన థామస్… తనపై సొంత పార్టీకి చెందిన నేతలే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన వాపోయారు. తాను చేస్తున్నానని చెబుతున్న అవినీతిని అధికార పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలూ చేస్తున్నారని, మరి వారిపై చర్యలు తీసుకోరా? అని ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా థామస్ ప్రత్యేకించి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావించారు. చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నేత పులివర్తి నాని కొనసాగుతుంటే… నగరి నుంచి గాలి భాను ప్రకాశ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారిద్దరూ మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని, వారి గురించి ఎవరూ మాట్లాడరేమిటని ఆయన ప్రశ్నిస్తున్న తీరు కలకలం రేపుతోంది.
ఇక ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ఇస్తున్న ర్యాంకులను కూడా థామస్ తప్పుబట్టారు. డబ్బు తీసుకుని ర్యాంకులు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ర్యాంకుల్లో తొలి మూడు స్థానాల్లో మీ పేరు ఉండాలంటే రూ.5 నుంచి రూ.10లక్షలు ఇవ్వాలని తననే నేరుగా డిమాండ్ చేశారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తాము ఎస్సీలమని, ఇప్పటిదాకా అణచివేయబడ్డామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తాము ఎదిగేందుకు అవకాశం ఇవ్వాలని, తమను వదిలేయాలని ఆయన చేసిన డిమాండ్ ఇప్పుడు కొత్త చర్చకు తెర లేపిందని చెప్పాలి.
This post was last modified on May 20, 2026 5:26 pm
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది. బ్లూ కలర్ స్విమ్ సూట్ లో…
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు అన్న సామెత ఇప్పుడు ఏపీలోని విపక్షం వైసీపీకి సూటిగా సరిపోతుందని చెప్పాలి. వైసీపీ అధినేత వైఎస్…
ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్టాన్ని జెట్ స్పీడుతో అభివృద్ది చేస్తోందంటూ టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పట్టుమని పది రోజులు కూడా కాకముందే.. ఇటు రాజకీయంగా .. అటు పాలన పరంగా..…
వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కూడా.. సంక్షేమ పథకాలను మరింత పెంచి ఇస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
ఎవరిది ఏ కులమో తెలియక్కర్లేదా? అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా కుల గణనను చేపట్టాల్సిన అవసరం ఉందని…