తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. టీవీకే తరఫున శివకాశి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ అమ్మాయి, ఇప్పుడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేబినెట్లో మంత్రిగా చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది.
కేవలం 29 ఏళ్ల వయసులోనే తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచి, వెంటనే మంత్రివర్గంలో స్థానం సంపాదించడం ద్వారా కీర్తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శివకాశి నియోజకవర్గ చరిత్రలో 1957 తర్వాత మహిళా ఎమ్మెల్యేగా గెలిచిన తొలి నాయకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా పురుష అభ్యర్థుల ఆధిపత్యం కొనసాగిన ఈ స్థానంలో విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాజకీయాల్లోకి రాకముందు కీర్తన రాజకీయ వ్యూహకర్తగా, డిజిటల్ ప్రచార నిపుణురాలిగా పనిచేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన సమయంలో టీడీపీ సోషల్ మీడియా విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. ఎన్నికల ప్రచార వ్యూహాలు, డిజిటల్ క్యాంపెయిన్లలో ఆమెకు మంచి అనుభవం ఉంది.
టీడీపీ ప్రచార బృందంలో పనిచేసిన అనుభవంతో తెలుగు భాషపై మంచి పట్టు సాధించిన కీర్తన, శివకాశి ఎన్నికల ప్రచారంలో తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగులో చర్చలు చేయడం విశేషం.
యువత, మహిళల మద్దతుతో ఆమె భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్తో కలిసి కీర్తన కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్న టీవీకేలో కీర్తన ఎదుగుదల ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.
This post was last modified on May 11, 2026 12:19 am
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…