Political News

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ దుందుభి మోగించారు. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ టీవీకే నామమాత్రపు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. కానీ, మాజీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే మాత్రం టీవీకే గెలుపును ఏడాది ముందుగానే అంచనా వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే… పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన రోజుల్లో పీకే అంచనాలకు చాలా విలువ ఉండేదు. 2014 లో బిహార్ లో నితీశ్ కుమార్ ను సీఎంగా, కేంద్రంలో మోదీని ప్రధానిగా నిలబెట్టడంలో పీకే తన వంతు పాత్రపోషించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్ ను. 2021 ఎన్నికల్లో బెంగాల్ లో మమతా బెనర్జీని, తమిళనాడులో స్టాలిన్ ను ముఖ్యమంత్రిని చేయడంలోనూ పీకే ముఖ్య పాత్ర పోషించారు.

అయితే, ఆ తర్వాత బిహార్ లో సొంత పార్టీ పెట్టి ఓటమి పాలవ్వడం. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా బాధ్యతల నుంచి తప్పుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో పీకే అంచనాలు పలుమార్లు తప్పాయి. కానీ, తమిళనాడు ఎన్నికల పలితాల విషయంలో మాత్రం పీకే చెప్పింది చెప్పినట్లు జరిగడంతో మరోసారి పీకే వార్తల్లో నిలిచారు.

టీవీకే ఒంటరిగా పోటీ చేస్తే విజయం సాధిస్తుంది అంటూ గత ఏడాది ఓ తమిళ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పీకే చెప్పిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ మాట చెప్పిన వెంటనే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..118 సీట్లు వస్తాయా అంటూ నవ్వు మొఖం పెట్టారు. దీంతో, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోవాలని.. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ వీడియో ప్లే చేయాలని ఆ యాంకర్ కు పీకే కౌంటర్
ఇచ్చారు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో, పీకేలో ఇంకా పస తగ్గలేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, 2025లో టీవీకే తరఫున ఎన్నికల ప్రచార బాధ్యతల గురించి విజయ్ తో చర్చలు జరిపిన పీకే…ఆ తర్వాత మధ్యలో హ్యాండ్ ఇచ్చారన్న విషయంపై కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అన్న రీతిలో బీహార్ ఎన్నికల్లో పీకే పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతిని కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

అయితే తాను రాజకీయ వ్యూహకర్తగా రిటైర్ అయిపోయానని, కానీ, ఇక్కడ తన మిత్రుడు విజయ్ కోసం మాత్రమే వచ్చానని పీకే చెప్పారు. విజయ్ ఒక రాజకీయ నాయకుడు కాదని కాబట్టే అతనికి సలహాలు ఇచ్చేందుకు తాను వచ్చానని అన్నారు. అయితే తన సొంత పార్టీ బాధ్యతలు చూసుకునేందుకు బీహార్ వెళుతున్నానని అందుకే మధ్యలో వెళ్లి పోవాల్సి వచ్చిందని పీకే అప్పట్లో వివరణ ఇచ్చారు.

Kumar

Recent Posts

అంత అత్యాశ ఎందుకు ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…

3 hours ago

అవమానంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ‘అల్ఫా’

మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…

3 hours ago

సంయుక్త హాట్ మోడ్ అదిరింది

సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…

4 hours ago

నాగార్జున నోట‌… చింటు మాట‌

టాలీవుడ్ నిర్మాతల్లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీకి సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంత‌మంది అత‌ణ్ని అభిమానిస్తే.. కొంత‌మంది త‌న‌ను అదే…

4 hours ago

చింతమనేని Vs పవన్… ఎలా ముగిసింది?

టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…

4 hours ago

దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్

మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…

6 hours ago