Political News

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ దుందుభి మోగించారు. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ టీవీకే నామమాత్రపు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. కానీ, మాజీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే మాత్రం టీవీకే గెలుపును ఏడాది ముందుగానే అంచనా వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే… పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన రోజుల్లో పీకే అంచనాలకు చాలా విలువ ఉండేదు. 2014 లో బిహార్ లో నితీశ్ కుమార్ ను సీఎంగా, కేంద్రంలో మోదీని ప్రధానిగా నిలబెట్టడంలో పీకే తన వంతు పాత్రపోషించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్ ను. 2021 ఎన్నికల్లో బెంగాల్ లో మమతా బెనర్జీని, తమిళనాడులో స్టాలిన్ ను ముఖ్యమంత్రిని చేయడంలోనూ పీకే ముఖ్య పాత్ర పోషించారు.

అయితే, ఆ తర్వాత బిహార్ లో సొంత పార్టీ పెట్టి ఓటమి పాలవ్వడం. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా బాధ్యతల నుంచి తప్పుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో పీకే అంచనాలు పలుమార్లు తప్పాయి. కానీ, తమిళనాడు ఎన్నికల పలితాల విషయంలో మాత్రం పీకే చెప్పింది చెప్పినట్లు జరిగడంతో మరోసారి పీకే వార్తల్లో నిలిచారు.

టీవీకే ఒంటరిగా పోటీ చేస్తే విజయం సాధిస్తుంది అంటూ గత ఏడాది ఓ తమిళ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పీకే చెప్పిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ మాట చెప్పిన వెంటనే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..118 సీట్లు వస్తాయా అంటూ నవ్వు మొఖం పెట్టారు. దీంతో, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోవాలని.. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ వీడియో ప్లే చేయాలని ఆ యాంకర్ కు పీకే కౌంటర్
ఇచ్చారు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో, పీకేలో ఇంకా పస తగ్గలేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, 2025లో టీవీకే తరఫున ఎన్నికల ప్రచార బాధ్యతల గురించి విజయ్ తో చర్చలు జరిపిన పీకే…ఆ తర్వాత మధ్యలో హ్యాండ్ ఇచ్చారన్న విషయంపై కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అన్న రీతిలో బీహార్ ఎన్నికల్లో పీకే పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతిని కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

అయితే తాను రాజకీయ వ్యూహకర్తగా రిటైర్ అయిపోయానని, కానీ, ఇక్కడ తన మిత్రుడు విజయ్ కోసం మాత్రమే వచ్చానని పీకే చెప్పారు. విజయ్ ఒక రాజకీయ నాయకుడు కాదని కాబట్టే అతనికి సలహాలు ఇచ్చేందుకు తాను వచ్చానని అన్నారు. అయితే తన సొంత పార్టీ బాధ్యతలు చూసుకునేందుకు బీహార్ వెళుతున్నానని అందుకే మధ్యలో వెళ్లి పోవాల్సి వచ్చిందని పీకే అప్పట్లో వివరణ ఇచ్చారు.

Kumar

Recent Posts

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

39 minutes ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

1 hour ago

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

4 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

7 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

7 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

7 hours ago