Political News

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ వస్తున్న దీదీ… నాలుగో సారి మాత్రం ఓటమి బాటలో సాగుతున్నారు. వామపక్షాల నుంచి అధికార పగ్గాలను చేజిక్కించుకున్న దీదీ… బెంగాల్ లో తనకు తిరుగు లేదన్నట్లుగా వ్యవహరించారు. పాలనలో తనదైన నిర్ణయాలు తీసుకున్న దీదీ… ఆ నిర్ణయాల అమలులో చివరకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎదిరించిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించింది. ఒంటెత్తు పోకడలతోనే సాగిన దీదీ… ఆ తరహా వైఖరి ఎప్పటికైనా తన పుట్టి ముంచుతుందని గ్రహించలేకపోయారు. ఈ వైఖరే ఇప్పుడు ఆమెను పదవీచ్యుతురాలిని చేస్తోందని చెప్పక తప్పదు.

15 ఏళ్ల క్రితం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాటి బుద్ధదేవ్ భట్టాచార్య పాలనతో పాటు మూడు దశాబ్దాల కమ్యూనిస్టల పాలనపై విసుగెత్తిన బెంగాలీలు ఒక్కసారిగా దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు అధికార పగ్గాలు అప్పగించారు. అయితే వామపక్ష ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందుతుందని భావించిన బెంగాలీలకు తమ భావన తప్పని చాలా ఆలస్యంగా తెలిసిందని చెప్పక తప్పదు. సీబీఐ లాంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను బెంగాల్ లోకి అనుమతించకుండా దీదీ సర్కారు తీసుకున్న నిర్ణయం నాడు యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఆ సందర్భంగా సీబీఐ అధికారులపై తన పోలీసులతో దీదీ ఏ రీతిన ఇబ్బంది పెట్టిందన్న విషయాన్ని దేశం మొత్తం అలా కళ్లప్పగించి చూసింది.

కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారుతో తనకేదో బద్ధ శత్రుత్వం ఉన్నట్లుగా దీదీ ఊగిపోయిన వైనం కూడా ఆసక్తి రేకెత్తించిన అంశమే. అయితే అధికారంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ధిక్కారాన్ని అంతగా సహించలేరు కదా. ఆ విధంగానే కేంద్రంలోని అధికార కూటమి, ఆ కూటమి రథసారథి బీజేపీ మమత ధిక్కారాన్ని సహించలేకపోయింది. దీదీని ఓడించి తీరాలన్న కలితో బీజేపీ కదిలింది. కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో అమిత్ షా బెంగాల్ లో దీదీ ఓటమికి ప్రత్యేక ప్రణాళికను రచించి అమలు చేశారు. అందులో భాగంగా దీదీకి అప్పటిదాకా వెన్నుదన్నుగా నిలిచిన సువేందు అధికారి తృణమూల్ ను వీడి బీజేపీలో చేరారు. ఇప్పుడు దీదీ ఖాళీ చేయనున్న కుర్చీనే ఆయనే అధిరోహించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ఓ వైపు బీజేపీ తనను అధికారం నుంచి దించేసే దిశగా పదునైన వ్యూహాలను రచిస్తూ సాగుతున్నా దీదీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారన్న వాదనలు లేకపోలేదు. అయితే బీజేపీ ఎత్తులను చిత్తు చేసే దిశగా వ్యూహాలు దీదీ వద్ద లేకుండాపోయాయన్న మరో వాదనా లేకపోలేదు. ఎంతసేపూ తనదైన శైలి ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ సాగిన దీదీ… తనకు పొంచి ఉన్న ముప్పును గమినించినా… దానికి విరుగుడు మంత్రాన్ని రచించుకోలేకపోయారు. చుట్టూ బీజేపీ గీసిన మంత్రాంగం తన పనిని తాను శరవేగంగా చేసుకుంటూ పోగా… ఒంటరిగా మిగిలిపోయిన దీదీ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం తప్పించి ఏమీ చేయలేకపోయారు. ఇదే తీరు ఇప్పుడు ఆమెను అధికారం నుంచి దించేస్తోందని చెప్పక తప్పదు.

Kumar

Recent Posts

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

21 minutes ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

2 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

3 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

3 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

4 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

5 hours ago