విషాద ఉదంతం చోటు చేసుకుంది. ఏ మాత్రం ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కర్ణాటక రాజకీయ వర్గాల్నే కాదు.. దేశ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్న వైనం తాజాగా వెలుగు చూసింది. చిక్ మంగ్ ళూరు వద్ద ఆయన డెడ్ బాడీని గుర్తించారు.
రైలు పట్టాలపై ఆయన మృతదేహం వద్దే.. సూసైడ్ నోట్ లభించింది. సోమవారం సాయంత్రం ఆయన ఒంటరిగా కారులో బయలుదేరినట్లుగా చెబుతున్నారు. ఈ నెల 15న కర్ణాటక శాసన మండలిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. పలువురు కాంగ్రెస్ సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ధర్మేగౌడను కుర్చీలో నుంచి లాగేయటం తెలిసిందే.
ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతంతో తీవ్ర మనస్తాపానికి గురైన డిప్యూటీ ఛైర్మన్.. ఆత్మహత్య చేసుకోవటానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఉదంతంతోనే సూసైడ్ చేసుకున్నారా? మరేదైనా కారణం ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. ధర్మేగౌడ ఆత్మహత్యపై మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు. కర్ణాటక రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారిన ఈ ఉదంతాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సూసైడ్ కు చోటు చేసుకున్న అంశాలపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
This post was last modified on December 29, 2020 9:18 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…