ఏపీలో జగన్ పాలనకు ఏడాది పూర్తయింది. నిజానికి కొత్త ప్రభుత్వానికి ఏడాది కాలం అంటే.. సాధించిన విషయాలకు గీటు రాయి వంటిదనే చెప్పాలి. అయితే, దురదృష్టం ఏంటంటే.. ఈ ఏడాది కాలంలోనూ జగన్ ప్రభుత్వానికి కరోనా వైరస్ అశనిపాతంగా పరిణమించింది. దీంతో ఇటీవల రెండు నెలల కాలం హరించుకుపోయింది. దీంతో జగన్ పాలన ఏడాది ముగిసినప్పటికీ.. పది మాసాలనే ప్రామాణికంగా భావించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో జగన్ పరిపాలనను గమనిస్తే.. కీలకమైన అనేక విషయాలు వెలుగు చూస్తాయి. వీటిలో మరింత కీలకమైంది.. మహిళలకు ప్రాధాన్యం. నిజానికి చాలా ప్రభుత్వాలు తాము మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడం అందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబు కూడా ఇదే మాట చెప్పేవారు.
అయితే, ప్రాధాన్యం అంటే ఏంటి? అనే విషయంలో జగన్ చరిత్ర సృష్టించారని అంటున్నారు పరిశీలకులు. అదెలాగంటే.. ప్రాధాన్యం అంటే.. ఏదో మహిళలకు కొన్ని పదవులు ఇవ్వడమో.. లేక వారికి టికెట్లు ఇవ్వడమో వరకే పరిమితం కాలేదు. వారి ఆలోచనా శక్తిని కూడా జగన్ గుర్తించారు. జగన్ కేబినెట్లో ఒకరు డిప్యూటీ సీఎంగా.. ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. అదే సమయంలో నామినేటెడ్ పదవుల్లో ఒకరు ఉన్నారు.
వీరందరికీ పదవులు ఇవ్వడం అంటే ఇచ్చాం అన్నట్టుగా జగన్ ఏనాడూ వ్యవహరించలేదని అంటారు ఈ మహిళా నాయకులు. పదవులు ఇవ్వడమే కాకుండా వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించారని చెబుతారు. అంతేకాదు, వారు ఏదైనా విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చినా జగన్ స్వీకరిస్తారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో జరిగిన దిశ ఘటన నేపథ్యంలో హోం శాఖ మంత్రి సుచరిత, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రి వనిత దిశపోలీస్ స్టేషన్ల ఆలోచన చేశారు. నిజానికి ఇది ఆదిలో ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన కాదు. ఏ సలహాదారుడు కూడా దీనిని ప్రస్థావించలేదు. కానీ మంత్రులు ఈ విషయాన్ని ఆలోచించి జగన్ ముందు పెట్టారు. దీంతో ఆయన క్షణం కూడా ఆలోచించకుండా.. దిశ యాప్ సహా పోలీస్ స్టేషన్ల ఏర్పాడుకు మార్గదర్శకాలు తయారు చేయాలని హోం శాఖను ఆదేశించారు.
అదే సమయంలో మహిళలకు పౌష్టికాహారం పెంపు సహా మధ్యాహ్న భోజనంలో పౌష్ఠికాహారం కింద చిక్కీలను ఇవ్వాలన్ని మంత్రి వనిత ఆలోచనలను కూడా జగన్ ఖర్చు అని కూడా చూడకుండా అమల్లోకి తెచ్చారు.
ఇక, గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యం కల్పించేందుకు ఉన్న అవకాశాలపై మంత్రి శ్రీవాణి వివరించడంతో వాటి అమలుకు కూడా వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించేలా జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఇక, మరో కీలక విషయం ఏంటంటే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ చరిత్రలో తొలిసారి ఓ మహిళా ఐఏఎస్ నీలం సాహ్నిని నియమించడంతోపాటు ఆమెకు కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జగన్కే చెల్లిందని అంటున్నారు పరిశీలకులు. మరో కీలక విషయం నామినేటెడ్ పదవులు రాష్ట్రంలో ఎక్కడ ఏ శాఖలో ఉన్నప్పటికీ.. వాటిలో 50 శాతం మహిళలకే కేటాయించారు.
ఇక, స్థానిక ఎన్నికల్లోనూ మహిళలకు 50 శాతం అవకాశం కల్పించారు. ఇవన్నీ ఒక ఎత్తు.. ఆర్ధికంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఏ నిర్ణయమైనా.. కూడా మహిళలకు దక్కేలా నిర్ణయం తీసుకోవడం జగన్ మహిళా పక్షపాతి అనేందుకు మరో కారణంగా నిలిచింది. అమ్మ ఒడి సహా కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంటును నేరుగా తల్లుత ఖాతాల్లోకే జమ చేయడం ఏపీ చరిత్రలోనే తొలిసారి అని అధికారులే చెబుతుండడం గమనార్హం.
This post was last modified on May 11, 2020 10:53 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…