Political News

వీర్రాజు దూకుడుకు కారణం ఇదేనా ?

బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి సోము వీర్రాజులో ఒక్కసారిగా దూకుడు పెరిగిపోయింది. నిజానికి బీజేపీ దూకుడంతా వీర్రాజు మాటల్లోనే కనిపిస్తోంది కానీ క్షేత్రస్ధాయిలో మాత్రం లేదన్న విషయం అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసిన విషయంలో కూడా వీర్రాజు ఎందుకింత దూకుడు ప్రదర్శిస్తున్నారు ? ఎందుకంటే తెలంగాణా బీజేపీకి ఏమాత్రం తీసిపోకూడదన్న ఏకైక టార్గెట్ తోనే వీర్రాజు పనిచేస్తున్నట్లు కమలంపార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.

నిజానికి పార్టీ పరంగా చూస్తే తెలంగాణాకు ఏపికి ఏమీ పోలికలేదనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ మొదటి నుండి ఏపితో పోల్చుకుంటే తెలంగాణాలో గట్టిగా ఉంది. చాలా కాలంగా సికింద్రాబాద్ ఎంపిని కమలంపార్టీ గెలుచుకుంటోంది. ఒకసారి ఓడిపోయినా మరో ఎన్నికల్లో గెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలవకపోయినా లోక్ సభకు మాత్రం కమలంపార్టీ చెప్పుకోదగ్గ ఓట్లను తెచ్చుకుంటోంది కాబట్టి.

ఈ కారణంగానే అప్పుడప్పుడైనా బీజేపీ సికింద్రాబాద్ లోక్ సభలో గెలుస్తోంది. ఒకపుడు బండారు దత్తాత్రేయ గెలిచేవారు. ఇపుడు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి గెలిచారు. అలాగే గ్రేటర్ పరిధిలో కూడా అక్కడక్కడ బీజేపీ ఎంఎల్ఏలు గెలుస్తునే ఉన్నారు. కాకపోతే ఇపుడు బండి సంజయ్ వ్యవహార శైలి వల్ల పార్టీకి ఒక్కసారిగా ఊపొచ్చింది. దాంతోపాటు కాలం కూడా కలిసొచ్చి దుబ్బాక ఉపఎన్నికతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించింది. కాబట్టి తెలంగాణాలో బండి ఏమి మాట్లాడినా చెల్లుబాటైపోతోంది.

ఇక ఏపి విషయానికి వస్తే దేశమంతా బీజేపీ గాలి వీచినపుడు మాత్రమే ఎక్కడైనా ఎంపిలు లేకపోతే ఎంఎల్ఏ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తోంది. 2014లో నరేంద్రమోడి గాలితోనే రెండు ఎంపి సీట్లు, నాలుగు ఎంఎల్ఏ సీట్లు గెలిచింది. అంతకుముందు అప్పుడెప్పుడో కార్గిల్ యుద్ధం గాలిలో వాజ్ పేయి హయాంలో గెలిచిందంతే. మొన్నటి మోడి గాలిలో ఇతర రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించినా ఏపిలో మాత్రం ఒక్కసీటులోను గెలవలేదు.

ఇలాంటి పార్టీకి అధ్యక్షునిగా ఉన్న వీర్రాజు వ్యక్తిగా తాను మాత్రం దూకుడు మీదున్నారు. పైగా తెలంగాణాలో పార్టీతో పోల్చి చూసుకుంటున్నట్లు కమలనాదులే చెబుతున్నారు. తెలంగాణాలో పార్టీ దూకుడు మీదున్నట్లే ఏపిలో కూడా దూకుడుతో పరిగెత్తించాలని ప్రయత్నిస్తున్నట్లు పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. జాతీయస్ధాయిలో కూడా ఏపిని తెలంగాణాతో పోల్చి చూస్తున్నారట. దాంతో వీర్రాజుపై అనివార్యంగా తెలంగాణా ఒత్తిడి పెరిగిపోతుందని సమాచారం. అందుకనే తానే కాకుండా పార్టీని కూడా పరుగులు పెట్టించాలని ప్రయత్నిస్తున్నారు. మరి సాధ్యమేనా ?

This post was last modified on December 28, 2020 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

6 seconds ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

3 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

52 minutes ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

2 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

2 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago