వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. అయితే.. ఇదేసమయంలో కీలక నాయకుల అరెస్టుకు పోలీసులు రంగం రెడీ చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. వీరిలో ఒక మాజీ మంత్రి కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో ఇద్దరు కీలక నాయకులు కూడా అరెస్టు కాక తప్పదని కూడాపార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఎవరెవరు?
గుడివాడ మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు కావడం ఖాయమని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వాస్తవానికి ఆయనను కూటమి ప్రభుత్వం రాగానే అరెస్టు చేశారన్న వాదన వినిపించింది. కానీ, ఇతర నాయకులను వివిధ కేసుల్లో అరెస్టు చేసినా.. కొడాలి విషయంలో అడుగులు ముందుకు పడలేదు. అరెస్టు చేయాలని అనుకుంటే ప్రభుత్వం దగ్గర భారీగానే కేసులు ఉన్నాయి. కేసినో నిర్వహణ నుంచి పేకాట క్లబ్బుల నిర్వహణ వరకు.. దూకుడుతో చేసిన వ్యాఖ్యల నుంచి టీడీపీ నేతల బెదిరింపుల దాకా అనేక కేసులు ఉన్నాయి.
కానీ, ఇప్పుడు వాటిని పక్కన పెట్టిన కూటమి ప్రభుత్వం.. స్థానికంగా జరిగిన ఓ అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు రెడీ అయింది. దీనిపై అధికారులు ఇప్పటికే రంగం రెడీ చేశారని సమాచారం.
ఇక, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబును ఆయన మాజీ డ్రైవర్ హత్య, శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనకు సంబంధించి కూడా.. అరెస్టు పర్వం రెడీ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అనంత బాబు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇక, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు కూడా ఈ వారంలోనే జరుగుతుందని పోలీసు వర్గాలు చెబు తున్నాయి. ఇటీవల ఆయన కలెక్టర్ కార్యాలయం ముందు చేసిన నిరసనకు.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు సహా.. అనుమతులు లేకుండా చేసిన నిరసన దీక్షపైనా కేసు నమోదు చేశారు.
దీనిపై ఈ వారంలోనే చర్యలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇలా.. ఈ వారంలో ముగ్గురు కీలక నాయకులను అరెస్టు చేయొచ్చని.. వైసీపీలోనూ చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుంది? వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది చూడాలి.
This post was last modified on April 23, 2026 10:04 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…