వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. అయితే.. ఇదేసమయంలో కీలక నాయకుల అరెస్టుకు పోలీసులు రంగం రెడీ చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. వీరిలో ఒక మాజీ మంత్రి కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో ఇద్దరు కీలక నాయకులు కూడా అరెస్టు కాక తప్పదని కూడాపార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఎవరెవరు?
గుడివాడ మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు కావడం ఖాయమని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వాస్తవానికి ఆయనను కూటమి ప్రభుత్వం రాగానే అరెస్టు చేశారన్న వాదన వినిపించింది. కానీ, ఇతర నాయకులను వివిధ కేసుల్లో అరెస్టు చేసినా.. కొడాలి విషయంలో అడుగులు ముందుకు పడలేదు. అరెస్టు చేయాలని అనుకుంటే ప్రభుత్వం దగ్గర భారీగానే కేసులు ఉన్నాయి. కేసినో నిర్వహణ నుంచి పేకాట క్లబ్బుల నిర్వహణ వరకు.. దూకుడుతో చేసిన వ్యాఖ్యల నుంచి టీడీపీ నేతల బెదిరింపుల దాకా అనేక కేసులు ఉన్నాయి.
కానీ, ఇప్పుడు వాటిని పక్కన పెట్టిన కూటమి ప్రభుత్వం.. స్థానికంగా జరిగిన ఓ అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు రెడీ అయింది. దీనిపై అధికారులు ఇప్పటికే రంగం రెడీ చేశారని సమాచారం.
ఇక, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబును ఆయన మాజీ డ్రైవర్ హత్య, శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనకు సంబంధించి కూడా.. అరెస్టు పర్వం రెడీ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అనంత బాబు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇక, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు కూడా ఈ వారంలోనే జరుగుతుందని పోలీసు వర్గాలు చెబు తున్నాయి. ఇటీవల ఆయన కలెక్టర్ కార్యాలయం ముందు చేసిన నిరసనకు.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు సహా.. అనుమతులు లేకుండా చేసిన నిరసన దీక్షపైనా కేసు నమోదు చేశారు.
దీనిపై ఈ వారంలోనే చర్యలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇలా.. ఈ వారంలో ముగ్గురు కీలక నాయకులను అరెస్టు చేయొచ్చని.. వైసీపీలోనూ చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుంది? వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది చూడాలి.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…