Political News

బీహార్‌పై బీజేపీ ముద్ర‌… ప్రాంతీయ పార్టీల‌కు అలెర్ట్

బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు. అదేవిధంగా ఆయన కుటుంబం కూడా దాదాపు 40 సంవత్సరాలకు పైగానే రాజకీయాల్లో ఉంది. ఈ కుటుంబం గురించి పక్కన పెడితే బీహార్లో బిజెపి ప్రస్థానం ప్రారంభం కావడం, ఏకంగా ఇప్పుడు అధికారం దక్కించుకునే వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే అనేక ఆశ్చర్యకర విషయాలు కనిపిస్తాయి.

గతంలో కేవలం ఒకటి రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైన బిజెపి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేవలం పొత్తులకు మాత్రమే పరిమితం అవుతామని.. ప్రకటించింది. అంతేకాదు బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వమే ఐదు సంవత్సరాలు కొనసాగుతుందని కూడా ఎన్నికల సమయంలో చెప్పింది. అటువంటి పార్టీ ఎన్నికల జరిగి కనీసం 6 నెలలు కూడా గడ‌వ‌క‌ ముందే అధికారాన్ని దక్కించుకోవడం ముఖ్యమంత్రి పీఠంపై తనదైన ముద్ర వేయడం వంటివి ఆశ్చర్యకరంగా మారాయి.

ఉర్దూలో ఒక సామెత ఉంది `తలదాచుకోవడానికి ఒంటెకు చోటిస్తే మొత్తం గుడారాన్ని లేపేసింది` అని అంటారు. ఇప్పుడు బీజేపీ వ్యవహారం కూడా అలాగే ఉంది. ఒకప్పుడు తమతో పొత్తు పెట్టుకోవడానికి కూడా పార్టీలు సహకరించని పరిస్థితి బీహార్‌లో బీజేపీకి కనిపించింది. ఎందుకంటే బీహార్ అనేది అనేక సామాజిక వర్గాల సమాహారంతో నిండిన రాష్ట్రం. ముఖ్యంగా బీసీలు, మైనారిటీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. బీహార్  మత చాంద్రసానికి, మతతత్వ పార్టీలకు అవకాశం ఇవ్వలేదు.

అటువంటి సమయంలో పొత్తులు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేని బిజెపి నెమ్మది నెమ్మదిగా విజృంభించి ఇప్పుడు ఏకంగా అధికారాన్ని దక్కించుకుంది. వాస్తవానికి గత ఎన్నికలకు- ఇప్పుడు అధికారం దక్కించుకోవడానికి ఈ మధ్య జరిగిన పరిణామాలను గమనిస్తే.. బీహార్ ప్రజలు నితీష్ కుమార్ ను చూసి ఓటేశారు అన్నది వాస్తవం. కానీ ఆరు మాసాలు కూడా తిరగకుండానే అదే నితీష్ కుమార్ ను రాజ్యసభకు పంపించి, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఈరోజు బిజెపి అవతరించింది.

దీనివల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉంటుంది అంటే రాజకీయంగా చూసుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీయు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇతర ప్రాంతీయ పార్టీలుగా ఉన్న ఆర్జెడి వంటివి కూడా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. బిజెపి విషయంలో ఇది కొత్త కాదు. గతంలో అస్సాంలోను ఇదే తరహా రాజకీయాలు కనిపించాయి. అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టిన బిజెపి ఆ పార్టీలను మచ్చిక‌ చేసుకుని నెమ్మది నెమ్మదిగా అధికారంలోకి వచ్చింది.

గడిచిన 10 సంవత్సరాల్లో ఆ పార్టీ అక్కడ అధికారంలో కొనసాగుతోంది. అయితే వాస్తవానికి తొలిసారి అస్సాంలో కూడా బిజెపిని చూసి ఎవరూ ఓటేయ‌లేదు. స్థానికంగా ఉన్న పార్టీ బోడోలాండ్ ను చూసి ఓటేశారు. ఆ పార్టీని నెమ్మదిగా బిజెపిలో విలీనం చేసుకుని అధికారం దక్కించుకుంది. ఇక్కడ మరో చిత్రమైన విషయం ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న విష‌యాన్ని పక్కన పెడితే రాష్ట్రాల్లో అధికారం చేపడుతున్న బిజెపి ఇరుగుపొరుగు పార్టీల నుంచి వచ్చిన వారిని ముఖ్యమంత్రులు చేయటం ఆసక్తికర విషయం.

ఉదాహరణకు అస్సాంలో సీఎంగా ఉన్న హిమంత విశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆయన్ని చూసే అక్కడ బిజెపి డెవలప్ అయింది. ఇక ఈయనకు ఆర్ఎస్ఎస్ మూలాలు కూడా ఏమీ లేదు. బిజెపి నుంచి వచ్చారు కాబట్టి సహజంగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉంటాయని అనుకుంటారు. కానీ హిమంత‌కు ఆర్ఎస్ఎస్ మూలాలు ఏమీ లేవు. అదే విధంగా ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సామ్రాట్ చౌదరికి కూడా ఎటువంటి ఆర్ఎస్ఎస్ మూలాలు లేవు.

పైగా ఈయన కూడా ఆర్జెడి సహా జెడియుల నుంచి వచ్చిన నాయకుడు. ఈ రెండు పార్టీలు మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు కావడం విశేషం. అదేవిధంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బిజెపి కనుక విజయం దక్కించుకుంటే అక్కడ కూడా కాంగ్రెస్ అనంతరం తృణ‌మూల్‌ కాంగ్రెస్ లో చేరి.. తర్వాత బిజెపిలోకి వచ్చిన సుభేందు అధికారిని ముఖ్యమంత్రిగా చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా బిజెపిని గమనిస్తే ప్రాంతీయ పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.

Kumar

Recent Posts

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

54 minutes ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

1 hour ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

1 hour ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

2 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

2 hours ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

2 hours ago