వైసీపీలో తొలిసారి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు ఏమవుతుందంటూ.. పెద్ద ఎత్తున ఆరా తీయడం గమనార్హం. తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. ప్రత్యేకంగా ఒకరిద్దరు నాయకులు హైదరాబాద్కు వెళ్లి మరీ ఈ కేసు విచారణ సమయంలో కోర్టుకు హాజరయ్యారని తెలిసింది. వివేకా కేసు ఏమవుతుంది? మళ్లీ మొదటికి వస్తుందా? అనే విషయాలపై పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు ఆరాతీసినట్టు తెలిసింది. కోర్టు విచారణను కూడా లైవ్లో తెలుసుకున్నట్టు సమాచారం.
విషయం ఏంటి?
2019 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డిని ఆయన నివాసంలోనే దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ.. దీనిపై దర్యాప్తు ముగిసినట్టు.. తెలంగాణ హైకోర్టుకు తేల్చి చెప్పింది. అయితే.. ఈ కేసులో తనకు ఇంకా అనుమానాలు ఉన్నాయని.. నాటి నిందితుల్లో కొందరిని సీబీఐ అసలు విచారించలేదని పేర్కొంటూ.. వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని గత నెలలోనే విచారించిన సుప్రీంకోర్టు.. సీబీఐ వాదనలతో ఏకీభవించింది. విచారణ జరిపేందుకు ఏమీ లేదని.. అన్ని కోణాల్లోనూ విచారించామని సీబీఐ చెబుతోందని వ్యాఖ్యానించింది.
అయినప్పటికీ.. పిటిషనర్ సునీత వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. మరోసారి ఈ విషయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ హైకోర్టును(ఈ కేసును విచారిస్తున్న న్యాయస్థానం) ఆదేశించింది. దీంతో సోమవారం ఈ కేసు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది.
సీబీఐ మాత్రం గత వాదనలే వినిపించింది. సునీత కోరినట్టుగా అన్ని కోణాల్లోనూ విచారించామని పేర్కొంది. విచారించేందుకు ఇక, అవకాశం కూడా లేదనిస్పష్టం చేసింది. అయినప్పటికీ.. మరోసారి దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇస్తామని కోర్టుకు విన్నవించింది. దీంతో కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు సీబీఐకి అవకాశం ఇచ్చింది.
సునీత వాదనేంటి?
వివేకా కుమార్తె.. సునీత వాదన వేరేగా ఉంది. అన్ని కోణాల్లోనూ విచారణ చేశామని సీబీఐ చెబుతున్నా.. నాడు.. వివేకా గుండెపోటుతో మృతి చెందారంటూ.. జగన్, భారతిలకు ఫోన్లు చేసిన వారిని.. ఈ సందేశాలను పంపించిన వారిని విచారించాలని పట్టుబడుతున్నారు.
అయితే.. వారిని ఇప్పటికే విచారించామని.. దీనిలో వారి పాత్ర ఏమీలేదని కేవలం సమాచారం మాత్రమే పంచుకున్నారని సీబీఐ వివరించింది. వీరిని అరెస్టు చేయాల్సినంత నేరం కూడా చేయలేదని స్పష్టం చేసింది. కానీ, సునీత మాత్రం వివేకా హత్య కేసును మరోసారి విచారించాలని పట్టుబడుతున్నారు. దీంతో కోర్టు కనుక ఆమేరకు ఆదేశాలు ఇస్తే.. విచారణ మళ్లీ జరిగే అవకాశం ఉంది. ఇదే విషయంపై వైసీపీ ఉత్కంఠకు గురైంది.
This post was last modified on April 14, 2026 2:03 pm
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టడని పెద్దలు చెప్పే మాట నిజమని మరోసారి రుజువయ్యింది. కైలాస మానస సరోవర యాత్ర కోసం…
ఇరుముడి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడం అభిమానులకే కాదు రవితేజకు కూడా ఎక్కడ లేని హుషారు తీసుకొచ్చింది. హిట్…
మొన్నటిదాకా హాయ్ నాన్న, జెర్సీ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా టార్గెట్ చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు పూర్తిగా…
ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారు. డబుల్ బెడ్ రూం లక్కీ డ్రా కార్యక్రమం నుంచి మధ్యలోనే…
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల ఇంకో ముప్పై రెండు రోజుల్లో…
గత మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ మంచి జోష్ మీద నడుస్తోంది. కనీసం రెండు వారాలకో మంచి సినిమా పడుతోంది.…