వైసీపీలో తొలిసారి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు ఏమవుతుందంటూ.. పెద్ద ఎత్తున ఆరా తీయడం గమనార్హం. తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. ప్రత్యేకంగా ఒకరిద్దరు నాయకులు హైదరాబాద్కు వెళ్లి మరీ ఈ కేసు విచారణ సమయంలో కోర్టుకు హాజరయ్యారని తెలిసింది. వివేకా కేసు ఏమవుతుంది? మళ్లీ మొదటికి వస్తుందా? అనే విషయాలపై పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు ఆరాతీసినట్టు తెలిసింది. కోర్టు విచారణను కూడా లైవ్లో తెలుసుకున్నట్టు సమాచారం.
విషయం ఏంటి?
2019 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డిని ఆయన నివాసంలోనే దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ.. దీనిపై దర్యాప్తు ముగిసినట్టు.. తెలంగాణ హైకోర్టుకు తేల్చి చెప్పింది. అయితే.. ఈ కేసులో తనకు ఇంకా అనుమానాలు ఉన్నాయని.. నాటి నిందితుల్లో కొందరిని సీబీఐ అసలు విచారించలేదని పేర్కొంటూ.. వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని గత నెలలోనే విచారించిన సుప్రీంకోర్టు.. సీబీఐ వాదనలతో ఏకీభవించింది. విచారణ జరిపేందుకు ఏమీ లేదని.. అన్ని కోణాల్లోనూ విచారించామని సీబీఐ చెబుతోందని వ్యాఖ్యానించింది.
అయినప్పటికీ.. పిటిషనర్ సునీత వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. మరోసారి ఈ విషయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ హైకోర్టును(ఈ కేసును విచారిస్తున్న న్యాయస్థానం) ఆదేశించింది. దీంతో సోమవారం ఈ కేసు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది.
సీబీఐ మాత్రం గత వాదనలే వినిపించింది. సునీత కోరినట్టుగా అన్ని కోణాల్లోనూ విచారించామని పేర్కొంది. విచారించేందుకు ఇక, అవకాశం కూడా లేదనిస్పష్టం చేసింది. అయినప్పటికీ.. మరోసారి దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇస్తామని కోర్టుకు విన్నవించింది. దీంతో కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు సీబీఐకి అవకాశం ఇచ్చింది.
సునీత వాదనేంటి?
వివేకా కుమార్తె.. సునీత వాదన వేరేగా ఉంది. అన్ని కోణాల్లోనూ విచారణ చేశామని సీబీఐ చెబుతున్నా.. నాడు.. వివేకా గుండెపోటుతో మృతి చెందారంటూ.. జగన్, భారతిలకు ఫోన్లు చేసిన వారిని.. ఈ సందేశాలను పంపించిన వారిని విచారించాలని పట్టుబడుతున్నారు.
అయితే.. వారిని ఇప్పటికే విచారించామని.. దీనిలో వారి పాత్ర ఏమీలేదని కేవలం సమాచారం మాత్రమే పంచుకున్నారని సీబీఐ వివరించింది. వీరిని అరెస్టు చేయాల్సినంత నేరం కూడా చేయలేదని స్పష్టం చేసింది. కానీ, సునీత మాత్రం వివేకా హత్య కేసును మరోసారి విచారించాలని పట్టుబడుతున్నారు. దీంతో కోర్టు కనుక ఆమేరకు ఆదేశాలు ఇస్తే.. విచారణ మళ్లీ జరిగే అవకాశం ఉంది. ఇదే విషయంపై వైసీపీ ఉత్కంఠకు గురైంది.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…