తన మంత్రి వర్గంలోని సభ్యుల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తరచుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారు తమ పనులను సరిగా నిర్వహించడం లేదని.. పనితీరును మెరుగు పరుచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. అయితే.. ఇదంతా కూడా.. పాలనలో సహజమే కాబట్టి అందరూ వింటున్నారు. కొందరు సరిచేసుకుంటున్నారు. మరికొందరు లైట్ తీసుకుంటున్నారు. అయితే.. పాలనకు సంబంధించిన అంశాలు.. ముఖ్యంగా మంత్రి వర్గ సమావేశాలకు ముందు.. అజెండా అంశాలను లీక్ చేస్తున్నవారిపై చంద్రబాబు తాజాగా సీరియస్ అయ్యారు.
ముఖ్యంగా ప్రత్యర్థి వర్గానికి చెందిన మీడియాకు మంత్రి వర్గ అజెండా అంశాలు ముందుగానే తెలిసి పోవడంపై చంద్రబాబు తల పట్టుకుంటున్నారు. గత రెండు మూడు సందర్భాల్లో మంత్రి వర్గ సమావేశానికి ముందే… ప్రత్యర్థి వర్గానికిచెందిన మీడియాలో ఆయా అంశాలపై చర్చ పెట్టారు. మంత్రివర్గం ఆ కంపెనీకి భూములు ఇస్తోందని.. ఈ కంపెనీలకు రాయితీలు ఇస్తోందని బయటకు వచ్చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై కూపీ లాగిన చంద్రబాబు పైకి పేర్లు చెప్పకుండానే.. మంత్రులకు తాజాగా నోట్ పంపారు. లీకులు చేయడం తగదని చెప్పారు. అంతేకాదు.. ఇకపై ఉపేక్షించేది కూడా లేదన్నారు.
ఈ సందర్భంగా గతంలో సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన ఘటనను ఆయన ప్రస్తావించారు. వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి ముందే దీనిలోని కీలక విషయాలను కొందరు మంత్రులు బయటకు ప్రచారం చేశారు. వాస్తవానికి ఇప్పుడున్నంత సోషల్ మీడియా, యూట్యూబ్వంటివి అప్పట్లో లేవు.
అయినప్పటికీ.. అప్పటి సీఎం ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు. మంత్రివర్గం మొత్తాన్నీ రద్దు చేశారు. ఈ ఘటనను ప్రస్తావించిన చంద్రబాబు తాను కూడా ఇకపై ఇలానే చేయాలా? అని ప్రశ్నించారు. మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒక విధానంప్రకారం సంబంధిత మంత్రి వాటిని మీడియాకు చెప్పాలని ఆదేశించారు.
This post was last modified on April 14, 2026 8:54 am
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…