తన మంత్రి వర్గంలోని సభ్యుల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తరచుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారు తమ పనులను సరిగా నిర్వహించడం లేదని.. పనితీరును మెరుగు పరుచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. అయితే.. ఇదంతా కూడా.. పాలనలో సహజమే కాబట్టి అందరూ వింటున్నారు. కొందరు సరిచేసుకుంటున్నారు. మరికొందరు లైట్ తీసుకుంటున్నారు. అయితే.. పాలనకు సంబంధించిన అంశాలు.. ముఖ్యంగా మంత్రి వర్గ సమావేశాలకు ముందు.. అజెండా అంశాలను లీక్ చేస్తున్నవారిపై చంద్రబాబు తాజాగా సీరియస్ అయ్యారు.
ముఖ్యంగా ప్రత్యర్థి వర్గానికి చెందిన మీడియాకు మంత్రి వర్గ అజెండా అంశాలు ముందుగానే తెలిసి పోవడంపై చంద్రబాబు తల పట్టుకుంటున్నారు. గత రెండు మూడు సందర్భాల్లో మంత్రి వర్గ సమావేశానికి ముందే… ప్రత్యర్థి వర్గానికిచెందిన మీడియాలో ఆయా అంశాలపై చర్చ పెట్టారు. మంత్రివర్గం ఆ కంపెనీకి భూములు ఇస్తోందని.. ఈ కంపెనీలకు రాయితీలు ఇస్తోందని బయటకు వచ్చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై కూపీ లాగిన చంద్రబాబు పైకి పేర్లు చెప్పకుండానే.. మంత్రులకు తాజాగా నోట్ పంపారు. లీకులు చేయడం తగదని చెప్పారు. అంతేకాదు.. ఇకపై ఉపేక్షించేది కూడా లేదన్నారు.
ఈ సందర్భంగా గతంలో సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన ఘటనను ఆయన ప్రస్తావించారు. వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి ముందే దీనిలోని కీలక విషయాలను కొందరు మంత్రులు బయటకు ప్రచారం చేశారు. వాస్తవానికి ఇప్పుడున్నంత సోషల్ మీడియా, యూట్యూబ్వంటివి అప్పట్లో లేవు.
అయినప్పటికీ.. అప్పటి సీఎం ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు. మంత్రివర్గం మొత్తాన్నీ రద్దు చేశారు. ఈ ఘటనను ప్రస్తావించిన చంద్రబాబు తాను కూడా ఇకపై ఇలానే చేయాలా? అని ప్రశ్నించారు. మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒక విధానంప్రకారం సంబంధిత మంత్రి వాటిని మీడియాకు చెప్పాలని ఆదేశించారు.
This post was last modified on April 14, 2026 8:54 am
తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు…
మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…