తన మంత్రి వర్గంలోని సభ్యుల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తరచుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారు తమ పనులను సరిగా నిర్వహించడం లేదని.. పనితీరును మెరుగు పరుచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. అయితే.. ఇదంతా కూడా.. పాలనలో సహజమే కాబట్టి అందరూ వింటున్నారు. కొందరు సరిచేసుకుంటున్నారు. మరికొందరు లైట్ తీసుకుంటున్నారు. అయితే.. పాలనకు సంబంధించిన అంశాలు.. ముఖ్యంగా మంత్రి వర్గ సమావేశాలకు ముందు.. అజెండా అంశాలను లీక్ చేస్తున్నవారిపై చంద్రబాబు తాజాగా సీరియస్ అయ్యారు.
ముఖ్యంగా ప్రత్యర్థి వర్గానికి చెందిన మీడియాకు మంత్రి వర్గ అజెండా అంశాలు ముందుగానే తెలిసి పోవడంపై చంద్రబాబు తల పట్టుకుంటున్నారు. గత రెండు మూడు సందర్భాల్లో మంత్రి వర్గ సమావేశానికి ముందే… ప్రత్యర్థి వర్గానికిచెందిన మీడియాలో ఆయా అంశాలపై చర్చ పెట్టారు. మంత్రివర్గం ఆ కంపెనీకి భూములు ఇస్తోందని.. ఈ కంపెనీలకు రాయితీలు ఇస్తోందని బయటకు వచ్చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై కూపీ లాగిన చంద్రబాబు పైకి పేర్లు చెప్పకుండానే.. మంత్రులకు తాజాగా నోట్ పంపారు. లీకులు చేయడం తగదని చెప్పారు. అంతేకాదు.. ఇకపై ఉపేక్షించేది కూడా లేదన్నారు.
ఈ సందర్భంగా గతంలో సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన ఘటనను ఆయన ప్రస్తావించారు. వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి ముందే దీనిలోని కీలక విషయాలను కొందరు మంత్రులు బయటకు ప్రచారం చేశారు. వాస్తవానికి ఇప్పుడున్నంత సోషల్ మీడియా, యూట్యూబ్వంటివి అప్పట్లో లేవు.
అయినప్పటికీ.. అప్పటి సీఎం ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు. మంత్రివర్గం మొత్తాన్నీ రద్దు చేశారు. ఈ ఘటనను ప్రస్తావించిన చంద్రబాబు తాను కూడా ఇకపై ఇలానే చేయాలా? అని ప్రశ్నించారు. మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒక విధానంప్రకారం సంబంధిత మంత్రి వాటిని మీడియాకు చెప్పాలని ఆదేశించారు.
This post was last modified on April 14, 2026 8:54 am
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…