Political News

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి… తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చుకుంది. అయితే ఈ పరిణామం ఆ పార్టీకి తీరని నష్టం చేసిందనే చెప్పాలి. అసలు పార్టీ పేరులోని తెలంగాణ పదాన్ని తొలగిస్తున్న తీరును ఆ పార్టీ కేడర్ ఓ రేంజిలో వ్యతిరేకించినా పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదు. పార్టీ పేరు మారిన తర్వాత జరిగిన 2023 ఎన్నికల్లో పార్టీ పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. ఈ విషయాన్ని గ్రహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తాజాగా పాత పేరునే కొనసాగించే దిశగా చర్యలు చేపడతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనసులో చాలా కాలంగా దాగి ఉన్న విషయాలను ఆయన ఈ సందర్భంగా బయటకు వెల్లడించారు. టీఆర్ఎస్ పేరును వదిలి దాని స్థానంలో బీఆర్ఎస్ పేరును పెట్టిన వైనం తమకు తీరని నష్టం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారిన తర్వాత పార్టీ నష్టపోయిందని, ఎన్నికల్లో ఓడిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. జరిగిన పొరపాటును సరిదిద్దే క్రమంలో భాగంగా తిరిగి పార్టీకి టీఆర్ఎస్ ను కొనసాగించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ కు తెలియజేసి…ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటామని కేటీఆర్ తెలిపారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని కేటీఆర్ వెల్లడించారు. బీజేపీతో అయితే అసలే పొత్తు అన్న మాటే ఉండదని ఆయన అన్నారు. పార్టీకి, కేడర్ కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపడతామని, అందులో భాగంగా తాను 2027లో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీతో కేడర్ కు ఏర్పడ్డ గ్యాప్ వల్లే ఓడిపోయామని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి అయినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ అన్నారు.

మీడియా మీట్ లో భాగంగా తన సోదరి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురించి కూడా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ ఆడపడచు కూడా తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టదన్న కేటీఆర్… తన కుటుంబాన్ని కవిత ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కవిత తన బాధ్యతను మరిచి తమ కుటుంబాన్ని ఏడిపిస్తున్నారని వ్యాఖ్యానించిన కేటీఆర్… ఇకనైనా కవిత ఏడిపించవద్దని కోరారు.

This post was last modified on April 12, 2026 7:32 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

1 hour ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago