Political News

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి… తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చుకుంది. అయితే ఈ పరిణామం ఆ పార్టీకి తీరని నష్టం చేసిందనే చెప్పాలి. అసలు పార్టీ పేరులోని తెలంగాణ పదాన్ని తొలగిస్తున్న తీరును ఆ పార్టీ కేడర్ ఓ రేంజిలో వ్యతిరేకించినా పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదు. పార్టీ పేరు మారిన తర్వాత జరిగిన 2023 ఎన్నికల్లో పార్టీ పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. ఈ విషయాన్ని గ్రహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తాజాగా పాత పేరునే కొనసాగించే దిశగా చర్యలు చేపడతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనసులో చాలా కాలంగా దాగి ఉన్న విషయాలను ఆయన ఈ సందర్భంగా బయటకు వెల్లడించారు. టీఆర్ఎస్ పేరును వదిలి దాని స్థానంలో బీఆర్ఎస్ పేరును పెట్టిన వైనం తమకు తీరని నష్టం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారిన తర్వాత పార్టీ నష్టపోయిందని, ఎన్నికల్లో ఓడిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. జరిగిన పొరపాటును సరిదిద్దే క్రమంలో భాగంగా తిరిగి పార్టీకి టీఆర్ఎస్ ను కొనసాగించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ కు తెలియజేసి…ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటామని కేటీఆర్ తెలిపారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని కేటీఆర్ వెల్లడించారు. బీజేపీతో అయితే అసలే పొత్తు అన్న మాటే ఉండదని ఆయన అన్నారు. పార్టీకి, కేడర్ కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపడతామని, అందులో భాగంగా తాను 2027లో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీతో కేడర్ కు ఏర్పడ్డ గ్యాప్ వల్లే ఓడిపోయామని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి అయినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ అన్నారు.

మీడియా మీట్ లో భాగంగా తన సోదరి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురించి కూడా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ ఆడపడచు కూడా తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టదన్న కేటీఆర్… తన కుటుంబాన్ని కవిత ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కవిత తన బాధ్యతను మరిచి తమ కుటుంబాన్ని ఏడిపిస్తున్నారని వ్యాఖ్యానించిన కేటీఆర్… ఇకనైనా కవిత ఏడిపించవద్దని కోరారు.

This post was last modified on April 12, 2026 7:32 pm

Share

Recent Posts

మెలోడీ బ్రహ్మ మళ్ళీ రేసులోకి వచ్చినట్టే

ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…

26 minutes ago

సంచలనం: కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా!

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…

34 minutes ago

అఖిల్ కొడుకుతో సిసింద్రీ-2

‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…

53 minutes ago

మోడీకి క‌ళ్లు చెదిరేలా స్వాగ‌త ఏర్పాట్లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌రో వారంలో ఏపీకి రానున్నారు. ఆగ‌స్టు 1వ తేదీన ఆయ‌న విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురానికి…

60 minutes ago

రాళ్లను మెట్లుగా మార్చి.. అదే మోదీ ప్రత్యేకత..!

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ…

3 hours ago

స్టీవెన్ శంకర్ ప్రేమ బాగానే కనెక్టయ్యింది

తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీకి ఆశించిన ఓపెనింగ్ దక్కింది. టాక్ పరంగా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఒకసారి…

3 hours ago