సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ సెటర్లు గుప్పించారు. రాష్ట్రంలో ఫ్యూచర్ లేని పార్టీకి ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాంటి ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడుతున్నారట అని ఎద్దేవా చేశారు. దీనికిగాను 16 వేల ఎకరాలను సేకరించి తన వారికి పంపిణీ చేయాలని భావిస్తున్నారంటూ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు, తన అనుకూల పెట్టుబడిదారుల కోసం పేదల భూములను లాక్కుంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతారని దుయ్యబట్టారు.
అక్రమాలకు కేరాఫ్
రేవంత్ రెడ్డి పాలన అక్రమాలకు కేరాఫ్గా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని విభాగాల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ శాఖలు అవినీతిమయంగా మారాయని విమర్శించారు. గత నెల రోజుల్లోనే నలుగురు తహసీల్దార్లు అవినీతిలో చిక్కుకున్నారని, పోలీసులు కూడా ఇదే దారిలో ఉన్నారని అన్నారు. వీరంతా పైకి సంచులు మోసేందుకు బలి అవుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నెలకు నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పిన కేటీఆర్, ఆయన అలా ఎందుకు వెళ్తున్నారో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు.
శాశ్వతం కాదు
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కానీ గతంలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్, అధికారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని వ్యాఖ్యానించిన విషయం ఈ సందర్భంలో ప్రస్తావనార్హం. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా పాలన చేస్తున్న రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సిటీలో దోమల బెడద
హైదరాబాద్ నగరంలో సాయంత్రం 5 గంటలు అయితే దోమలు కుట్టికుట్టి ఇబ్బంది పెడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. దోమలను కూడా నియంత్రించలేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతానంటూ పేదల భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల ఆక్రమణలు, దందాలకు తెరతీశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఫార్మా సిటీ భూములను రైతులకు తిరిగి ఇస్తామని చెప్పి ఇప్పుడు అవే భూములను వాడుకుంటున్నారని అన్నారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్రలు చేసిన వారు సీతక్క, భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు.
This post was last modified on April 11, 2026 9:49 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…