విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలకు సంబంధించి తాజాగా హైకోర్టు పూర్తి స్పష్టత ఇచ్చింది. ధార్మిక పరిషత్.. శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాల్ని దేవాదాయ శాఖ కూడా సర్క్యులర్ జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగిందంటే..
ఫారిన్ ట్రిప్ లకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు చేయకూడదన్న మార్గదర్శకాల్ని ధార్మిక పరిషత్, శృంగేరి శారదా పీఠం జారీ చేయగా.. దీనికి దేవాదాయ శాఖ అమలుకు ఓకే చెప్పింది. ఇదే అంశాన్ని ఏపీ హైకోర్టు కూడా బలపర్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. ఈ మార్గదర్శకాల్ని అమలు చేయటం లేదని పేర్కొంటూ విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయదారు సుబ్రహ్మణ్యం సోమయాజి కేసు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఏపీ హైకోర్టులో జరిగిన వాదనల్లో పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. విదేశీ ప్రయాణాలు చేసిన అర్చకులను నిబంధనలకు విరుద్ధంగా దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అమనుతి ఇస్తున్నారని పేర్కొన్నారు. ధార్మిక పరిషత్.. శృంగేరి శారదా పీఠం ప్రామాణిక ప్రకారం అర్చకులకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఒకవేళ ఎవరైనా వెళ్లాల్సిందేనని పట్టుబడితే అనుమతి ఇవ్వొచ్చని.. కాకుంటే వారు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆలయంలోని గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు చేసే అవకాశం ఉండదు. ఆలయం బయట జరిగే పూజలు.. వ్రతాలకు అనుమతి ఉంటుంది.
విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయానికి విరుద్ధంగా ముఖ క్షవరం.. జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలో పూజలు చేసేందుకు వీల్లేదని ప్రామాణిక చెబుతుందని పేర్కొన్నారు. దీనిపై దేవాదాయశాఖ తరపు న్యాయవాది స్పందిస్తూ.. సర్క్యులర్ ను.. ప్రామాణికలను ఫాలో అవుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు సైతం ఈ వాదనకు ఓకే చెప్పి.. నిబంధనల్ని అమలు చేయాలని పేర్కొంది.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…