విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలకు సంబంధించి తాజాగా హైకోర్టు పూర్తి స్పష్టత ఇచ్చింది. ధార్మిక పరిషత్.. శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాల్ని దేవాదాయ శాఖ కూడా సర్క్యులర్ జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగిందంటే..
ఫారిన్ ట్రిప్ లకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు చేయకూడదన్న మార్గదర్శకాల్ని ధార్మిక పరిషత్, శృంగేరి శారదా పీఠం జారీ చేయగా.. దీనికి దేవాదాయ శాఖ అమలుకు ఓకే చెప్పింది. ఇదే అంశాన్ని ఏపీ హైకోర్టు కూడా బలపర్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. ఈ మార్గదర్శకాల్ని అమలు చేయటం లేదని పేర్కొంటూ విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయదారు సుబ్రహ్మణ్యం సోమయాజి కేసు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఏపీ హైకోర్టులో జరిగిన వాదనల్లో పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. విదేశీ ప్రయాణాలు చేసిన అర్చకులను నిబంధనలకు విరుద్ధంగా దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అమనుతి ఇస్తున్నారని పేర్కొన్నారు. ధార్మిక పరిషత్.. శృంగేరి శారదా పీఠం ప్రామాణిక ప్రకారం అర్చకులకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఒకవేళ ఎవరైనా వెళ్లాల్సిందేనని పట్టుబడితే అనుమతి ఇవ్వొచ్చని.. కాకుంటే వారు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆలయంలోని గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు చేసే అవకాశం ఉండదు. ఆలయం బయట జరిగే పూజలు.. వ్రతాలకు అనుమతి ఉంటుంది.
విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయానికి విరుద్ధంగా ముఖ క్షవరం.. జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలో పూజలు చేసేందుకు వీల్లేదని ప్రామాణిక చెబుతుందని పేర్కొన్నారు. దీనిపై దేవాదాయశాఖ తరపు న్యాయవాది స్పందిస్తూ.. సర్క్యులర్ ను.. ప్రామాణికలను ఫాలో అవుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు సైతం ఈ వాదనకు ఓకే చెప్పి.. నిబంధనల్ని అమలు చేయాలని పేర్కొంది.
This post was last modified on April 5, 2026 11:38 am
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…