Political News

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే.. ముందుండాలి. వాటిని వినియోగించుకోవాలి. ఈ విష‌యంలో వైసీపీ త‌న‌కు ద‌క్కిన పెద్ద అవ‌కాశాన్ని చేజార్చుకుంద‌నే అభిప్రాయం గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు వినిపిస్తోంది. ప్ర‌ధానంగా మూడు విష‌యాల్లో వైసీపీ ఈ అవ‌కాశాన్ని వ‌దులుకున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

1) మూడు రాజ‌ధానులు: మూడు రాజ‌ధానులు అనే ఫార్ములా జ‌గ‌న్ తెర‌మీదికి తెచ్చిన‌ప్పుడే.. ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. విశాఖ‌ను ప్ర‌ధాన రాజ‌ధానిని చేస్తామ‌ని అన్న‌ప్పుడు.. అక్క‌డివారు వ్య‌తిరేకించారు. దీనికితోడు.. అమ‌రావ‌తి రైతుల త్యాగం.. ప్ర‌జ‌లను తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. వారిని అణిచేసిన తీరును రాష్ట్ర ప్ర‌జ‌లు మౌనంగా గ‌మ‌నించి.. ఎన్నిక‌ల వేళ బ‌లంగా తీర్పు ఇచ్చారు. అంటే.. ప్ర‌జ‌లు అమ‌రావ‌తికే క‌ట్టుబ‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా అమ‌రావ‌తి బిల్లు వ‌చ్చిన‌ప్పుడు.. జ‌గ‌న్‌..  మౌనంగా త‌న మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను ర‌ద్దు చేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించి ఉంటే.. ఇమేజ్ పెరిగేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. కానీ..మావిగ‌న్ అనే కొత్త ప్ర‌తిపాద‌న‌.. ఎవ‌రికీ అంతుచిక్క‌ని ప్ర‌తిపాద‌న చేసి.. మ‌రింత ట్రోల్ అవుతున్నార‌ని  అంటున్నారు. కానీ.. జ‌గ‌న్ వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకుని.. కొత్త స‌మ‌స్య‌లు.. తెచ్చుకున్నారు.

2) లోక్‌స‌భ‌: లోక్‌స‌భ‌లో వైసీపీకి న‌లుగురు ఎంపీలు మాత్ర‌మే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. స్పీక‌ర్ వీరికి 20 నిమిషాల స‌మ‌యం ఇచ్చారు. కానీ, కేవ‌లం 5 నిమిషాల‌లోనే ఎంపీ మిథున్ రెడ్డి త‌న ప్ర‌సంగాన్ని ముగించి.. వాకౌట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రాజ‌ధాని అమ‌రావ‌తికి వ్య‌తిరేకం కాదంటూనే స‌భ‌లో నుంచి బ‌య‌ట‌కు రావ‌డం పెద్ద త‌ప్పుగా ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇచ్చిన స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుని.. త‌మ వాద‌న వినిపించేందుకు ప్ర‌య‌త్నించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.

3) రాజ్య‌స‌భ‌: ఇక్క‌డ స‌భ్యులు ఎక్కువ‌.. స‌మ‌యం త‌క్కువ అన్న‌ట్టుగా వైసీపీ ప‌రిస్థితి మారిపోయింది. కేవ‌లం 5 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ఇవ్వ‌డాన్ని త‌ప్పుబ‌ట్టి వైసీపీ స‌భ్యులు స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. కానీ.. వాస్త‌వానికి ఆ 5 నిమిషాల్లోనే వైసీపీ స‌భ్యులు మాట్లాడి.. త‌మ వాద‌న‌ను వినిపించే అవ‌కాశం స‌ద్వినియోగం చేసుకుని ఉంటే.. ఆ ప‌రిస్థితి వేరేగా ఉండేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఏదేమైనా.. వైసీపీ చ‌క్క‌ని అవ‌కాశాన్ని చేజార్చుకుంద‌ని అంటున్నారు.

This post was last modified on April 3, 2026 9:31 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

40 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

55 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

55 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago