Political News

‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి లేకపోతే). అయితే ఆ రెండు ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న విషయంపై వైసీపీ నేతలకు ఓ స్పష్టమైన అవగాహన అయితే ఉన్నట్టుంది. ఎందుకంటే… ఏపీలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావులు మరోమారు సీఎంలుగా కొలువుదీరతారన్న అర్థం వచ్చేలా వైసీపీ నేతలు చెబుతున్నారు.

తాము వచ్చాక ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నేతలతో పాటు వారికి వంత పాడుతున్న నేతలకు చుక్కలు చూపిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని ఆరో వార్డులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని ఇళ్లను గురువారం మునిసిపల్ అధికారులు కూల్చేశారు. ఈ విషయం తెలుసుకున్న నాని… హుటాహుటీన అక్కడకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాల్ రావుల పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు. ఇళ్లను కూలిస్తే పేదల పరిస్థితి ఎలా ఉంటుందో సరిగ్గా అలాంటి పరిస్థితినే బాపిరాజు, గోపాల్ రావులకు చూపిస్తానని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

బాపిరాజు కులాన్నికూడా ప్రస్తావించిన నాని… ఆయనను సీఎం నారా చంద్రబాబునాయుడి బంధువుగా అభివర్ణించారు. 2029 ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బాపిరాజును తిరిగి మచిలీపట్నానికి రప్పించి పేదల బాధ ఎలా ఉంటుందో తెలియజేస్తానని అన్నారు.

ఇక గోపాల్ రావు పేరును మరింతగా బిగ్గరగా ప్రస్తావించిన నాని… తాము అధికారంలోకి వచ్చాక… గోపాల్ రావు ఎక్కడున్నా.. మచిలీపట్నానికి పోస్టింగ్ ఇప్పించి గోపాల్ రావు ఇంటి కథ తేలుస్తామని హెచ్చరించారు. ఒకవేళ గోపాల్ రావు తెలంగాణకు పారిపోయినా…కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా గోపాల్ రావును మచిలీపట్నానికి తీసుకువస్తానని నాని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా నాని చేసిన వ్యాఖ్యలు… ఆయన నోట నుంచి వచ్చిన 2029 ఎన్నికలు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 2029 ఎన్నికల్లో వైసీపీ తప్పనిసరిగా విజయం సాధిస్తుందన్న భావన వినిపించేలా నాని కామెంట్ చేశారు. అదే సమయంలో కేసీఆర్ పేరును ప్రస్తావించిన నాని… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజంయ సాధించడం ఖాయమన్నట్లుగా ఆయన పేర్కొనడం గమనార్హం. మొత్తంగా ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ లు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపడతారని నాని ఆసక్తికర కామెంట్లు చేశారు.

This post was last modified on April 2, 2026 8:52 pm

Share

Recent Posts

ప్రభాస్‌తో డీపీ మార్పించారుగా…

ప్రభాస్ సోషల్ మీడియాలో కనిపించేదే చాలా తక్కువ. ఇక అందులోనూ చాలా అరుదుగా పర్సనల్ ప్రొఫైల్ మార్పులు కనిపిస్తుంటాయి. దాదాపు…

42 minutes ago

ముహూర్తం కోసం మారుతి వెయిటింగ్

టాలీవుడ్ సినిమాల ప్లానింగ్ ఎలా ఉందంటే ఒక ఏడాది ముందే సంక్రాంతి రిలీజులకు సిద్ధమయ్యేంత. ఈ విషయంలో అనిల్ రావిపూడి…

3 hours ago

జార్జ్ క్రిష్… ఒక ప్లానింగ్ ఒక పద్దతి

2027 సంక్రాంతికి వస్తాయని చాలా సినిమాల లిస్టుగా బయటికి కనిపిస్తోంది కానీ డేట్ తో సహా వేసినవాళ్లు ఎవరూ లేకపోగా…

5 hours ago

పెన‌మ‌లూరులో బోడేదే పైచేయి…!

పార్టీ ఒక‌టే కానీ.. అంత‌ర్గ‌త కూట‌ములు చాలానే ఉన్నాయి. ఆ నియోజ‌క‌వ‌ర్గం స్పెష‌ల్ అదే. ఇత‌ర నియోజ‌క వ‌ర్గాల్లోనూ నాయ‌కుల…

5 hours ago

వెనుకాడొద్దు… వెంటాడండి: మంత్రుల‌కు బాబు హుకుం!

వైసీపీ చేస్తున్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక రాజ‌కీయాల‌ను మంత్రులు అస్సలు ఉపేక్షించ‌వ‌ద్ద‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఎక్క‌డా వెనుకాడ‌వ‌ద్ద‌ని ఆయ‌న…

10 hours ago

న్యూయార్క్ టైమ్స్ లో చంద్రబాబు విజన్

అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, అమరావతి నిర్మాణం గురించి వచ్చిన కథనం…

10 hours ago