రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. పార్టీ పేర్లు వేర్వేరుగా ఉన్నా.. రాజకీయ పార్టీల డీఎన్ ఏ మాత్రం ఒకేలా ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసింది ఆమ్ ఆద్మీ. దేశంలోని రాజకీయ పార్టీలకు భిన్నంగా.. రాజకీయాల కంటే కూడా ప్రజల కోసం పోరాటం చేయటమే లక్ష్యమని చెప్పే పార్టీ.. మిగిలిన పార్టీల మాదిరే తన పార్టీకి చెందిన ఎంపీకి షాకిచ్చింది. ఇంతకూ ఆ ఎంపీ ఎవరో కాదు రాఘవ్ చద్దా.
సామాన్యుడు.. సగటు జీవి నిత్యం ఎదుర్కొనే ఎన్నో సమస్యల మీదా.. రోజువారీ జీవనంలో పలు విషయాల్లో దోపిడీకి గురయ్యే అంశాల్ని తనదైన శైలిలో ప్రశ్నిస్తూ.. అందరిని ఆకర్షించే ఆయనకు ఆమ్ఆద్మీ పార్టీ షాకిచ్చింది. రాజ్యసభలో ఉప నాయకుడిగా వ్యవహరిస్తున్న ఆయన్ను.. ఆ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
రాఘవ్ చద్దా విషయానికి వస్తే.. సెల్ ఫోన్ రీఛార్జి విషయంలో ప్రైవేటు టెలికం కంపెనీల దోపిడీపైనా.. మొబైల్ డేటా వినియోగంపైనా.. విమాన సమయపాలన మీదా.. మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యల మీదా.. మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేసే బ్యాంకుల తీరుపైనా.. ఇలా ఎన్నో అంశాలపై గళం విప్పటం ద్వారా ఆయన ప్రజల్లో పాపులార్టీని సొంతం చేసుకున్నారు.
ఆయన ప్రశ్నలు.. లేవనెత్తే అంశాలు తరచూ సోషల్ మీడియాలో చర్చకు తెర తీస్తుంటాయి. అలాంటి ఆయన్ను రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడి పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ ను నియమిస్తూ రాజ్యసభ సచివాలయానికి అధికారిక సమాచారాన్ని పంపిన విషయాన్ని ఆమ్ ఆద్మీ వర్గాలు వెల్లడించాయి. ఎందుకిలా? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వస్తోంది. పార్టీ అధినాయకత్వం గురించి.. అధినేతల గురించి మాట్లడని రాఘవ్ చద్దా తీరుపై గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించినా రాఘవ్ చద్దా నుంచి స్పందన లేకపోవటాన్నితీవ్రంగా పరిగణించినట్లు చెబుతున్నారు. కనీసం సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్టులు పెట్టకపోవటం దేనికి నిదర్శనం? అని వాదన పార్టీలో బలంగా సాగినట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు పలు సందర్భాల్లో పార్టీ కీలక సమావేశాలకు గైర్హాజరు కావటం.. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేసినప్పుడు ఆలస్యంగా స్పందించటం లాంటి అంశాల నేపథ్యంలో ఆయనకు.. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనాయకుడి పదవి నుంచి తీసేసినట్లుగా తెలుస్తోంది.
This post was last modified on April 2, 2026 10:32 pm
టాలీవుడ్ స్టార్ హీరో ఎవరైనా సరే ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమనేది కలగా మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్ చేసి…
ఇటీవల వరుస వైట్బాల్ సిరీస్ ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ జట్టు, ఇప్పుడు జింబాబ్వే సవాలుకు సిద్ధమైంది.…
పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడింది. బయట అంచనాలు అందుకోలేకపోయినా టాలీవుడ్ బయ్యర్లు సేఫ్ అయ్యారు. తర్వాత మా ఇంటి…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా ఆయనే స్వయంగా చెప్పుకుంటూ వచ్చిన జన నాయకుడు అష్టకష్టాలు దాటుకుని ఎట్టకేలకు థియేటర్లలో…
ఐమాక్స్ లందు.. రియల్ ఐమాక్స్ వేరు అంటారు. ఈ ఫార్మాట్ మూడు రకాల రేషియాల్లో ఉంటుంది. అందులో 70 ఎంఎం…
దర్శకులు హీరోలు కావడం ఇండస్ట్రీకి కొత్త కాదు. కాకపోతే సక్సెస్ అయినవాళ్లు తక్కువ. ఉదాహరణకు ఎస్వి కృష్ణారెడ్డి మంచి పీక్స్…