ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్ పెడితే చాలు ట్రోలర్లు పండగ చేసుకుంటున్నారు. జగన్ నోటి నుంచి జాలువారే ఆణిముత్యాల కోసం వారంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే, వారిని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి టంగ్ స్లిప్ అయి దొరికిపోతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా నెటిజనులకు జగన్ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్రాలకు రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదని జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దేశాలకు మాత్రమే రాజధాని ఉంటుందని, ఆ విషయం రాజ్యాంగంలో రాసి ఉందని జగన్ సెలవిచ్చారు. కానీ, చంద్రబాబు మాత్రం ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత అంటూ డ్రామాలాడుతున్నారని జగన్ విమర్శించారు. దోపిడీ పాలనను కప్పిబుచ్చేందుకే చంద్రబాబు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాలకు రాజధాని అన్నది రాష్ట్రాలకు సంబంధించిన విషయం అని, అందులో కేంద్రం జోక్యం ఉండబోదని ఏపీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని జగన్ అన్నారు.
రాష్ట్ర రాజధానికి సంబంధించిన తీర్మానం అవసరం లేదని మంత్రి స్వయంగా అన్నారని జగన్ గుర్తు చేశారు. రాజధాని అమరావతి కోసం చట్టం చేస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారని, రేపు అదే చట్టసభలో చట్ట సవరణ చేయొచ్చని చంద్రబాబుకు తెలియదా అని జగన్ ప్రశ్నించారు. దీన్ని బట్టి అమరావతిని జగన్ ఇంకా వ్యతిరేకిస్తున్నారని స్వయంగా ఆయనే ఒప్పుకున్నట్లయింది.
అయితే, మరోసారి ఇలా సీఎం చంద్రబాబును విమర్శించబోయి జగన్ సెల్ఫ్ ‘ట్రోల్’ గోల్ వేసుకున్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు అన్న విషయం తెలిసిన జగన్ మూడు రాజధానులు అంటూ అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ఐదేళ్లపాటు డ్రామాలు ఎందుకు ఆడారని జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.
ఏపీ రాజధానిగా అమరావతిని జగన్ ఏనాడు వ్యతిరేకించలేదని సజ్జల రెండు రోజుల క్రితం చెప్పిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుందని, అక్కడ నుంచి పరిపాలన కొనసాగిస్తానని జగన్ ఎందుకు తన పాలనలో లీకులిచ్చారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
2014-19 మధ్యకాలంలో అమరావతి రాజధానికి అసెంబ్లీలో సైతం జగన్ మద్దతిచ్చారని, ఆ విషయం గజినీలా మరిచారని ట్రోల్ చేస్తున్నారు. ఇలా తన రాజకీయ అపరిపక్వతను జగన్ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
This post was last modified on April 1, 2026 2:29 pm
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…