Political News

జ‌న‌సేన‌కు క‌మ‌లం చెక్‌.. తిరుపతి ఉప ఎన్నిక‌కు బీజేపీ సిద్ధం!!

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ కానీ, ప్ర‌క‌ట‌న కానీ.. ఇంకా ప్ర‌క‌టించ‌క‌పోయినా.. బీజేపీ మాత్రం దూకుడుగా ముందుకు సాగుతోంది. వాస్త‌వానికి ఈ టికెట్‌ను బీజేపీ పొత్తు పార్టీ జ‌న‌సేన భారీ ఎత్తున డిమాండ్ చేస్తోంది. తెలంగాణ‌లోని గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో తాము పోటీకి దూరంగా ఉండి.. బీజేపీకి స‌హ‌క‌రించాం క‌నుక ఈ టికెట్‌ను త‌మ‌కు ఇవ్వాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప‌ట్టుబ‌డుతున్నారు. దీనికి సంబంధించి క‌మిటీ వేయాల‌ని ఆయ‌న ప్ర‌తిపాదించారు. ఈ ప్ర‌తిపాద‌న ఎలా ఉందో తెలియదు కానీ.. బీజేపీ మాత్రం దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఇప్ప‌టికే బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు.. జ‌న‌సేన మ‌ద్ద‌తుతో ఇక్క‌డ నుంచి బీజేపీ అభ్య‌ర్థి పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించేశారు. అయితే, ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన నేత‌లు ఫైర‌య్యారు. క‌మిటీ ఇంకాఏమీ తేల్చ‌కుండానే ఎలా నిర్ణ‌యిస్తార‌ని అన్నారు. కానీ, మ‌రోప‌క్క బీజేపీ నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను గ‌మ‌నిస్తే.. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థే పోటీ చేస్తున్న సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. గురువారం బీజేపీ నేత‌లు తిరుప‌తి ప‌ట్ట‌ణంలో పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించ‌డంతో ఈ సంకేతాల‌కు మ‌రింత బ‌లం చేకూరింది.

విష‌యాన్ని స్వ‌యంగా ఏపీ బీజేపీ స‌హ ఇంచార్జ్, బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి సునీల్ దేవ‌ధ‌ర్ కూడా ధ్రువీక‌రించారు. త‌మ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు తిరుప‌తిలో బీజేపీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. అయితే.. సోము వీర్రాజు మాత్రం న‌ర్మ‌గర్భంగా వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేసేందుకు ఉద్దేశించి ఈ కార్యాల‌యాన్ని ప్రారంభించిన‌ట్టు తెలిపారు. కాగా, ఇప్ప‌టికే తిరుప‌తి ఉప ఎన్నిక‌కు సంబంధించిన ఏర్పాట్ల‌లో బీజేపీ నేత‌లు త‌ల‌మున‌క‌ల‌య్యారు. కీల‌క నేత‌ల‌ను ఇక్క‌డ నుంచి ప్ర‌చారం చేయించేలా ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

ఈ క్ర‌మంలోనే సోము వీర్రాజు ఎస్సీ సామాజిక వ‌ర్గంతో పాటు వెనుక‌బ‌డిన త‌ర‌గతుల‌కు చెందిన కీల‌క నేత‌ల‌తోనూ ఆయ‌న స‌మేశ‌మ‌య్యారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. అదేవిధంగా స్థానికంగా బ‌ల‌మైన నాయ‌కుతోనూ సోము స‌మావేశ‌మై.. చ‌ర్చించి, ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. కాగా, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచిన బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ అకాల మ‌ర‌ణంతో ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇదిలావుంటే.. ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ ఇప్ప‌టికే ఇక్క‌డ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన ప‌న‌బాక ల‌క్ష్మికే మ‌రోసారి చంద్ర‌బాబు అవ‌కాశం ఇచ్చారు.

This post was last modified on December 25, 2020 11:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బుచ్చిబాబు లెక్కలు వేరే ఉన్నాయా

నిన్న విడుదలైన పెద్ది ట్రైలర్ కు అందరి నుంచి యునానిమస్ రెస్పాన్స్ రాలేదు. అధిక శాతం ఫ్యాన్స్ అదిరిపోయిందనే అభిప్రాయం…

14 minutes ago

విజ‌య్ నుంచి చాలా నేర్చుకోవాలేమో జ‌గ‌న్ స‌ర్‌!

త‌మిళ‌నాడులో టీవీకే అధినేత‌ విజ‌య్ గెలుపు గుర్రం ఎక్క‌డం, అక్క‌డ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం విష‌యంలో వైసీపీ నాయకులు పెద్ద…

31 minutes ago

జాక్వెలిన్ బ్లాక్ మ్యాజిక్.. ఆ అందమేంటీ మేడమ్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో చోపార్డ్ మిరాకిల్ గాలాకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వేసుకొచ్చిన ఈ బ్లాక్ డ్రెస్ అందరి దృష్టిని…

1 hour ago

ఐపీఎల్ లో ధోనీ… ఇదే ఫైనల్ ఆన్సరా?

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చెపాక్ మైదానంలో వరుసగా చేదు జ్ఞాపకాలు మిగిలేలా ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో…

2 hours ago

సేఫ్ గేమ్ ఆడాలి జన నాయకా

ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదు కానీ తమిళనాడు సీఎం విజయ్ కొత్త సినిమా జన నాయకుడు రిలీజ్ అతి…

2 hours ago

సీఎం వెనుక దర్శకుడి పట్టుదల

విజయ్ భవిష్యత్తుని ముందే ఊహించాడు అనడం కంటే, వెంకట్ ప్రభు దాన్ని తెర మీద పట్టుబట్టి చూపించాడు అనడం కరెక్ట్.…

3 hours ago