సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి పనితీరు మెచ్చుకుంటాయి. మరింత మెరుగు పరుచుకోవాలని కూడా సూచిస్తాయి. తద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. దీనికి భిన్నంగా కూటమిలోని మిత్రపక్షం జనసేన ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు బహిరంగ వేదికగానే ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్యే పనితీరును ఆయన మెచ్చుకున్నారు.
తాజాగా నాయుడుపేటలో పార్టీకార్యకర్తలతో భేటీ అయిన చంద్రబాబు.. నాయకుల పనితీరు ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై స్పందించారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు చేశారు. ఇదేసమయంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై ప్రశంసలు గుప్పించారు. ఆయన పనితీరును కొనియాడారు. గత ఎన్నికలకు ముందు వరకు ఆరణి వైసీపీలో ఉన్నారు. అయితే..టికెట్పై సందేహాలు రావడంతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. నిజానికి ఆయన నియోజకవర్గంలో పెద్దగా పర్యటించరు. అనారోగ్య కారణాలతో తనబాధ్యతలను తన సోదరుల కుమారులకు అప్పగించారు. అయితే.. పార్టీ అధినేత కానీ.. సీఎం చంద్రబాబుకానీ.. నియోజకవర్గానికి వచ్చినప్పుడు యాక్టివ్గా వారితో కలిసి వేదిక పంచుకుంటున్నారు. ఈ విషయాన్నే చంద్రబాబు ప్రస్తావించారు. పేరు చెప్పకుండానే.. జనసేన ఎమ్మెల్యే బాగా వ్యవహరిస్తున్నారు అని కితాబు ఇచ్చారు.
దీనికి కారణం.. కూడా చంద్రబాబు చెప్పారు. “నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నారా? లేదా? అనేది నేను చెప్పను. కానీ.. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలు గుర్తిస్తున్నారు. కార్యకర్తల కష్టాలు తెలుసుకుని వారికి సాయం అందిస్తున్నారు. ఇది ఆయనకే కాకుండా.. పార్టీకి కూడా మేలు చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమమే కొన్ని కొన్ని సార్లు ఓటర్లను నిర్ణయించలేవు. మన ప్రవర్తన కూడా నిర్ణయిస్తుంది. ఇలాంటి ప్రవర్తనలో జనసేన ఎమ్మెల్యే తీరు చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటివి అలవరుచుకోవాలి.“ అని చంద్రబాబు సూచించారు.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…