సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి పనితీరు మెచ్చుకుంటాయి. మరింత మెరుగు పరుచుకోవాలని కూడా సూచిస్తాయి. తద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. దీనికి భిన్నంగా కూటమిలోని మిత్రపక్షం జనసేన ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు బహిరంగ వేదికగానే ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్యే పనితీరును ఆయన మెచ్చుకున్నారు.
తాజాగా నాయుడుపేటలో పార్టీకార్యకర్తలతో భేటీ అయిన చంద్రబాబు.. నాయకుల పనితీరు ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై స్పందించారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు చేశారు. ఇదేసమయంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై ప్రశంసలు గుప్పించారు. ఆయన పనితీరును కొనియాడారు. గత ఎన్నికలకు ముందు వరకు ఆరణి వైసీపీలో ఉన్నారు. అయితే..టికెట్పై సందేహాలు రావడంతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. నిజానికి ఆయన నియోజకవర్గంలో పెద్దగా పర్యటించరు. అనారోగ్య కారణాలతో తనబాధ్యతలను తన సోదరుల కుమారులకు అప్పగించారు. అయితే.. పార్టీ అధినేత కానీ.. సీఎం చంద్రబాబుకానీ.. నియోజకవర్గానికి వచ్చినప్పుడు యాక్టివ్గా వారితో కలిసి వేదిక పంచుకుంటున్నారు. ఈ విషయాన్నే చంద్రబాబు ప్రస్తావించారు. పేరు చెప్పకుండానే.. జనసేన ఎమ్మెల్యే బాగా వ్యవహరిస్తున్నారు అని కితాబు ఇచ్చారు.
దీనికి కారణం.. కూడా చంద్రబాబు చెప్పారు. “నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నారా? లేదా? అనేది నేను చెప్పను. కానీ.. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలు గుర్తిస్తున్నారు. కార్యకర్తల కష్టాలు తెలుసుకుని వారికి సాయం అందిస్తున్నారు. ఇది ఆయనకే కాకుండా.. పార్టీకి కూడా మేలు చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమమే కొన్ని కొన్ని సార్లు ఓటర్లను నిర్ణయించలేవు. మన ప్రవర్తన కూడా నిర్ణయిస్తుంది. ఇలాంటి ప్రవర్తనలో జనసేన ఎమ్మెల్యే తీరు చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటివి అలవరుచుకోవాలి.“ అని చంద్రబాబు సూచించారు.
This post was last modified on March 31, 2026 3:13 pm
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్…
పదహారు సంవత్సరాల క్రితం 2010లో విడుదలైన డార్లింగ్ అంటే ప్రభాస్ అభిమానులకు ఒక స్పెషల్ ఎమోషన్. మాస్ ఫార్ములాకు దూరంగా…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన నాలుగు నిర్మాతల మండళ్లు ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో…
మన దగ్గర మిడ్ రేంజ్ హీరోల మీద వంద కోట్ల బడ్జెట్లు పెట్టేస్తున్నారు నిర్మాతలు. తీరా చూస్తే తెర మీద…
తెలుగు టీవీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన షోగా జబర్దస్త్ను చెప్పొచ్చు. అందులో డబుల్ మీనింగ్లు, బాడీ షేమింగ్ల గురించి అభ్యంతరాలు…