Political News

ఈ జల జగడానికి కారణమెవరు…?

తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు నీటి పంచాయతీ నెలకొంది. ఈ సందర్భంగా ఏపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసిన తెలంగాణ ఏకంగా ధర్నాకు దిగిందట. పొరుగు రాష్ట్రం ధర్నాకు దిగిన తర్వాత గానీ ఏపీ తన తప్పును తెలుసుకుని వ్యవహరించిందట. ఈ మేరకు తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన టీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏపీకి ఓ రేంజిలో వార్నింగ్ ఇచ్చారు. తమకు అన్యాయం జరిగితే ఇకపై చూస్తూ ఊరుకోబోమని ఆయన ఏపీకి వార్నింగ్ కూడా ఇచ్చారు.

గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య పెద్దగా పంచాయతీ లేకున్నా… కృష్ణా నదీ జలాల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటికప్పుడు వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. దిగువన ఉన్న ఏపీ.. ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తున్న కారణంగానే ఈ వివాదాలు పుట్టుకొస్తున్నాయని తెలంగాణ వాదిస్తూ ఉంటే… దిగువన ఉన్న రాష్ట్రంగా తాము నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్న నీటిని కూడా వినియోగించుకునే హక్కు లేదా? అంటూ ఏపీ వాదిస్తోంది. మొత్తంగా కృష్ణా జలాలపై జరుగుతున్న ఈ నీటి వివాదాలు ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణానికి దారి తీస్తున్నాయి.

తాజాగా వచ్చిన వివాదంలోకి వెళితే… శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నిర్ణీత నిల్వ వరకే విద్యుత్ వినియోగాన్ని చేపట్టాలి. అయితే ఈ దఫా ఏపీ ఆ నిల్వ పరిమితి సమీపించినా… విద్యుత్ వినియోగాన్ని ఆపలేదట. ఇదే విషయాన్ని చెప్పినా ఏపీ వినడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది. అయితే కేవలం తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాల్సి ఉందని. ఈ పరిమితి దాటి విద్యుత్ వినియోగం ఎలా చేపడతారంటూ తెలంగాణకు చెందిన ప్రజలు ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగారట. 

తెలంగాణ ధర్నాతో పరిస్ఠితి ఉద్రిక్తంగా మారుతోందని గ్రహించిన ఏపీ అప్పటికప్పుడు విద్యుత్ వినియోగాన్ని నిలిపివేసిందట. వాస్తవంగా ఆ పరిమితి దాటి విద్యుత్ వినియోగానికి నీటిని కిందకు వదిలితే… తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి అవసరాలు ప్రమాదంలో పడతాయట.

ఇంతటి ప్రాధాన్యం కలిగిన విషయాన్ని కూడా మరిచిన ఏపీ యధేచ్ఛగా విద్యుత్ వినియోగం చేపట్టిందని జూపల్లి ఆరోపిస్తున్నారు. ఇకపై ఈ రీతిన ఏపీ వ్యవహరిస్తే సహించేది లేదని కూడా ఆయన ఘాటుగా స్పందించారు. మరి నీటి వినియోగంలో ఇప్పటికైనా కేఆర్ఎంబీ మార్గదర్శకాలను ఇరు రాష్ట్రాలు పాటించాల్సిన అవసరం ఉందన్న వాదన అయితే బలంగా వినిపిస్తోంది.

This post was last modified on March 31, 2026 2:49 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

38 minutes ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

2 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

3 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

3 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

5 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

6 hours ago