Political News

మిత్రపక్షాల మధ్య ‘తిరుపతి’ చిచ్చు

మొత్తానికి తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక మిత్రపక్షాల మధ్య పెద్ద చిచ్చుపెట్టటం ఖాయమనే అనుమానంగా ఉంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేయబోయేది జనసేన అభ్యర్ధే అని అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం ఊపందుకుంది. లోక్ సభ ఉపఎన్నికల కోసం పవన్ నియమించిన సమన్వయ కమిటి తన పర్యటనను పూర్తి చేసిందట. తర్వాత సభ్యులంతా కలిసి తయారు చేసిన నివేదికను పవన్ కు అందించారని సమాచారం.

నివేదికలోని అంశాలను పరిశీలించిన తర్వాత ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి కన్నా జనసేన అభ్యర్ధి పోటీ చేస్తేనే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అందుకనే ఉపఎన్నికల్లో మన పార్టీ అభ్యర్ధే పోటీ చేస్తారని పార్టీలోని ముఖ్యనేతలకు పవన్ నుండి వరుసగా సమాచారం అందుతోందట. బీజేపీనే పోటీ చేస్తుందని పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన ఏకపక్షమని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు.

ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేస్తాడనే విషయం నిర్ణయించాల్సింది ఢిల్లీ నాయకత్వమే కానీ వీర్రాజు కాదంటూ జనసేన కీలక నేత కిరణ్ రాయల్ ప్రకటించటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికలో బీజేపీకి నోటాకన్నా తక్కువ ఓట్లు పోలైన విషయాన్ని కూడా కిరణ్ ప్రస్తావించారు. ప్రత్యేకహోదా విషయంలో 2014 ఎన్నికల్లో నరేంద్రమోడి హామీ ఇచ్చి తప్పడం, తిరుపతి అభివృద్ధి అంతా తాము చేసిందే అని చెప్పుకుంటున్న వీర్రాజు మాటల్లోని డొల్లతనం అందరికీ తెలుసని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు.

మొత్తానికి తిరుపతి ఉపఎన్నిక రెండు పార్టీల మద్య పెద్ద చిచ్చు పెట్టే అవకాశమే ఉందని అనుకుంటున్నారు. వీర్రాజు తొందరపాటు ప్రకటనలు చేస్తున్నట్లు కమలం పార్టీ నేతల్లోనే ఆందోళనలు మొదలయ్యాయి. తిరుపతి ఉపఎన్నిక విషయంలో రెండుపార్టీలతో ఓ కమిటిని వేస్తామని స్వయంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే చెప్పిన విషయాన్ని జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు. ఓవైపు నడ్డా ప్రకటన చేసిన కొద్దిరోజులకే బీజేపీనే పోటీ చేస్తుందని వీర్రాజు ప్రకటించటాన్ని రెండుపార్టీల్లోని నేతలు ఆక్షేపిస్తున్నారు. మరి ఉపఎన్నికలో చివరకు ఏపార్టీ అభ్యర్ధి పోటీ చేస్తారనే ఉత్కఠ మాత్రం పెరిగిపోతోంది.

This post was last modified on December 22, 2020 12:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

27 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago