పదిమందిని మెప్పించగల మాట నేర్పు ఉందా? సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ఆకర్షించగల నైపుణ్యం ఉందా? అయితే.. రాజకీయాలన్నీ మీవే!. త్వరలోనే.. దేశవ్యాప్తంగా కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బలమైన పోటీ పడుతున్న ప్రధాన పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నాయి.
వీటిలో ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రజలను ప్రభావితం చేయగల ఇన్ఫ్లుయెన్సర్ల కోసం.. పార్టీలు క్యూ కడుతున్నాయి. వీరి ద్వారా ప్రచారం చేయిస్తే.. తమ అభ్యర్థులు గెలుపు గుర్రం ఎక్కడం.. ఈజీ అవుతుందని, తమ పార్టీ అధికారంలోకి రావడం మరింత తేలిక అవుతుందని భావిస్తున్నారు. ఈ నేప థ్యంలో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునేందుకు ఇన్ఫ్లెయెన్సర్ల కోసం పార్టీల వేట కొనసాగుతోంది.
పశ్చిమ బెంగాల్,తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలోనూ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు బీజేపీ సహా.. ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు కీలకంగా మారాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్రజలను మచ్చిక చేసుకునేందుకు తమకు ఉన్న అన్ని మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియా అయితే.. ప్రతి ఒక్కరికీ చేరుతుందని భావిస్తున్న పార్టీలు.. ఆదిశగా ఇన్ఫ్లుయెన్సర్లను ఆశ్రయిస్తున్నాయి.
రీల్ లేదా 2 నిమిషాల నిడివి ఉన్న వీడియోలు చేసి.. ప్రజలను ఆకర్షించే వారికి మంచి మంచి ప్యాకేజీలను కూడా పార్టీలు అందిస్తున్నాయి. అయితే.. సోషల్ మీడియాలో ప్రచారంపై ఎన్నికల సంఘం దృష్టి సారించకముందే.. ఈ పనిని పూర్తి చేయాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఈ క్రమంలో సాధ్యమైనంత వేగంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని ప్రారంభించనున్నాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, తమిళనా డు రాష్ట్రాలు ఈ విషయంలో ముందున్నాయి.
This post was last modified on February 27, 2026 12:33 pm
“జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నగరిలో ఏం జరుగుతోంది? నాయకులు ఏం చేస్తున్నారు? అంటే.. అంతా ప్రస్తుతం సైలెంట్గానే…
కొందరు నాయకులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా సహకరిస్తారు. ఇది ఎక్కడైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో…
ఏపీలో ఒకేసారి రెండు కీలక సమస్యలు రాష్ట్రంలో అలజడి రేపుతున్నాయి. ఈ రెండు కూడా సాధారణ ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు…
టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో జింబాబ్వేపై 72 పరుగుల…
వైసీపీ హయాంలో జరిగిన మద్యం అక్రమాలకు సంబంధించి ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు తాజాగా మరో…