నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులు సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. ఆయనతో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాతే.. రాష్ట్ర ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నకిలీ నెయ్యి వినియోగంపై ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి.. వేమిరెడ్డి-సీఎంతో భేటీ అయిన దానికి పెద్ద సంబంధమే ఉందని అంటున్నారు పరిశీలకులు.
వేమిరెడ్డి గతంలో వైసీపీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన సతీమణి అప్పట్లోనే టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి పీఏ.. చిన్న అప్పన్న వ్యవహారాన్ని వేమిరెడ్డి చూశారని.. ఆయన ప్రోద్బలంతోనే చిన్నప్పన్నకు ఢిల్లీలో పదవి దక్కిందని.. దీనికి వైవీకి సంబంధం లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం చిన్న అప్పన్న ఖాతాలో 4.6 కోట్ల రూపాయల నిధులు అక్రమంగా వచ్చాయన్నది సీబీఐ చెబుతున్న వాదన.
ఈ క్రమంలో చిన్న అప్పన్న.. వైవీ సుబ్బారెడ్డి అనుచరుడని ప్రభుత్వం చెబుతుంటే.. కాదు..వేమిరెడ్డి అనుచరుడుగా మారారని.. అప్పన్న ఖాతాలో ఉన్నవి ఆయన సొమ్ములేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. దీనిపై నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉన్న వేమిరెడ్డి.. తాజాగా నోరు విప్పారని పొలిటికల్ టాక్. వైవీ సుబ్బారెడ్డి చెప్పినందునే.. చిన్న అప్పన్న వ్యవహారాన్ని తాను చూశానని.. కొంత మేరకు సాయం చేసింది కూడా వాస్తవమేనని చెప్పారు.
అయితే.. తనకు ఈ విషయంలో నేరుగా ఎలాంటి సంబంధం లేదని కూడా వేమిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. చిన్న అప్పన్నతో తనకు ఉన్న సంబంధాలు.. నగదు బదిలీ కి సంబంధించిన అంశాలపై సీఎం చంద్రబాబు వేమిరెడ్డి పూస గుచ్చినట్టు వివరించారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
సీబీఐ విచారణకు రాని అనేక అంశాలు కూడా దీనిలో ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైవీ కేంద్రంగా ఏకసభ్య కమిషన్ విచారణ జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందనే విషయంపై వైసీపీలో పెను కలకలం చోటు చేసుకుంది.
This post was last modified on February 23, 2026 8:31 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…