Political News

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి నష్టం కలిగించాయని భావిస్తున్న ప్రభుత్వం, ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే కొన్ని నిర్ణయాలను రద్దు చేసిన ప్రభుత్వం, తాజాగా రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.

వైసీపీ హయాంలో రాజధాని కోర్ ఏరియాలోని ఐదు జోన్లలో ఐదవ జోన్ అయిన ఆర్ 5ను పేదలకు కేటాయించారు. వాస్తవానికి ఈ భూములు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల కోసం ఉద్దేశించినవి. అయితే జగన్ అన్న ఇళ్ల కాలనీల పేరుతో అప్పటి ప్రభుత్వం ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించింది. అప్పట్లోనే టీడీపీతో పాటు రైతులు కూడా దీనిపై న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ విషయం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది.

ఇప్పటికే రాజధానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, ఈ భూములను మళ్లీ పరిశ్రమల కోసం వినియోగించాలనే నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఆర్ 5 జోన్ కు సంబంధించిన పేదలకు కేటాయించిన జీవోను రద్దు చేయాలని నిర్ణయించారు.

ఆర్ 5 జోన్ లోని 1400 ఎకరాల భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సీఆర్ డీఏకు తిరిగి అప్పగించనున్నారు. ఈ భూములను పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

అయితే పేదలకు అన్యాయం జరగకుండా, గతంలో పత్తాలు పొందిన వారికి వారి వారి జిల్లాల్లో డబుల్ స్థాయిలో భూములు కేటాయించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఉగాది నాటికి పూర్తి

రాజధాని ప్రాంతంలో గతంలో భూములు పొందిన పేదలకు వారి జిల్లాల్లోనే డబుల్ స్థాయిలో భూములు కేటాయించే ప్రక్రియను ఉగాది నాటికి మార్చి 19 లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ శాఖకు తక్షణమే సూచనలు జారీ చేశారు.

దాదాపు 50 వేల పేద కుటుంబాలకు రెండు సెంట్ల చొప్పున భూములు కేటాయించనున్నారు. ఒకవేళ భూములు వద్దనుకునే వారికి టిడ్కో ఇళ్లను ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

రాజధాని అభివృద్ధిని కాపాడుతూ, పేదల ప్రయోజనాలను కూడా పరిరక్షించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

This post was last modified on February 23, 2026 12:26 am

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

36 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago