Political News

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి నష్టం కలిగించాయని భావిస్తున్న ప్రభుత్వం, ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే కొన్ని నిర్ణయాలను రద్దు చేసిన ప్రభుత్వం, తాజాగా రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.

వైసీపీ హయాంలో రాజధాని కోర్ ఏరియాలోని ఐదు జోన్లలో ఐదవ జోన్ అయిన ఆర్ 5ను పేదలకు కేటాయించారు. వాస్తవానికి ఈ భూములు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల కోసం ఉద్దేశించినవి. అయితే జగన్ అన్న ఇళ్ల కాలనీల పేరుతో అప్పటి ప్రభుత్వం ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించింది. అప్పట్లోనే టీడీపీతో పాటు రైతులు కూడా దీనిపై న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ విషయం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది.

ఇప్పటికే రాజధానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, ఈ భూములను మళ్లీ పరిశ్రమల కోసం వినియోగించాలనే నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఆర్ 5 జోన్ కు సంబంధించిన పేదలకు కేటాయించిన జీవోను రద్దు చేయాలని నిర్ణయించారు.

ఆర్ 5 జోన్ లోని 1400 ఎకరాల భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సీఆర్ డీఏకు తిరిగి అప్పగించనున్నారు. ఈ భూములను పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

అయితే పేదలకు అన్యాయం జరగకుండా, గతంలో పత్తాలు పొందిన వారికి వారి వారి జిల్లాల్లో డబుల్ స్థాయిలో భూములు కేటాయించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఉగాది నాటికి పూర్తి

రాజధాని ప్రాంతంలో గతంలో భూములు పొందిన పేదలకు వారి జిల్లాల్లోనే డబుల్ స్థాయిలో భూములు కేటాయించే ప్రక్రియను ఉగాది నాటికి మార్చి 19 లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ శాఖకు తక్షణమే సూచనలు జారీ చేశారు.

దాదాపు 50 వేల పేద కుటుంబాలకు రెండు సెంట్ల చొప్పున భూములు కేటాయించనున్నారు. ఒకవేళ భూములు వద్దనుకునే వారికి టిడ్కో ఇళ్లను ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

రాజధాని అభివృద్ధిని కాపాడుతూ, పేదల ప్రయోజనాలను కూడా పరిరక్షించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

This post was last modified on February 23, 2026 12:26 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

25 minutes ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

1 hour ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago

అస్సీలో అంత మ్యాటర్ ఉందంటారా

గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…

5 hours ago