Political News

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి నష్టం కలిగించాయని భావిస్తున్న ప్రభుత్వం, ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే కొన్ని నిర్ణయాలను రద్దు చేసిన ప్రభుత్వం, తాజాగా రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.

వైసీపీ హయాంలో రాజధాని కోర్ ఏరియాలోని ఐదు జోన్లలో ఐదవ జోన్ అయిన ఆర్ 5ను పేదలకు కేటాయించారు. వాస్తవానికి ఈ భూములు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల కోసం ఉద్దేశించినవి. అయితే జగన్ అన్న ఇళ్ల కాలనీల పేరుతో అప్పటి ప్రభుత్వం ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించింది. అప్పట్లోనే టీడీపీతో పాటు రైతులు కూడా దీనిపై న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ విషయం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది.

ఇప్పటికే రాజధానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, ఈ భూములను మళ్లీ పరిశ్రమల కోసం వినియోగించాలనే నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఆర్ 5 జోన్ కు సంబంధించిన పేదలకు కేటాయించిన జీవోను రద్దు చేయాలని నిర్ణయించారు.

ఆర్ 5 జోన్ లోని 1400 ఎకరాల భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సీఆర్ డీఏకు తిరిగి అప్పగించనున్నారు. ఈ భూములను పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

అయితే పేదలకు అన్యాయం జరగకుండా, గతంలో పత్తాలు పొందిన వారికి వారి వారి జిల్లాల్లో డబుల్ స్థాయిలో భూములు కేటాయించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఉగాది నాటికి పూర్తి

రాజధాని ప్రాంతంలో గతంలో భూములు పొందిన పేదలకు వారి జిల్లాల్లోనే డబుల్ స్థాయిలో భూములు కేటాయించే ప్రక్రియను ఉగాది నాటికి మార్చి 19 లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ శాఖకు తక్షణమే సూచనలు జారీ చేశారు.

దాదాపు 50 వేల పేద కుటుంబాలకు రెండు సెంట్ల చొప్పున భూములు కేటాయించనున్నారు. ఒకవేళ భూములు వద్దనుకునే వారికి టిడ్కో ఇళ్లను ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

రాజధాని అభివృద్ధిని కాపాడుతూ, పేదల ప్రయోజనాలను కూడా పరిరక్షించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Satya

Recent Posts

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

39 minutes ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

2 hours ago

చివరి గీతం… ‘గాన కోకిల’ జానకి ఇక లేరు

సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…

3 hours ago

తెలంగాణ హంత‌కుడిది – జ‌గ‌న్‌ది ఒకే పోలిక‌: చంద్ర‌బాబు

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఓ వ్య‌క్తి ఆరుగురిని…

3 hours ago

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

7 hours ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

7 hours ago