Political News

ప‌త్తికొండ రాజ‌కీయం యూట‌ర్న్‌.. ఎందుకిలా?

క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. జిల్లాలోని మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ దూకుడును త‌ట్టుకుని టీడీపీ విజ‌యం సాధించిన సంద‌ర్భాలు ఉన్నా.. త‌ర్వాత కాలంలో మాత్రం.. ఓడుతూ వ‌చ్చింది. కానీ, ప‌త్తికొండ‌లో మాత్రం 1994 ఎన్నిక‌ల నుంచి 2014 ఎన్నిక‌ల వ‌ర‌కు టీడీపీ విజ‌యం సాధించింది. నాయ‌కులు మారినా.. పార్టీ పునాదులు ఎక్క‌డా స‌డ‌లిపోలేదు. 1994 నుంచి 2004 వ‌ర‌కు ఎస్వీ సుబ్బారెడ్డి విజ‌యం సాధించారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రులు వ‌రుస విజ‌యాలు సాధించి టీడీపీ జెండా ఎగ‌రేశారు. పైగా వీరి దూకుడుతో కాంగ్రెస్ నాయ‌కులు చాలా మంది టీడీపీలోకి చేరిపోయారు. ఫ‌లితంగా కాంగ్రెస్ జెండా ప‌ట్టుకునే నాయ‌కులు కూడా ఇక్క‌డ క‌రువ‌య్యారు.

కానీ, చెరుకులపాడు నారాయ‌ణ‌రెడ్డి దూకుడును మాత్రం కేఈ కుటుంబం నిలువ‌రించ‌లేక పోయింది. కాంగ్రెస్ త‌ర‌ఫున ఆయ‌న తుదికంటా హ‌వా చ‌లాయించారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత వైసీపీకి అనుకూలంగా చ‌క్రం తిప్పారు. అనూహ్యంగా ఆయ‌న హ‌త్య‌కు గుర‌య్యారు. అయితే.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స‌తీమ‌ణి శ్రీదేవికి జ‌గ‌న్ టికెట్ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో తొలి టికెట్ ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా గ‌త ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం.. టీడీపీ రాజ‌కీయాల‌ను యూట‌ర్న్ తీసుకునేలా చేసింది. ఇక్క‌డ కీల‌క‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని అనుకున్న చంద్ర‌బాబు కేఈ కృష్ణ‌మూర్తి కుమారుడు శ్యాం బాబుకు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. పైగా చెరుకుల‌పాడు హ‌త్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఇదిలావుంటే.. వైసీపీ త‌ర‌ఫున గెలిచిన శ్రీదేవి.. ఆదిలో ఒకింత దూకుడు రాజ‌కీయాలు చేసినా.. త‌ర్వాత త‌ర్వాత మాత్రం తాను త‌ప్పుకొని త‌న కుమారుడు, అల్లుడుకు ప‌గ్గాలు అప్ప‌గించార‌నే వాద‌న వినిపిస్తోంది. వారే ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నారు. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పుతార‌ని అనుకున్న కేఈ కుమారుడు, ఆయ‌న ఫ్యామిలీ మౌనం పాటిస్తున్నారు. శ్రీదేవి దూకుడుతో వీరు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యార‌ని అంటున్నారు. దీంతో కేఈ కుటుంబం రాజ‌కీయాలు ఇక్క‌డ ఎక్క‌డా వినిపించ‌డం లేదు. పైగా టీడీపీ త‌ర‌ఫున జెండా మోసే వారు కూడా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పోనీ.. గెలిచిన నాయ‌కురాలు శ్రీదేవి అయినా.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నారా? అంటే.. అదీ లేదు.

ఇటు టీడీపీ నేత‌లు.. అవ‌కాశం ఉండి కూడా జోరు చూపించ‌లేక పోతున్నారు. దీంతో టీడీపీ నేత‌లు యూట‌ర్న్ తీసుకోవ‌డం.. పార్టీ జెండా మోసే నాయ‌కులు కూడా క‌నిపించ‌క పోవ‌డం.. గ‌త ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎంగా చ‌క్రం తిప్పిన‌ కృష్ణ‌మూర్తి రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం వంటివి.. టీడీపీకి ఇబ్బందిక‌రంగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చంద్ర‌బాబు కూడా ఇక్క‌డి ప‌రిస్థితిని ప‌ట్టించుకోక పోవ‌డం మ‌రో కీల‌క‌మైన విష‌యం. మ‌రి ఎప్ప‌టికి ఇక్క‌డి ప‌రిస్థితి మారుతుందో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 19, 2020 6:26 pm

Share

Recent Posts

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

7 minutes ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

1 hour ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

2 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

2 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

3 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

4 hours ago